Movie News

బాలీవుడ్ కథ.. మళ్లీ మొదటికి

నెలన్నర కిందట ‘పఠాన్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం రేపిందో తెలిసిందే. బాలీవుడ్ చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి బాక్సాఫీస్ సునామీని చూసింది. బాలీవుడ్ చిత్రాలు వందల కోట్ల వసూళ్లు రాబడుతూ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి చాలా ఏళ్లయింది.

చివరగా ‘దంగల్’ సినిమా రిలీజ్ టైంలో ఆ పరిస్థితి చూశాం. తర్వాత ఏ చిత్రం కూడా దాని దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. సౌత్ సినిమాలదే బాక్సాఫీస్ దగగ్గర ఆధిపత్యం అయింది. ఐతే ‘పఠాన్’ సినిమాతో షారుఖ్ మళ్లీ బాలీవుడ్‌కు కళ తెచ్చాడు. ఈ సినిమా ఏకంగా వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టి ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యపరిచింది. కొవిడ్ దెబ్బకు కుదేలైన బాలీవుడ్‌కు ఇది మామూలు సంతోషాన్నివ్వలేదు. దీంతో చెడ్డ రోజులన్నీ పోయాయని.. ఒకప్పటి పరిస్థితులు వచ్చేశాయని బాలీవుడ్ జనాలు చాలా ఎగ్జైట్ అయ్యారు.

కానీ వారి ఆనందం ఆ సినిమా వరకే పరిమితం అయింది. బాలీవుడ్ మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లిపోతున్నట్లు కనిపిస్తోంది. ‘పఠాన్’ తర్వాత ఏ హిందీ చిత్రం కూడా కనీస ప్రభావం చూపించలేదు. ఇలా రావడం.. అలా వెళ్లిపోవడం.. ఇదే జరుగుతోంది. కొన్ని రోజుల కిందటే అక్షయ్ కుమార్ సినిమా ‘సెల్ఫీ’కి దారుణ పరాభవం ఎదురైంది బాక్సాఫీస్ దగ్గర.

ఫుల్ రన్లో కనీసం 20 కోట్ల వసూళ్లు కూడా రాబట్టలేకపోయిందా చిత్రం. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఇబ్బంది పరిస్థితి తప్పట్లేదు. ‘బ్రహ్మాస్త్ర’ లాంటి విజయం తర్వాత రణబీర్ కపూర్ నటించిన ‘తూ ఝూతి మై మక్కర్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన లేదు.

రణబీర్ సరసన శ్రద్ధా కపూర్ లాంటి పెద్ద హీరోయిన్ నటించింది. ఈ సినిమా ట్రైలర్ రొమాంటిక్ సినిమాల ప్రియులను బాగానే ఆకట్టుకుంది. కానీ రిలీజ్ ముంగిట అనుకున్నంత బజ్ తెచ్చుకోని ఈ చిత్రానికి.. ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో వచ్చేలా లేవు. తొలి రోజు పది కోట్ల వసూళ్లు కూడా కష్టమే అనిపిస్తోంది. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోందని బాలీవుడ్ జనాలు ఫీలవుతున్నారు.

Satya

Recent Posts

బండ్ల గణేశ్… నిజంగా పవన్ భక్తుడే

టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్… తనను తాను జనసేన అధినేత,…

27 minutes ago

తెలంగాణలో ప‌వ‌న్‌… కిక్కిరిసిన అభిమానులు

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తెలంగాణ‌లోని హ‌నుమకొండ‌లో ప‌ర్య‌టించారు. ఢిల్లీ నుంచి నేరుగా హైద‌రాబాద్‌కు…

40 minutes ago

హన్మకొండలో పవన్… చోటా గబ్బర్ సింగ్ కు పరామర్శ

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం తన పొరుగు రాష్ట్రం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని హన్మకొండ…

2 hours ago

సింగీతం మెచ్చిన పుష్ప

వయసు ఒక నంబర్ మాత్రమే అనే నానుడిని రుజువు చేస్తూ 94 ఏళ్ల వయసులో ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిం…

2 hours ago

బంగారం బోణీ నిజంగా బంగారమే

సమంత మా ఇంటి బంగారం బాగానే బోణీ కొట్టేలా ఉంది. ఓవర్సీస్ లో ఇప్పటికే లక్షా పాతిక వేల డాలర్లు…

2 hours ago

వారణాసి లెక్కలు వేరే ఉన్నాయి

వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానున్న వారణాసి నుంచి ఇప్పుడప్పుడే అప్డేట్స్ వచ్చేలా లేవు కానీ ఈ ప్రాజెక్టుకు…

3 hours ago