నెలన్నర కిందట ‘పఠాన్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం రేపిందో తెలిసిందే. బాలీవుడ్ చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి బాక్సాఫీస్ సునామీని చూసింది. బాలీవుడ్ చిత్రాలు వందల కోట్ల వసూళ్లు రాబడుతూ ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసి చాలా ఏళ్లయింది.
చివరగా ‘దంగల్’ సినిమా రిలీజ్ టైంలో ఆ పరిస్థితి చూశాం. తర్వాత ఏ చిత్రం కూడా దాని దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. సౌత్ సినిమాలదే బాక్సాఫీస్ దగగ్గర ఆధిపత్యం అయింది. ఐతే ‘పఠాన్’ సినిమాతో షారుఖ్ మళ్లీ బాలీవుడ్కు కళ తెచ్చాడు. ఈ సినిమా ఏకంగా వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టి ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యపరిచింది. కొవిడ్ దెబ్బకు కుదేలైన బాలీవుడ్కు ఇది మామూలు సంతోషాన్నివ్వలేదు. దీంతో చెడ్డ రోజులన్నీ పోయాయని.. ఒకప్పటి పరిస్థితులు వచ్చేశాయని బాలీవుడ్ జనాలు చాలా ఎగ్జైట్ అయ్యారు.
కానీ వారి ఆనందం ఆ సినిమా వరకే పరిమితం అయింది. బాలీవుడ్ మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లిపోతున్నట్లు కనిపిస్తోంది. ‘పఠాన్’ తర్వాత ఏ హిందీ చిత్రం కూడా కనీస ప్రభావం చూపించలేదు. ఇలా రావడం.. అలా వెళ్లిపోవడం.. ఇదే జరుగుతోంది. కొన్ని రోజుల కిందటే అక్షయ్ కుమార్ సినిమా ‘సెల్ఫీ’కి దారుణ పరాభవం ఎదురైంది బాక్సాఫీస్ దగ్గర.
ఫుల్ రన్లో కనీసం 20 కోట్ల వసూళ్లు కూడా రాబట్టలేకపోయిందా చిత్రం. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఇబ్బంది పరిస్థితి తప్పట్లేదు. ‘బ్రహ్మాస్త్ర’ లాంటి విజయం తర్వాత రణబీర్ కపూర్ నటించిన ‘తూ ఝూతి మై మక్కర్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన లేదు.
రణబీర్ సరసన శ్రద్ధా కపూర్ లాంటి పెద్ద హీరోయిన్ నటించింది. ఈ సినిమా ట్రైలర్ రొమాంటిక్ సినిమాల ప్రియులను బాగానే ఆకట్టుకుంది. కానీ రిలీజ్ ముంగిట అనుకున్నంత బజ్ తెచ్చుకోని ఈ చిత్రానికి.. ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో వచ్చేలా లేవు. తొలి రోజు పది కోట్ల వసూళ్లు కూడా కష్టమే అనిపిస్తోంది. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోందని బాలీవుడ్ జనాలు ఫీలవుతున్నారు.
This post was last modified on March 8, 2023 10:29 pm
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…