Movie News

ఇండియా లో ఆస్కార్ లైవ్ టైం ఏప్పుడో తెలుసా?

నెలల తరబడి జరుగుతున్న సుదీర్ఘ నిరీక్షణ చివరి ఘట్టానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో ఆస్కార్ సంరంభం మొదలుకాబోతోంది. అందరి కళ్ళు అఫీషియల్ నామినేషన్ దక్కించుకున్న నాటు నాటు పాట మీదే ఉన్నాయి. తీవ్రమైన పోటీ ఉన్నా సరే అమెరికా మీడియా అంచనాల ప్రకారం రాజమౌళి బృందమే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. వస్తే అంతకన్నా సంతోషం ఉండదు కానీ ఒకవేళ దురదృష్టవశాత్తు రాకపోయినా బాధపడేందుకు ఏమి లేదు. ఎందుకంటే టాలీవుడ్ ఖ్యాతిని జక్కన్న ఇప్పటికే ఖండాంతరాలు దాటించేసి సగర్వంగా జెండా పాతాడు.

ఇండియా అభిమానులు ఈ వేడుకను ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి లైవ్ లో చూడొచ్చు. డిస్నీ హాట్ స్టార్ యాప్ తో పాటు ఈ నెట్ వర్క్ కు సంబంధించిన అన్ని బాషల జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ శాటిలైట్ ఛానల్స్ లో అందుబాటులో ఉంటుంది. నాటు నాటుకి సంబంధించిన ప్రకటన ఎప్పుడు ఉండొచ్చనేది మాత్రం ఎవరూ చెప్పలేరు. మన ఇండస్ట్రీ సెలబ్రిటీలు మాత్రం వస్తే ఎలా రాకపోతే ఎలా అని ముందస్తుగానే ట్వీట్లు రెడీ చేసుకున్నారని అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం. గర్వపడే క్షణాలను సోషల్ మీడియాలో పంచుకోవడానికి అందరూ ఎదురు చూస్తున్నారు.

మరోవైపు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణిలు ఎడతెరిపి లేకుండా అక్కడి కార్యక్రమాల్లో యమా బిజీగా ఉన్నారు. ఫ్యాన్స్ మీట్, యుఎస్ మీడియా ఇంటర్వ్యూలు, సెలబ్రిటీ టాక్ షోలు, పార్టీలు ఒకటేమిటి లేవడంతో మొదలు పడుకునే దాకా షెడ్యూల్ యమా బిజీగా ఉంది. నాటు నాటుకి ఇద్దరూ లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చే ఛాన్స్ దాదాపు జీరోనే. కనీస ప్రాక్టీస్ కి టైం లేకపోవడంతో కేవలం స్టేజి మీద కీరవాణి రాహుల్ కాలభైరవలు పాడటంతో సరిపెట్టుకోవాలి. ఏదైనా చిన్న స్టెప్పుకు తారక్ చరణ్ లు కాలు కదపొచ్చేమో. చూడాలి మరి స్వప్నం ఎలా నెరవేరబోతోందో

This post was last modified on March 12, 2023 11:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

44 minutes ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

2 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

2 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

2 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

2 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

3 hours ago