టాలీవుడ్లో హడావుడి పడకుండా.. బాగా ఆలోచించి.. ఆచితూచి.. మంచి కాంబినేషన్లు సెట్ చేసుకుని సినిమాలు చేసే హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. అందుకేనేమో.. అతడి సక్సెస్ రేట్ చాలామంది హీరోలతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది. ‘నా పేరు సూర్య’తో చేదు అనుభవం ఎదుర్కొన్నాక బన్నీ.. ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని చేసిన ‘అల వైకుంఠపురములో’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే.
దీని తర్వాత తన ఫేవరెట్ డైరెక్టర్ సుకుమార్తో కలిసి ‘పుష్ప’ చేస్తున్నాడు అల్లు హీరో. ఈ చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనివార్య కారణాలతో కొంచెం ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్లబోతోందీ చిత్రం. ఈ మధ్య దొరికిన విరామంలో బన్నీ.. ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్కు ఓకే చేసుకున్నట్లు సమాచారం.
కమర్షియల్ సినిమాలకు తనదైన ‘సోషల్’ టచ్ ఇచ్చి వరుస విజయాలందుకున్న కొరటాల శివతో పని చేయాలని బన్నీ ఆసక్తితో ఉన్నాడు. లాక్ డౌన్ టైంలో ఇద్దరి మధ్య సంప్రదింపులు జరిగాయి.. తర్వాత అవి కథా చర్చల దశకు కూడా వెళ్లాయని.. ఇటు బన్నీ ‘పుష్ప’ చిత్రాన్ని, అటు కొరటాల ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేశాక కలిసి సినిమా చేయడానికి అంగీకారం కుదిరిందని విశ్వసనీయ సమాచారం.
ఈ చిత్రంలో బన్నీ స్టూడెంట్ లీడర్గా కనిపిస్తాడని.. రాజకీయాలు, సామాజిక అంశాల చుట్టూ కథ నడుస్తుందని.. కొరటాల మార్కు కథాంశానికి బన్నీ పవర్ కూడా తోడైతే సినిమా రేంజే వేరుగా ఉంటుందని అంటున్నారు. ఇంకా ఈ చిత్రానికి నిర్మాత ఖరారవ్వలేదు. సబ్జెక్టుపై మంచి గురి ఉంటే.. అల్లు అరవిందే రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.
This post was last modified on July 29, 2020 2:38 pm
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…