ఒక సినిమాకు కథ రాసేటపుడే హీరో ఎవరనే విషయం దాదాపు ఖరారైపోతుంది కానీ.. హీరోయిన్ల విషయంలో మాత్రం ముందే ఫిక్సవడం అంటూ ఏమీ ఉండదు. చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే ముందే హీరోయిన్ని ఫిక్స్ చేసుకుంటారు. స్క్రిప్టు ఓకే అయ్యాక ఆడిషన్స్ చేయడం, అందుబాటును బట్టి హీరోయిన్ని ఎంచుకోవడం జరుగుతుంటుంది.
ఈ క్రమంలో కొందరిని ఆడిషన్స్ చేసి పాత్రకు సూటయ్యే ఒక్కరిని ఎంచుకుంటూ ఉంటారు. ఐతే ఆ ఛాన్స్ మిస్సయిన వాళ్లు.. ఆ సినిమా పెద్ద హిట్టయి తమను ఆడిషన్ చేసిన క్యారెక్టర్కు మంచి పేరొస్తే ఫీలవకుండా ఉండలేరు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రాశి ఖన్నా సైతం ఇలాగే ఓ పాత్ర విషయంలో బాధ పడుతోంది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అతి పెద్ద బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచిన బాహుబలిలో ఆమె నటించాల్సిందట.
ఈ చిత్రంలో తమన్నా చేసిన అవంతిక పాత్ర కోసం ముందు రాశినే సంప్రదించారట. కానీ ఆ పాత్రకు చేసిన ఆడిషన్లో తాను రాజమౌళిని మెప్పించలేకపోయినట్లు రాశి ఖన్నా వెల్లడించింది.
తనను యోధురాలి పాత్రలో చూసి జక్కన్న తట్టుకోలేకపోయినట్లు రాశి చెప్పడం విశేషం. బాహుబలి సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి నేను కూడా వెళ్లా. అందులో అవంతిక పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చా. ఐతే సుకుమారమైన ముఖంతో ఉన్న నేను కత్తి పట్టుకుని కనిపించేసరికి రాజమౌళి గారు తట్టుకోలేకపోయారు. ఈ పాత్రకు కొంచెం రఫ్ లుక్ కూడా కావాలని, నేను సూట్ కానని చెప్పారు. తన స్నేహితుడు ఒక లవ్ స్టోరీ తీస్తున్నారని చెప్పి నన్ను అక్కడికి వెళ్లమన్నారు. రాజమౌళి ఫ్రెండ్ అయిన సాయి కొర్రపాటి గారి దగ్గరికి వెళ్లి కథ విన్నా. అదే.. ఊహలు గుసగుసలాడే. ఆ సినిమాతో దక్షిణాది చిత్రాలపై నాకున్న అభిప్రాయమే మారిపోయింది అని రాశి చెప్పింది.
This post was last modified on March 9, 2023 10:45 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…