వరస సినిమాలు చేయడం కాదు వాటిలో కనీసం సగమైనా సక్సెస్ ట్రాక్ ఎక్కితే కెరీర్ ని చక్కగా ముందుకు తీసుకెళ్లొచ్చు. కానీ ఆది సాయికుమార్ కు టైం ఎంత మాత్రం కలిసి రావడం లేదు. గత ఏడాది అయిదు రిలీజులు ఎవరికీ లేవు. కానీ తనకు పడ్డాయి. అయితేనేం ఒక్క హిట్టు దక్కలా. తాజాగా నిన్న సిఎస్ఐ సనాతన్ తో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు. శివ శంకర్ దేవ్ దర్శకత్వంలో శ్రీనివాస్, అజయ్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కు కనీస పబ్లిసిటి కరువవ్వడంతో ఓపెనింగ్స్ మరీ వీక్ గా మొదలయ్యాయి. ఇంతకీ మూవీ టాక్ ఏంటనేగా మీ డౌట్.
లైన్ పరంగా ఇందులో కొత్తదనం ఏమీ లేదు. ట్రైలర్ లో ఆల్రెడీ చెప్పేశారు. బిజినెస్ మెన్ విక్రమ్ చక్రవర్తి(తారక్ పొన్నాడ)ను ఎవరో చంపేస్తారు. అతనికి సంబంధం ఉన్న అందరి మీద అనుమానం వస్తుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి రంగంలోకి దిగుతాడు సిఎస్ఐ(క్రైమ్ సైట్ ఇన్వెస్టిగేషన్) ఆఫీసర్ సనాతన్. క్లూలు సేకరిస్తూ ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ వెళ్తాడు. ఆఖరికి చిన్న ట్విస్టుతో మర్డర్ చేసిన వాణ్ణి పట్టుకుంటాడు. రాక్షసుడు, హిట్ లాంటివి చూసి బాగా అప్డేట్ గా ఉన్న ఆడియన్స్ కి ఏదో కొత్తగా డిఫరెంట్ గా చెప్పనిదే థియేటర్లకు రప్పించలేం.
కానీ శివశంకర్ దేవ్ అలాంటి ప్రయత్నమేదీ చేయలేదు. టైటిల్ కార్డుతో మొదలుపెట్టి సన్నివేశాలన్నీ అతి మాములుగా జరుగుతాయి. ఎక్కడా ఆసక్తి రేపే టెంపో ఉండదు. అవసరం లేని ల్యాగ్ తో చూసేవాళ్ల సహనానికి పరీక్ష మొదలవుతుంది. దానికి తగ్గట్టే పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సోసోగా ఉండి దెబ్బ కొట్టాయి. అలీ రెజా, మిషా నారంగ్, నందిని రాయ్ ఇలా ఆర్టిస్టులను బాగానే తీసుకున్నా దానికి తగ్గ స్టోరీ సెటప్ లేకుండా పోయింది. అసలే వీక్ ప్రమోషన్లతో సతమతమవుతున్న సనాతన్ కు రిపోర్ట్స్ కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో ఆది సాయికుమార్ బ్యాడ్ లక్ కి ఇంక బ్రేకులు పడనట్టే.
This post was last modified on March 11, 2023 1:58 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…