గత ఏడాది డిసెంబర్ లో విడుదలై సంచలన విజయం నమోదు చేసుకున్న అవతార్ 2 ది వే అఫ్ వాటర్ చిన్ని తెరపై రాబోతోంది. ఈ నెల 28న డిజిటల్ వెర్షన్ రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. వరల్డ్ నెంబర్ వన్ గ్రాసర్ గా రికార్డు సృష్టించిన ఈ విజువల్ వండర్ ని థియేటర్స్ లో చూసినవాళ్లు మళ్ళీ ఇంకోసారి ఇంట్లో చూసేందుకు అవకాశం దక్కబోతోంది. అయితే ఈసారి వట్టి సినిమా చూసి సంతృప్తి చెందనవసరం లేదు. ఒరిజినల్ వెర్షన్ తో పాటుగా అదనంగా 3 గంటల అదనపు ఫుటేజీని దీంతో పాటు ఉచితంగా అందించబోతున్నారు.
ఇందులో షూటింగ్ జరుగుతున్న వీడియోలు, గ్రాఫిక్స్ కి సంబంధించిన పనులను వివరించే ఇంటర్వ్యూలు, నటీనటులు సాంకేతిక నిపుణుల ముఖాముఖీ కార్యక్రమాలతో పాటు జేమ్స్ క్యామరూన్ ఇప్పటి దాకా ఎవరికీ చెప్పని అవతార్ సీక్రెట్స్ ఇందులో పొందుపరచబోతున్నారు. అంతే కాదు మూడు నాలుగు భాగాలకు సంబంధించిన కొన్ని కీలక అప్డేట్స్ ఇస్తారు. మొత్తం ఆరున్నర గంటలు నాన్ స్టాప్ గా పండోరా ప్రపంచంలో మునిగి తేలి రావొచ్చు. ఇది ఏ ఓటిటిలో వస్తుందనే విషయం చెప్పలేదు కానీ తొలుత బ్లూరే డిస్క్, డివిడి రూపంలో రిలీజ్ చేశాక రెగ్యులర్ డిజిటల్ కి రావొచ్చు.
సరిగ్గా వంద రోజులకు అవతార్ 2 స్మార్ట్ స్క్రీన్లకు వచ్చేస్తుంది. ఇండియాకు కొంచెం లేట్ కావొచ్చనే టాక్ ఉంది కానీ ఒకవేళ అలా జరిగినా పైరసీ దారులు ఊరికే ఉంటారా. ఇప్పటికీ ఈ సినిమా మన దేశంలో ప్రధాన నగరాల్లో ఇంకా స్క్రీనింగ్ కొనసాగిస్తూనే ఉంది. హైదరాబాద్ లోనూ షోలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆస్కార్ నామినేషన్లలో ఆధిపత్యం చూపిస్తున్న అవతార్ 2 ఏ విభాగాల్లో అవార్డు తెస్తుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 16 వేల కోట్ల బ్రేక్ ఈవెన్ ఈజీగా అందుకున్న క్యామరూన్ మాయాజాలం తర్వాత భాగానికి ఎంత టార్గెట్ పెట్టుకుంటుందో.
This post was last modified on March 8, 2023 10:53 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…