టాలీవుడ్లో హడావుడి పడకుండా.. బాగా ఆలోచించి.. ఆచితూచి.. మంచి కాంబినేషన్లు సెట్ చేసుకుని సినిమాలు చేసే హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. అందుకేనేమో.. అతడి సక్సెస్ రేట్ చాలామంది హీరోలతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది. ‘నా పేరు సూర్య’తో చేదు అనుభవం ఎదుర్కొన్నాక బన్నీ.. ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని చేసిన ‘అల వైకుంఠపురములో’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే.
దీని తర్వాత తన ఫేవరెట్ డైరెక్టర్ సుకుమార్తో కలిసి ‘పుష్ప’ చేస్తున్నాడు అల్లు హీరో. ఈ చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనివార్య కారణాలతో కొంచెం ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్లబోతోందీ చిత్రం. ఈ మధ్య దొరికిన విరామంలో బన్నీ.. ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్కు ఓకే చేసుకున్నట్లు సమాచారం.
కమర్షియల్ సినిమాలకు తనదైన ‘సోషల్’ టచ్ ఇచ్చి వరుస విజయాలందుకున్న కొరటాల శివతో పని చేయాలని బన్నీ ఆసక్తితో ఉన్నాడు. లాక్ డౌన్ టైంలో ఇద్దరి మధ్య సంప్రదింపులు జరిగాయి.. తర్వాత అవి కథా చర్చల దశకు కూడా వెళ్లాయని.. ఇటు బన్నీ ‘పుష్ప’ చిత్రాన్ని, అటు కొరటాల ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేశాక కలిసి సినిమా చేయడానికి అంగీకారం కుదిరిందని విశ్వసనీయ సమాచారం.
ఈ చిత్రంలో బన్నీ స్టూడెంట్ లీడర్గా కనిపిస్తాడని.. రాజకీయాలు, సామాజిక అంశాల చుట్టూ కథ నడుస్తుందని.. కొరటాల మార్కు కథాంశానికి బన్నీ పవర్ కూడా తోడైతే సినిమా రేంజే వేరుగా ఉంటుందని అంటున్నారు. ఇంకా ఈ చిత్రానికి నిర్మాత ఖరారవ్వలేదు. సబ్జెక్టుపై మంచి గురి ఉంటే.. అల్లు అరవిందే రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…