వరస సినిమాలు చేయడం కాదు వాటిలో కనీసం సగమైనా సక్సెస్ ట్రాక్ ఎక్కితే కెరీర్ ని చక్కగా ముందుకు తీసుకెళ్లొచ్చు. కానీ ఆది సాయికుమార్ కు టైం ఎంత మాత్రం కలిసి రావడం లేదు. గత ఏడాది అయిదు రిలీజులు ఎవరికీ లేవు. కానీ తనకు పడ్డాయి. అయితేనేం ఒక్క హిట్టు దక్కలా. తాజాగా నిన్న సిఎస్ఐ సనాతన్ తో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు. శివ శంకర్ దేవ్ దర్శకత్వంలో శ్రీనివాస్, అజయ్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కు కనీస పబ్లిసిటి కరువవ్వడంతో ఓపెనింగ్స్ మరీ వీక్ గా మొదలయ్యాయి. ఇంతకీ మూవీ టాక్ ఏంటనేగా మీ డౌట్.
లైన్ పరంగా ఇందులో కొత్తదనం ఏమీ లేదు. ట్రైలర్ లో ఆల్రెడీ చెప్పేశారు. బిజినెస్ మెన్ విక్రమ్ చక్రవర్తి(తారక్ పొన్నాడ)ను ఎవరో చంపేస్తారు. అతనికి సంబంధం ఉన్న అందరి మీద అనుమానం వస్తుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి రంగంలోకి దిగుతాడు సిఎస్ఐ(క్రైమ్ సైట్ ఇన్వెస్టిగేషన్) ఆఫీసర్ సనాతన్. క్లూలు సేకరిస్తూ ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ వెళ్తాడు. ఆఖరికి చిన్న ట్విస్టుతో మర్డర్ చేసిన వాణ్ణి పట్టుకుంటాడు. రాక్షసుడు, హిట్ లాంటివి చూసి బాగా అప్డేట్ గా ఉన్న ఆడియన్స్ కి ఏదో కొత్తగా డిఫరెంట్ గా చెప్పనిదే థియేటర్లకు రప్పించలేం.
కానీ శివశంకర్ దేవ్ అలాంటి ప్రయత్నమేదీ చేయలేదు. టైటిల్ కార్డుతో మొదలుపెట్టి సన్నివేశాలన్నీ అతి మాములుగా జరుగుతాయి. ఎక్కడా ఆసక్తి రేపే టెంపో ఉండదు. అవసరం లేని ల్యాగ్ తో చూసేవాళ్ల సహనానికి పరీక్ష మొదలవుతుంది. దానికి తగ్గట్టే పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సోసోగా ఉండి దెబ్బ కొట్టాయి. అలీ రెజా, మిషా నారంగ్, నందిని రాయ్ ఇలా ఆర్టిస్టులను బాగానే తీసుకున్నా దానికి తగ్గ స్టోరీ సెటప్ లేకుండా పోయింది. అసలే వీక్ ప్రమోషన్లతో సతమతమవుతున్న సనాతన్ కు రిపోర్ట్స్ కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో ఆది సాయికుమార్ బ్యాడ్ లక్ కి ఇంక బ్రేకులు పడనట్టే.
This post was last modified on March 11, 2023 1:58 pm
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…