Movie News

ఆస్కార్‌లో ‘నాటు’ పెర్ఫామెన్స్ లేదా?


భారతీయుల దృష్టి మునుపెన్నడూ లేని స్థాయిలో ఈసారి ‘ఆస్కార్’ అకాడమీ అవార్డుల మీద నిలిచి ఉంది. అందుక్కారణం.. ఈసారి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పురస్కారానికి గట్టి పోటీదారుగా మారడమే. తుది జాబితాలో చోటు సంపాదించిన ఈ పాటకు.. ఆస్కార్ అవార్డు రావడం పక్కా అనే నమ్మకంతో టీం ఉంది. అవార్డుల కార్యక్రమానికి ‘ఆర్ఆర్ఆర్’ టీంలోని ప్రధాన వ్యక్తులు హాజరవుతుండడం.. వాళ్లు రెడ్ కార్పెట్ మీద నడవబోతుండటమే పెద్ద గౌరవంగా భావిస్తున్నారు.

ఇక అవార్డుల వేడుకలో కీరవాణి తన టీంతో కలిసి లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతుండడం కూడా ఖరారైంది. కాగా ఇదే వేదిక మీద హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లైవ్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ కూడా ఇస్తారనే అంచనాలతో అభిమానులు ఉన్నారు. ఈ దిశగా వార్తలు కూడా వచ్చాయి.

కానీ ఈ వేడుక ముంగిట ఓ హాలీవుడ్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో తారక్ చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తుంటే ఆస్కార్ వేదిక మీద నాటు నాటు స్టెప్పులు చూడడం సందేహంగానే ఉంది. మీ లైవ్ పెర్ఫామెన్స్ ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు తారక్ సమాధానం చెబుతూ.. అందుకు అవకాశం లేనట్లే మాట్లాడాడు. “మేం ఆ పాటకు డ్యాన్స్ చేస్తామని కచ్చితంగా చెప్పలేం. నాకు, రామ్ చరణ్‌కు రిహార్సల్స్ చేసే సమయం లేదు. అందుకే మేం ఆస్కార్ వేదిక మీద డ్యాన్స్ చేయడం అనుమానమే. కానీ ఆ పాటను ఎప్పుడు విన్నా నా కాళ్లు డ్యాన్స్ చేస్తూనే ఉంటాయి” అని తారక్ అన్నాడు.

ఐతే తారక్, చరణ్ నిజంగానే ఆస్కార్ వేదిక మీద డ్యాన్స్ చేయరా.. లేరంటే ముందు ఇలా చెప్పి సర్ప్రైజ్ లాగా డ్యాన్స్‌తో అలరిద్దామనే ఉద్దేశంతో తారక్ ఆ మాట అన్నాడా అన్నది తెలియదు. కానీ ఆస్కార్ వేదిక మీద తారక్, చరణ్ డ్యాన్స్ చేస్తే మాత్రం అది భారతీయులు గర్వించే మూమెంట్ అవుతుందనడంలో సందేహం లేదు.

This post was last modified on March 10, 2023 7:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

47 minutes ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

2 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

2 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

2 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

2 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

3 hours ago