నెలన్నర కిందట ‘పఠాన్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం రేపిందో తెలిసిందే. బాలీవుడ్ చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి బాక్సాఫీస్ సునామీని చూసింది. బాలీవుడ్ చిత్రాలు వందల కోట్ల వసూళ్లు రాబడుతూ ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసి చాలా ఏళ్లయింది.
చివరగా ‘దంగల్’ సినిమా రిలీజ్ టైంలో ఆ పరిస్థితి చూశాం. తర్వాత ఏ చిత్రం కూడా దాని దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. సౌత్ సినిమాలదే బాక్సాఫీస్ దగగ్గర ఆధిపత్యం అయింది. ఐతే ‘పఠాన్’ సినిమాతో షారుఖ్ మళ్లీ బాలీవుడ్కు కళ తెచ్చాడు. ఈ సినిమా ఏకంగా వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టి ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యపరిచింది. కొవిడ్ దెబ్బకు కుదేలైన బాలీవుడ్కు ఇది మామూలు సంతోషాన్నివ్వలేదు. దీంతో చెడ్డ రోజులన్నీ పోయాయని.. ఒకప్పటి పరిస్థితులు వచ్చేశాయని బాలీవుడ్ జనాలు చాలా ఎగ్జైట్ అయ్యారు.
కానీ వారి ఆనందం ఆ సినిమా వరకే పరిమితం అయింది. బాలీవుడ్ మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లిపోతున్నట్లు కనిపిస్తోంది. ‘పఠాన్’ తర్వాత ఏ హిందీ చిత్రం కూడా కనీస ప్రభావం చూపించలేదు. ఇలా రావడం.. అలా వెళ్లిపోవడం.. ఇదే జరుగుతోంది. కొన్ని రోజుల కిందటే అక్షయ్ కుమార్ సినిమా ‘సెల్ఫీ’కి దారుణ పరాభవం ఎదురైంది బాక్సాఫీస్ దగ్గర.
ఫుల్ రన్లో కనీసం 20 కోట్ల వసూళ్లు కూడా రాబట్టలేకపోయిందా చిత్రం. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఇబ్బంది పరిస్థితి తప్పట్లేదు. ‘బ్రహ్మాస్త్ర’ లాంటి విజయం తర్వాత రణబీర్ కపూర్ నటించిన ‘తూ ఝూతి మై మక్కర్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన లేదు.
రణబీర్ సరసన శ్రద్ధా కపూర్ లాంటి పెద్ద హీరోయిన్ నటించింది. ఈ సినిమా ట్రైలర్ రొమాంటిక్ సినిమాల ప్రియులను బాగానే ఆకట్టుకుంది. కానీ రిలీజ్ ముంగిట అనుకున్నంత బజ్ తెచ్చుకోని ఈ చిత్రానికి.. ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో వచ్చేలా లేవు. తొలి రోజు పది కోట్ల వసూళ్లు కూడా కష్టమే అనిపిస్తోంది. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోందని బాలీవుడ్ జనాలు ఫీలవుతున్నారు.
This post was last modified on March 8, 2023 10:29 pm
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…