నెలన్నర కిందట ‘పఠాన్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం రేపిందో తెలిసిందే. బాలీవుడ్ చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి బాక్సాఫీస్ సునామీని చూసింది. బాలీవుడ్ చిత్రాలు వందల కోట్ల వసూళ్లు రాబడుతూ ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసి చాలా ఏళ్లయింది.
చివరగా ‘దంగల్’ సినిమా రిలీజ్ టైంలో ఆ పరిస్థితి చూశాం. తర్వాత ఏ చిత్రం కూడా దాని దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. సౌత్ సినిమాలదే బాక్సాఫీస్ దగగ్గర ఆధిపత్యం అయింది. ఐతే ‘పఠాన్’ సినిమాతో షారుఖ్ మళ్లీ బాలీవుడ్కు కళ తెచ్చాడు. ఈ సినిమా ఏకంగా వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టి ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యపరిచింది. కొవిడ్ దెబ్బకు కుదేలైన బాలీవుడ్కు ఇది మామూలు సంతోషాన్నివ్వలేదు. దీంతో చెడ్డ రోజులన్నీ పోయాయని.. ఒకప్పటి పరిస్థితులు వచ్చేశాయని బాలీవుడ్ జనాలు చాలా ఎగ్జైట్ అయ్యారు.
కానీ వారి ఆనందం ఆ సినిమా వరకే పరిమితం అయింది. బాలీవుడ్ మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లిపోతున్నట్లు కనిపిస్తోంది. ‘పఠాన్’ తర్వాత ఏ హిందీ చిత్రం కూడా కనీస ప్రభావం చూపించలేదు. ఇలా రావడం.. అలా వెళ్లిపోవడం.. ఇదే జరుగుతోంది. కొన్ని రోజుల కిందటే అక్షయ్ కుమార్ సినిమా ‘సెల్ఫీ’కి దారుణ పరాభవం ఎదురైంది బాక్సాఫీస్ దగ్గర.
ఫుల్ రన్లో కనీసం 20 కోట్ల వసూళ్లు కూడా రాబట్టలేకపోయిందా చిత్రం. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఇబ్బంది పరిస్థితి తప్పట్లేదు. ‘బ్రహ్మాస్త్ర’ లాంటి విజయం తర్వాత రణబీర్ కపూర్ నటించిన ‘తూ ఝూతి మై మక్కర్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన లేదు.
రణబీర్ సరసన శ్రద్ధా కపూర్ లాంటి పెద్ద హీరోయిన్ నటించింది. ఈ సినిమా ట్రైలర్ రొమాంటిక్ సినిమాల ప్రియులను బాగానే ఆకట్టుకుంది. కానీ రిలీజ్ ముంగిట అనుకున్నంత బజ్ తెచ్చుకోని ఈ చిత్రానికి.. ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో వచ్చేలా లేవు. తొలి రోజు పది కోట్ల వసూళ్లు కూడా కష్టమే అనిపిస్తోంది. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోందని బాలీవుడ్ జనాలు ఫీలవుతున్నారు.
This post was last modified on March 8, 2023 10:29 pm
బాలీవుడ్లో బలమైన ముద్ర వేసిన దక్షిణాది దర్శకుల్లో ప్రియదర్శన్ ఒకరు. ఆయన అక్కడ ఎన్నో కామెడీ సినిమాలు తీసి హిట్లు…
నాలుగు నెలల నుంచి విజయ్ అభిమానులు ఎదురు చూస్తున్న జన నాయకుడు వ్యవహారాలు మెల్లగా ఒక్కొక్కటి కొలిక్కి వస్తున్నాయి. మే…
జెట్లీ ఫలితం ఏమైందనేది కాసేపు పక్కనపెడితే కమెడియన్ సత్య క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఏంటో నిన్న ఓపెనింగ్స్ తో అర్థమయ్యింది.…
జనసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. కొన్నాళ్ల కిందట ముక్కుకు ఆపరేషన్ అయిన నేపథ్యంలో…
రెండేళ్ల క్రితం 'ప్రేమలు' విడుదలైనప్పుడు అందులో హీరోకన్నా ఎక్కువ పేరు వచ్చింది మమిత బైజుకే. హుషారైన నటన, జెన్ జీని…
సినీ రంగంలో తమకు అవకాశాలు ఇచ్చిన వాళ్ల మీద కొందరు ఎంతో అభిమానం, కృతజ్ఞత చూపిస్తుంటారు. అందులో ఒక్కొక్కరు ఒక్కో…