Movie News

నితిన్ సైలెంట్ అయిపోయాడేంటి ?

రైటర్ కం డైరెక్టర్ వక్కంతం వంశీతో నితిన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య మారేడుమిల్లి ఫారెస్ట్ లో ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకొచ్చారు. షూటింగ్ అప్ డేట్స్ తో నితిన్ ప్రీ లుక్ స్టిల్ తో సినిమాపై ఆ టైమ్ లో ఫుల్ అటెన్షన్ తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఎందుకో ఉన్నపళంగా సైలెంట్ అయిపోయారు. నితిన్ ఈ సినిమా షూటింగ్ గురించి కానీ, అప్ డేట్స్ కానీ ఇవ్వకుండా సైలెన్స్ మెయిన్టైన్ చేస్తున్నాడు.

మొన్నీ మధ్యే నితిన్ హనుమాన్ మాల ధరించాడు. దానికోసమే కొంత బ్రేక్ తీసుకొని ఉండొచ్చా ? లేదా రష్ చూసుకున్నాక వక్కంతం అండ్ టీం నెక్స్ట్ షెడ్యూల్ కి గ్యాప్ తీసుకొని మళ్ళీ రీ షూట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ? తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ తో వక్కంతం దర్శకుడిగా మారాడు. ఆ సినిమా ఫ్లాఫ్ అవ్వడంతో వక్కంతంకి రెండో సినిమా పట్టుకోవడానికి చాలా టైమ్ పట్టింది. ఫైనల్ గా నితిన్ కి ఎర్ర చందనం నేపథ్యంతో ఓ యాక్షన్ కథ చెప్పి వర్కవుట్ చేసుకున్నాడు. ఇందులో లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు నితిన్.

‘భీష్మ’ తర్వాత నితిన్ కి సక్సెస్ లేదు. తాజాగా వచ్చిన ‘మాచర్ల నియోజక వర్గం’ కూడా బ్యాడ్ రిజల్ట్ ఇచ్చింది. దీంతో నితిన్ కి కూడా వక్కంతం ఎట్టి పరిస్థితుల్లో హిట్ ఇవ్వాల్సి ఉంది. దర్శకుడిగా తను ప్రూవ్ చేసుకోవడంతో పాటు , నితిన్ కి హిట్ ఇచ్చే భాద్యత వక్కంతం మీద ఉన్నాయి. అందుకే షూటింగ్ కి బ్రేక్ తీసుకుంటూ మళ్ళీ రీ వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. మరి నితిన్ ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ ఇచ్చే వరకు ఈ సినిమాపై రకరకాల వార్తలు వస్తూనే ఉంటాయి.

This post was last modified on March 10, 2023 8:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

2 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

3 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

4 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

4 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

4 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

5 hours ago