వరస సినిమాలు చేయడం కాదు వాటిలో కనీసం సగమైనా సక్సెస్ ట్రాక్ ఎక్కితే కెరీర్ ని చక్కగా ముందుకు తీసుకెళ్లొచ్చు. కానీ ఆది సాయికుమార్ కు టైం ఎంత మాత్రం కలిసి రావడం లేదు. గత ఏడాది అయిదు రిలీజులు ఎవరికీ లేవు. కానీ తనకు పడ్డాయి. అయితేనేం ఒక్క హిట్టు దక్కలా. తాజాగా నిన్న సిఎస్ఐ సనాతన్ తో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు. శివ శంకర్ దేవ్ దర్శకత్వంలో శ్రీనివాస్, అజయ్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కు కనీస పబ్లిసిటి కరువవ్వడంతో ఓపెనింగ్స్ మరీ వీక్ గా మొదలయ్యాయి. ఇంతకీ మూవీ టాక్ ఏంటనేగా మీ డౌట్.
లైన్ పరంగా ఇందులో కొత్తదనం ఏమీ లేదు. ట్రైలర్ లో ఆల్రెడీ చెప్పేశారు. బిజినెస్ మెన్ విక్రమ్ చక్రవర్తి(తారక్ పొన్నాడ)ను ఎవరో చంపేస్తారు. అతనికి సంబంధం ఉన్న అందరి మీద అనుమానం వస్తుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి రంగంలోకి దిగుతాడు సిఎస్ఐ(క్రైమ్ సైట్ ఇన్వెస్టిగేషన్) ఆఫీసర్ సనాతన్. క్లూలు సేకరిస్తూ ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ వెళ్తాడు. ఆఖరికి చిన్న ట్విస్టుతో మర్డర్ చేసిన వాణ్ణి పట్టుకుంటాడు. రాక్షసుడు, హిట్ లాంటివి చూసి బాగా అప్డేట్ గా ఉన్న ఆడియన్స్ కి ఏదో కొత్తగా డిఫరెంట్ గా చెప్పనిదే థియేటర్లకు రప్పించలేం.
కానీ శివశంకర్ దేవ్ అలాంటి ప్రయత్నమేదీ చేయలేదు. టైటిల్ కార్డుతో మొదలుపెట్టి సన్నివేశాలన్నీ అతి మాములుగా జరుగుతాయి. ఎక్కడా ఆసక్తి రేపే టెంపో ఉండదు. అవసరం లేని ల్యాగ్ తో చూసేవాళ్ల సహనానికి పరీక్ష మొదలవుతుంది. దానికి తగ్గట్టే పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సోసోగా ఉండి దెబ్బ కొట్టాయి. అలీ రెజా, మిషా నారంగ్, నందిని రాయ్ ఇలా ఆర్టిస్టులను బాగానే తీసుకున్నా దానికి తగ్గ స్టోరీ సెటప్ లేకుండా పోయింది. అసలే వీక్ ప్రమోషన్లతో సతమతమవుతున్న సనాతన్ కు రిపోర్ట్స్ కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో ఆది సాయికుమార్ బ్యాడ్ లక్ కి ఇంక బ్రేకులు పడనట్టే.
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…