కొన్ని కాంబినేషన్లు వినగానే విపరీతమైన ఎగ్జైట్ మెంట్ కు గురి చేస్తాయి. ఇక నిజమయ్యే అవకాశం ఉందని తెలిసినప్పుడు ఫ్యాన్స్ ఉద్వేగం ఏ స్థాయికి చేరుకుంటుందో వేరే చెప్పాలా. ఆర్ఆర్ఆర్ అనౌన్స్ మెంట్ వచ్చినప్పుడు ఎవరూ నమ్మలేదు. తీరా ఇప్పుడు చూస్తే దాదాపు ఆస్కార్ గెలిచినంత పని చేసింది. మార్చి 12 అవార్డు వచ్చినా రాకపోయినా అంతకన్నా గొప్ప ఖ్యాతి రాజమౌళి బృందం ఇప్పటికే సంపాదించేసింది. తాజాగా మరో కలయిక గురించిన వార్తలు చెన్నై వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ ధనుష్ కాంబినేషన్ లో కల్ట్ దర్శకుడు వెట్రిమారన్ ఒక భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేశారనేది దాని సారాంశం. రేపు జరగబోయే విడుతలై ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దీన్ని ప్రకటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. వెట్రిమారన్ తారక్ తో కొన్ని నెలల క్రితం నుంచే సంప్రదింపుల్లో ఉన్న మాట వాస్తవమే. అలాగే ధనుష్ తోనూ రెగ్యులర్ గా చర్చలు జరుపుతున్నాడు. ఇది ఒకే కథ గురించా లేక ఇద్దరు హీరోలతో వెట్రిమారన్ వేర్వేరుగా ప్లాన్ చేసుకున్నాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. రేపు ఒకవేళ ఖరారు కాకపోయినా భవిష్యత్తులో జరుగుతుంది
వెట్రిమారన్ ముందు నుంచే వడ చెన్నై 2 తీసే ప్లాన్ లో ఉన్నాడు. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశారట. ఇది తెలుగులో రాలేదు కానీ కోలీవుడ్ లో వచ్చిన బెస్ట్ గ్యాంగ్ స్టర్స్ మూవీస్ లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. దానికి కొనసాగింపనే లీకే ట్విట్టర్ లో ట్రెండింగ్ కి తీసుకొచ్చింది. మరి వెట్రిమారన్ ఇద్దరినీ ఇందులోనే సెట్ చేస్తాడా లేక వేరు వేరు సబ్జెక్టులు సిద్ధం చేశారా అనేది తెలియాల్సి ఉంది. జూనియర్ యుఎస్ నుంచి రాగానే కొరటాల శివ రెగ్యులర్ షూట్ కి వెళ్ళిపోవాలి. అది కాగానే ప్రశాంత్ నీల్ ది ఉంటుంది. మరి తమిళ దర్శకుడికి నిజంగా ఎస్ చెప్పాడా అనేది ప్రస్తుతానికి ప్రశ్నే
This post was last modified on March 8, 2023 7:53 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…