ఈ ఏడాది ప్రారంభంలోనే వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తో మంచి ఊపుమీదున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. తన నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో క్లారిటీ రావడంతో అప్పటికప్పుడు స్క్రిప్ట్ లో కొన్ని కీలక మార్పులు చేయించి మరీ సెట్స్ పైకి తీసుకెళ్లారట. సమ్మర్ రిలీజ్ వాయిదా పడటంతో దసరా లేదా దీపావళిని లక్ష్యంగా పెట్టుకుని చిత్రీకరణ జరుపుతున్నారు. నెక్స్ట్ ఎవరితో చేస్తారనే విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది కానీ తాజాగా వచ్చిన లీక్ మేరకు బ్యాక్ గ్రౌండ్ సెట్టింగ్ జరిగిపోయిందట.
దాని ప్రకారం కార్తీకి గత ఏడాది సర్దార్ రూపంలో మంచి హిట్ ఇచ్చిన పీఎస్ మిత్రన్ తో చేయడానికి చిరు ఆసక్తి చూపిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్లకు సోషల్ మెసేజ్ జోడించి తీయడంతో మిత్రన్ కి మంచి పేరుంది. విశాల్ కు అభిమన్యుడు ఇచ్చింది ఇతనే. అయితే కథ మన టాలీవుడ్ రైటర్ బివిఎస్ రవి అందించబోతున్నట్టు మరో న్యూస్. ఇక్కడే ఇంకో ట్విస్టు ఉంది. ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి కనీస హిట్టు లేక ఇబ్బందిపడుతున్న కూతురు సుస్మిత కొణిదెల కోసమే చిరంజీవి దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వినికిడి. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ మధ్య మెగా కాంపౌండ్ ఎక్కువగా తమిళ దర్శకులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సముతిరఖనితో ఆల్రెడీ వినోదయ సితం రీమేక్ కోసం చేతులు కలిపాడు. గత ఏడాది గాడ్ ఫాదర్ కోసమే ఇరవై ఏళ్ళ తర్వాత మోహన్ రాజా చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చాడు. రామ్ చరణ్ కోసం లోకేష్ కనగరాజ్ ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పుడు మిత్రన్ వంతు వస్తోంది. డివివి దానయ్య నిర్మాతగా వెంకీ కుడుములతో ఎప్పుడో అనౌన్స్ చేసిన ప్రాజెక్టు రద్దయిపోయిన సంగతి తెలిసిందే. ఇంకో వారం పది రోజుల్లో మెగా 156కి సంబంధించిన పూర్తి వివరాలు రావొచ్చు.
This post was last modified on March 11, 2023 11:41 am
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…