వరస సినిమాలు చేయడం కాదు వాటిలో కనీసం సగమైనా సక్సెస్ ట్రాక్ ఎక్కితే కెరీర్ ని చక్కగా ముందుకు తీసుకెళ్లొచ్చు. కానీ ఆది సాయికుమార్ కు టైం ఎంత మాత్రం కలిసి రావడం లేదు. గత ఏడాది అయిదు రిలీజులు ఎవరికీ లేవు. కానీ తనకు పడ్డాయి. అయితేనేం ఒక్క హిట్టు దక్కలా. తాజాగా నిన్న సిఎస్ఐ సనాతన్ తో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు. శివ శంకర్ దేవ్ దర్శకత్వంలో శ్రీనివాస్, అజయ్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కు కనీస పబ్లిసిటి కరువవ్వడంతో ఓపెనింగ్స్ మరీ వీక్ గా మొదలయ్యాయి. ఇంతకీ మూవీ టాక్ ఏంటనేగా మీ డౌట్.
లైన్ పరంగా ఇందులో కొత్తదనం ఏమీ లేదు. ట్రైలర్ లో ఆల్రెడీ చెప్పేశారు. బిజినెస్ మెన్ విక్రమ్ చక్రవర్తి(తారక్ పొన్నాడ)ను ఎవరో చంపేస్తారు. అతనికి సంబంధం ఉన్న అందరి మీద అనుమానం వస్తుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి రంగంలోకి దిగుతాడు సిఎస్ఐ(క్రైమ్ సైట్ ఇన్వెస్టిగేషన్) ఆఫీసర్ సనాతన్. క్లూలు సేకరిస్తూ ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ వెళ్తాడు. ఆఖరికి చిన్న ట్విస్టుతో మర్డర్ చేసిన వాణ్ణి పట్టుకుంటాడు. రాక్షసుడు, హిట్ లాంటివి చూసి బాగా అప్డేట్ గా ఉన్న ఆడియన్స్ కి ఏదో కొత్తగా డిఫరెంట్ గా చెప్పనిదే థియేటర్లకు రప్పించలేం.
కానీ శివశంకర్ దేవ్ అలాంటి ప్రయత్నమేదీ చేయలేదు. టైటిల్ కార్డుతో మొదలుపెట్టి సన్నివేశాలన్నీ అతి మాములుగా జరుగుతాయి. ఎక్కడా ఆసక్తి రేపే టెంపో ఉండదు. అవసరం లేని ల్యాగ్ తో చూసేవాళ్ల సహనానికి పరీక్ష మొదలవుతుంది. దానికి తగ్గట్టే పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సోసోగా ఉండి దెబ్బ కొట్టాయి. అలీ రెజా, మిషా నారంగ్, నందిని రాయ్ ఇలా ఆర్టిస్టులను బాగానే తీసుకున్నా దానికి తగ్గ స్టోరీ సెటప్ లేకుండా పోయింది. అసలే వీక్ ప్రమోషన్లతో సతమతమవుతున్న సనాతన్ కు రిపోర్ట్స్ కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో ఆది సాయికుమార్ బ్యాడ్ లక్ కి ఇంక బ్రేకులు పడనట్టే.
This post was last modified on March 11, 2023 1:58 pm
వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం శాసన మండలి చైర్మన్గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే అంశంపై…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియర్లు గుర్రుగా ఉన్న నేపథ్యంలో అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. ముఖ్యంగా…
2026 వేసవి వృథా అయిపోతోందని బయ్యర్ వర్గాలు తెగ ఆందోళన చెందుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా యునానిమస్ బ్లాక్…
ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో కేవలం వారం గ్యాప్ లో రెండు రిలీజులు…
టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పలు జాగ్రత్తలు చెప్పారు. వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన ఆయన..…
ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తించిన సీనియర్ పోలీసు అధికారి సీవీ…