గత ఏడాది డిసెంబర్ లో విడుదలై సంచలన విజయం నమోదు చేసుకున్న అవతార్ 2 ది వే అఫ్ వాటర్ చిన్ని తెరపై రాబోతోంది. ఈ నెల 28న డిజిటల్ వెర్షన్ రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. వరల్డ్ నెంబర్ వన్ గ్రాసర్ గా రికార్డు సృష్టించిన ఈ విజువల్ వండర్ ని థియేటర్స్ లో చూసినవాళ్లు మళ్ళీ ఇంకోసారి ఇంట్లో చూసేందుకు అవకాశం దక్కబోతోంది. అయితే ఈసారి వట్టి సినిమా చూసి సంతృప్తి చెందనవసరం లేదు. ఒరిజినల్ వెర్షన్ తో పాటుగా అదనంగా 3 గంటల అదనపు ఫుటేజీని దీంతో పాటు ఉచితంగా అందించబోతున్నారు.
ఇందులో షూటింగ్ జరుగుతున్న వీడియోలు, గ్రాఫిక్స్ కి సంబంధించిన పనులను వివరించే ఇంటర్వ్యూలు, నటీనటులు సాంకేతిక నిపుణుల ముఖాముఖీ కార్యక్రమాలతో పాటు జేమ్స్ క్యామరూన్ ఇప్పటి దాకా ఎవరికీ చెప్పని అవతార్ సీక్రెట్స్ ఇందులో పొందుపరచబోతున్నారు. అంతే కాదు మూడు నాలుగు భాగాలకు సంబంధించిన కొన్ని కీలక అప్డేట్స్ ఇస్తారు. మొత్తం ఆరున్నర గంటలు నాన్ స్టాప్ గా పండోరా ప్రపంచంలో మునిగి తేలి రావొచ్చు. ఇది ఏ ఓటిటిలో వస్తుందనే విషయం చెప్పలేదు కానీ తొలుత బ్లూరే డిస్క్, డివిడి రూపంలో రిలీజ్ చేశాక రెగ్యులర్ డిజిటల్ కి రావొచ్చు.
సరిగ్గా వంద రోజులకు అవతార్ 2 స్మార్ట్ స్క్రీన్లకు వచ్చేస్తుంది. ఇండియాకు కొంచెం లేట్ కావొచ్చనే టాక్ ఉంది కానీ ఒకవేళ అలా జరిగినా పైరసీ దారులు ఊరికే ఉంటారా. ఇప్పటికీ ఈ సినిమా మన దేశంలో ప్రధాన నగరాల్లో ఇంకా స్క్రీనింగ్ కొనసాగిస్తూనే ఉంది. హైదరాబాద్ లోనూ షోలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆస్కార్ నామినేషన్లలో ఆధిపత్యం చూపిస్తున్న అవతార్ 2 ఏ విభాగాల్లో అవార్డు తెస్తుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 16 వేల కోట్ల బ్రేక్ ఈవెన్ ఈజీగా అందుకున్న క్యామరూన్ మాయాజాలం తర్వాత భాగానికి ఎంత టార్గెట్ పెట్టుకుంటుందో.
This post was last modified on March 8, 2023 10:53 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…