అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాథ చిత్రాలతో తనపై అంచనాలు పెంచిన దర్శకుడు హను రాఘవపూడి. కానీ ఆ అంచనాలకు ఏమాత్రం తగని సినిమాలతో తనపై అందరూ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడతను. భారీ బడ్జెట్లలో అతను తీసిన ‘లై’, ‘పడి పడి లేచె మనసు’ సినిమాలు దారుణమైన ఫలితాలందుకుని నిర్మాతల్ని ముంచేశాయి.
ముఖ్యంగా ‘పడి పడి..’తో హనుకు చాలా చెడ్డ పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత అతడికి అవకాశాలు రావడం కష్టమే అనుకున్నారంతా. కానీ వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద సంస్థలో అతడికి తర్వాతి సినిమా చేసే అవకాశం వచ్చింది. వైజయంతి సమర్పణలో స్వప్న సినిమా బేనర్ మీద హను దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రాన్ని మంగళవారమే ప్రకటించారు. దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రం ఆసక్తికర ప్రి లుక్ పోస్టర్తో అందరి దృష్టినీ ఆకర్షించింది.
1964 ప్రాంతంలో జరిగిన ఇండియా-చైనా యుద్ధం నేపథ్యంలో తెరకెక్కనున్న ప్రేమకథ ఇదని ప్రి లుక్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ‘మహానటి’తో పీరియడ్ సినిమాలు తీయడంలో ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసిన వైజయంతీ-స్వప్న సంస్థలు ఈసారి వేరే నేపథ్యం తీసుకుని మరో విభిన్నమైన పీరియడ్ ఫిలిం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి ప్రి లుక్ పోస్టర్ అయితే సినిమాపై అంచనాలు పెంచేలాగే ఉంది.
ఇదిలా ఉంటే.. హను గురువు అయిన విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కెరీర్ ఆరంభంలో ఒక వార్ ఫిలిం చేయాలని ఆశపడ్డాడు. ఉదయ్ కిరణ్ హీరోగా ఆ సినిమాను మొదలు పెట్టాడు కూడా. అందులో ఉదయ్ను సైనికుడిగా చూపించనున్నట్లు కూడా ప్రారంభోత్సవం రోజే ప్రకటించాడు. కానీ ఏమైందో ఏమో.. ఆ సినిమా ఆగిపోయింది. కట్ చేస్తే యేలేటి శిష్యుడు వార్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేయబోతున్నాడు. బహుశా గురువు నుంచే స్ఫూర్తి పొంది హను.. ఆయన చేయలేకపోయినది తాను చేస్తున్నాడేమో.
This post was last modified on August 1, 2020 10:22 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…