నెలల తరబడి జరుగుతున్న సుదీర్ఘ నిరీక్షణ చివరి ఘట్టానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో ఆస్కార్ సంరంభం మొదలుకాబోతోంది. అందరి కళ్ళు అఫీషియల్ నామినేషన్ దక్కించుకున్న నాటు నాటు పాట మీదే ఉన్నాయి. తీవ్రమైన పోటీ ఉన్నా సరే అమెరికా మీడియా అంచనాల ప్రకారం రాజమౌళి బృందమే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. వస్తే అంతకన్నా సంతోషం ఉండదు కానీ ఒకవేళ దురదృష్టవశాత్తు రాకపోయినా బాధపడేందుకు ఏమి లేదు. ఎందుకంటే టాలీవుడ్ ఖ్యాతిని జక్కన్న ఇప్పటికే ఖండాంతరాలు దాటించేసి సగర్వంగా జెండా పాతాడు.
ఇండియా అభిమానులు ఈ వేడుకను ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి లైవ్ లో చూడొచ్చు. డిస్నీ హాట్ స్టార్ యాప్ తో పాటు ఈ నెట్ వర్క్ కు సంబంధించిన అన్ని బాషల జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ శాటిలైట్ ఛానల్స్ లో అందుబాటులో ఉంటుంది. నాటు నాటుకి సంబంధించిన ప్రకటన ఎప్పుడు ఉండొచ్చనేది మాత్రం ఎవరూ చెప్పలేరు. మన ఇండస్ట్రీ సెలబ్రిటీలు మాత్రం వస్తే ఎలా రాకపోతే ఎలా అని ముందస్తుగానే ట్వీట్లు రెడీ చేసుకున్నారని అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం. గర్వపడే క్షణాలను సోషల్ మీడియాలో పంచుకోవడానికి అందరూ ఎదురు చూస్తున్నారు.
మరోవైపు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణిలు ఎడతెరిపి లేకుండా అక్కడి కార్యక్రమాల్లో యమా బిజీగా ఉన్నారు. ఫ్యాన్స్ మీట్, యుఎస్ మీడియా ఇంటర్వ్యూలు, సెలబ్రిటీ టాక్ షోలు, పార్టీలు ఒకటేమిటి లేవడంతో మొదలు పడుకునే దాకా షెడ్యూల్ యమా బిజీగా ఉంది. నాటు నాటుకి ఇద్దరూ లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చే ఛాన్స్ దాదాపు జీరోనే. కనీస ప్రాక్టీస్ కి టైం లేకపోవడంతో కేవలం స్టేజి మీద కీరవాణి రాహుల్ కాలభైరవలు పాడటంతో సరిపెట్టుకోవాలి. ఏదైనా చిన్న స్టెప్పుకు తారక్ చరణ్ లు కాలు కదపొచ్చేమో. చూడాలి మరి స్వప్నం ఎలా నెరవేరబోతోందో
This post was last modified on March 12, 2023 11:59 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…