ఏజెంట్ విడుదలకు ఇంకో 50 రోజుల కంటే తక్కువ టైమే ఉంది. అక్కినేని అభిమానులు కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పనులు అయిపోయానుకుంటే పప్పులో కాలేసినట్టేనని ఇన్ సైడ్ టాక్. మొన్నటిదాకా మస్కట్ లో ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి టీమ్ ఇంకో రెండు పాటలను బ్యాలన్స్ పెట్టిందట. ఏప్రిల్ రెండో వారంలోపు వాటిని పూర్తి చేస్తే 28న విడుదలకు రూట్ క్లియర్ అవుతుంది. హైదరాబాద్ లో ఇంకొంత ప్యాచ్ వర్క్ ని ఫినిష్ చేస్తే లోకల్ పార్ట్ వరకు గుమ్మడికాయ కొట్టేయొచ్చు. కీలకమైన క్లైమాక్స్ ఆల్రెడీ అయిపోవడం రిలీఫ్.
ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీని పక్కా ప్లానింగ్ తో చేస్తూ వచ్చినప్పటికీ చివరి నిమిషం దాకా ఎందుకు పనులు తప్పడం లేదనేది అర్థం కాని ప్రశ్న. ఇంకా నయం డిసెంబర్ లో 2023 సంక్రాంతి విడుదలని ఓ పోస్టర్ వదిలిన నిర్మాత అనిల్ సుంకర తర్వాత సైలెంట్ అవ్వడం తెలిసిందే. ఏజెంట్ కి బజ్ పెంచడం చాలా కీలకం. అఖిల్ ఇప్పటిదాకా చేసిన రొమాంటిక్ కథలకు భిన్నంగా పూర్తి స్టైలిష్ మాస్ లోకి వెళ్ళిపోయాడు. ఇది కనీసం బ్లాక్ బస్టర్ అయితే తప్ప తమ హీరోల వరస ఫ్లాపులతో అసంతృప్తిలో ఉన్న ఫ్యాన్స్ నిరసన చల్లారదు. అందుకే ఇంతగా చెక్కుతున్నారు.
పైగా ఏజెంట్ కు గట్టి పోటీ ఉంది. పొన్నియన్ సెల్వన్ 2ని ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 28నే రిలీజ్ చేయడం ఖాయమని మణిరత్నం నొక్కిమరీ చెబుతున్నారు. ఆల్రెడీ వాళ్ళ టీమ్ ఇంటర్వ్యూలు గట్రా ఇస్తూ పబ్లిసిటీ మొదలుపెట్టింది. ఏజెంట్ కి సంబంధించి పాటల సంగతి పక్కపెడితే ట్రైలర్ మీద ఓ రేంజ్ లో హైప్ ఉంది. అది బాగా కట్ చేస్తేనే పీఎస్ 2తో తమిళనాడు, కేరళ, నార్త్ స్టేట్స్ లో బిజినెస్ పోటీని తట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. సైరా తర్వాత సూరికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత అఖిల్ కి ఈ ఏజెంట్ ఆషామాషీ హిట్ అయితే సరిపోదు. రికార్డులు బద్దలవ్వాలి.
This post was last modified on March 10, 2023 10:54 am
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…