సోషల్ మీడియా పెరిగిపోయాక ఎవరు ఏమైనా అనొచ్చు ఎవరినైనా టార్గెట్ చేయొచ్చు. ముఖ్యంగా సినిమా రాజకీయాలు తప్ప ముఖ్యంగా ట్విట్టర్ లో ఇంక దేనిపైనా అంతగా చర్చలు వైరల్ కావడాలు ఉండవు. మహా అయితే అప్పుడప్పుడు క్రికెట్ రూపంలో స్పోర్ట్స్ ఉంటాయి అంతే. నిన్న నాని దసరా సినిమా నుంచి చమ్కీలా అంగేసి లిరికల్ వీడియో రిలీజైన సంగతి తెలిసిందే. మంచి క్యాచీ ట్యూన్ తో సంతోష్ నారాయణన్ చేసిన కంపోజింగ్ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంటోంది. దానికి తోడు మిర్యాల రామ్, దీలు పాడిన విధానం మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది.
కాసర్ల శ్యాం రాసిన సాహిత్యం పూర్తిగా తెలంగాణ స్లాంగ్ లో సాగింది. చమ్కీల అంగీలేసి ఓ వదినా చాకులెక్క ఉండేటోడే, కండ్లకు అయినా పెట్టి ఓ వదినా, చినిగిన బనీనేసి నట్టింట్లో కూసుంటడే ఇలా అచ్చ నైజామ్ భాషలో పదాలు అలవోకగా కదిలాయి. కథా నేపధ్యానికి తగ్గట్టు రాసి స్వరపరిచిన పాట ఇది. అయితే ఇందులో మరీ ఎక్కువ ప్రాంతీయతత్వం జొప్పించి అర్థం కానట్టు రాయించారని ఇది అన్ని వర్గాలను చేరేలా లేదని కొందరు అదే పనిగా ట్వీట్లు వేయడం మొదలుపెట్టడంతో దానికి కౌంటర్లుగా భాషాభిమానులు బలమైన సమాధానం ఇవ్వడం మొదలుపెట్టారు.
ఇటీవలే వచ్చిన బలగంలోనూ తెలంగాణ మట్టివాసన, పాటల గుబాళింపు పుష్కలంగా ఉంది. ఫిదా, లవ్ స్టోరీలో శేఖర్ కమ్ముల కోరిమరీ ఇలాంటి పాటలు చేయించుకున్నారు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డిలో బ్యాక్ డ్రాప్ ఈ భాషమీదే ఉంటుంది. అలాంటప్పుడు ప్రత్యేకంగా దసరాలోనే ఆ నేటివిటీని అతిగా జొప్పించారని లాజిక్ లేకుండా కామెంట్ చేయడం అర్ధరహితం. మార్చి 30న విడుదల కాబోతున్న ఈ రా విలేజ్ డ్రామాలో నాని ఊర మాస్ గెటప్ లో ప్రాణం పెట్టాడు. తను ప్యాన్ ఇండియా లెవెల్ లో రాష్ట్రాలన్నీ తిరుగుతుంటే ఇక్కడ ట్విట్టర్ లోనేమో తెలుగువాళ్లే పాటల శల్యపరీక్ష చేయడం విచారకరం.
This post was last modified on March 10, 2023 10:13 am
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…