కొన్ని కాంబినేషన్లు వినగానే విపరీతమైన ఎగ్జైట్ మెంట్ కు గురి చేస్తాయి. ఇక నిజమయ్యే అవకాశం ఉందని తెలిసినప్పుడు ఫ్యాన్స్ ఉద్వేగం ఏ స్థాయికి చేరుకుంటుందో వేరే చెప్పాలా. ఆర్ఆర్ఆర్ అనౌన్స్ మెంట్ వచ్చినప్పుడు ఎవరూ నమ్మలేదు. తీరా ఇప్పుడు చూస్తే దాదాపు ఆస్కార్ గెలిచినంత పని చేసింది. మార్చి 12 అవార్డు వచ్చినా రాకపోయినా అంతకన్నా గొప్ప ఖ్యాతి రాజమౌళి బృందం ఇప్పటికే సంపాదించేసింది. తాజాగా మరో కలయిక గురించిన వార్తలు చెన్నై వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ ధనుష్ కాంబినేషన్ లో కల్ట్ దర్శకుడు వెట్రిమారన్ ఒక భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేశారనేది దాని సారాంశం. రేపు జరగబోయే విడుతలై ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దీన్ని ప్రకటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. వెట్రిమారన్ తారక్ తో కొన్ని నెలల క్రితం నుంచే సంప్రదింపుల్లో ఉన్న మాట వాస్తవమే. అలాగే ధనుష్ తోనూ రెగ్యులర్ గా చర్చలు జరుపుతున్నాడు. ఇది ఒకే కథ గురించా లేక ఇద్దరు హీరోలతో వెట్రిమారన్ వేర్వేరుగా ప్లాన్ చేసుకున్నాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. రేపు ఒకవేళ ఖరారు కాకపోయినా భవిష్యత్తులో జరుగుతుంది
వెట్రిమారన్ ముందు నుంచే వడ చెన్నై 2 తీసే ప్లాన్ లో ఉన్నాడు. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశారట. ఇది తెలుగులో రాలేదు కానీ కోలీవుడ్ లో వచ్చిన బెస్ట్ గ్యాంగ్ స్టర్స్ మూవీస్ లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. దానికి కొనసాగింపనే లీకే ట్విట్టర్ లో ట్రెండింగ్ కి తీసుకొచ్చింది. మరి వెట్రిమారన్ ఇద్దరినీ ఇందులోనే సెట్ చేస్తాడా లేక వేరు వేరు సబ్జెక్టులు సిద్ధం చేశారా అనేది తెలియాల్సి ఉంది. జూనియర్ యుఎస్ నుంచి రాగానే కొరటాల శివ రెగ్యులర్ షూట్ కి వెళ్ళిపోవాలి. అది కాగానే ప్రశాంత్ నీల్ ది ఉంటుంది. మరి తమిళ దర్శకుడికి నిజంగా ఎస్ చెప్పాడా అనేది ప్రస్తుతానికి ప్రశ్నే
This post was last modified on March 8, 2023 7:53 am
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…