మన సినిమాలు అమెరికాలోనో యుకెలోనో బాగా ఆడితే అందులో పెద్దగా ఆశ్చర్యపోవడానికి లేదు. కానీ మన నేటివిటీతో ఎంతమాత్రం సంబంధం లేని జపాన్ లో విరగబడి ఆడటం మాత్రం చిన్న విషయం కాదు. ముఖ్యంగా రాజమౌళి ఆ దేశపు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతున్న విధానం చూస్తే ఇంకెవరికీ అది సాధ్యం కాదేమో అనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ ఇప్పటికే నెంబర్ వన్ సింహాసనాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. ఇరవై ఒకటవ వారంలో అడుగుపెట్టాక కూడా ఇంకా అక్కడి థియేటర్లలో నడుస్తూనే ఉంది. 1192 మిలియన్ యెన్లతో టాప్ వన్ స్థానాన్ని సగర్వంగా అందుకుంది.
ఇప్పటిదాకా ఈ రికార్డు రజనీకాంత్ ముత్తు పేరు మీద ఉండేది. దాని వసూళ్లు 405 మిలియన్ల యెన్లు మాత్రమే. తర్వాత వరసగా మూడు నుంచి పది స్థానాల్లో బాహుబలి ది కంక్లూజన్ (305), త్రీ ఇడియట్స్ (149.6), ఇంగ్లీష్ వింగ్లిష్ (145), సాహో (131), మగధీర (130), రోబో (109.6), ధూమ్ త్రీ (104.5), ప్యాడ్ మ్యాన్ (90) ఉన్నాయి. పదకొండో ప్లేసులో బాహుబలి ది బిగినింగ్ (76) ఉండటం విశేషం. మొత్తం ఈ లిస్టులో రాజమౌళివి నాలుగు ఉండటం అసలు ట్విస్టు. ఇప్పటిదాకా ఏ ఇండియన్ డైరెక్టర్ కు ఇన్నేసి సినిమాలు ఇలా అగ్ర స్థానాల్లో ఉండటం జరగలేదు జరగబోదు.
ఆర్ఆర్ఆర్ ఇంకో యాభై రోజులు ఇదే తరహాలో జపాన్ లో జోరు చూపించడం ఖాయమని అక్కడి మీడియా రిపోర్ట్. ఒకవేళ నాటు నాటుకి కనక ఆస్కార్ వస్తే కలెక్షన్లలో అమాంతం జంప్ చూడొచ్చని అప్పుడు సులభంగా 1500 మిలియన్ యెన్ల మార్కు అందుకోవడం సులభమని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా జక్కన్న ఈ స్థాయిలో గర్వపడేలా అన్ని దేశాల్లో జయకేతనం ఎగురవేయడం చూస్తుంటే పొగడరా నీ తల్లి మాతృభారతిని అని పాడుకోవాలనిపిస్తుంది. వీటి దెబ్బకే అసలు షూటింగే మొదలుకాని రాజమౌళి మహేష్ బాబు సినిమా గురించి జపాన్ ఎంక్వయిరీలు మొదలయ్యాయట.
This post was last modified on March 8, 2023 12:59 pm
ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే…
దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…
సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…
అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…
టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…
వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…