టాలీవుడ్లో హడావుడి పడకుండా.. బాగా ఆలోచించి.. ఆచితూచి.. మంచి కాంబినేషన్లు సెట్ చేసుకుని సినిమాలు చేసే హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. అందుకేనేమో.. అతడి సక్సెస్ రేట్ చాలామంది హీరోలతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది. ‘నా పేరు సూర్య’తో చేదు అనుభవం ఎదుర్కొన్నాక బన్నీ.. ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని చేసిన ‘అల వైకుంఠపురములో’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే.
దీని తర్వాత తన ఫేవరెట్ డైరెక్టర్ సుకుమార్తో కలిసి ‘పుష్ప’ చేస్తున్నాడు అల్లు హీరో. ఈ చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనివార్య కారణాలతో కొంచెం ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్లబోతోందీ చిత్రం. ఈ మధ్య దొరికిన విరామంలో బన్నీ.. ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్కు ఓకే చేసుకున్నట్లు సమాచారం.
కమర్షియల్ సినిమాలకు తనదైన ‘సోషల్’ టచ్ ఇచ్చి వరుస విజయాలందుకున్న కొరటాల శివతో పని చేయాలని బన్నీ ఆసక్తితో ఉన్నాడు. లాక్ డౌన్ టైంలో ఇద్దరి మధ్య సంప్రదింపులు జరిగాయి.. తర్వాత అవి కథా చర్చల దశకు కూడా వెళ్లాయని.. ఇటు బన్నీ ‘పుష్ప’ చిత్రాన్ని, అటు కొరటాల ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేశాక కలిసి సినిమా చేయడానికి అంగీకారం కుదిరిందని విశ్వసనీయ సమాచారం.
ఈ చిత్రంలో బన్నీ స్టూడెంట్ లీడర్గా కనిపిస్తాడని.. రాజకీయాలు, సామాజిక అంశాల చుట్టూ కథ నడుస్తుందని.. కొరటాల మార్కు కథాంశానికి బన్నీ పవర్ కూడా తోడైతే సినిమా రేంజే వేరుగా ఉంటుందని అంటున్నారు. ఇంకా ఈ చిత్రానికి నిర్మాత ఖరారవ్వలేదు. సబ్జెక్టుపై మంచి గురి ఉంటే.. అల్లు అరవిందే రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.
This post was last modified on July 29, 2020 2:38 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…