కొన్ని కాంబినేషన్లు వినగానే విపరీతమైన ఎగ్జైట్ మెంట్ కు గురి చేస్తాయి. ఇక నిజమయ్యే అవకాశం ఉందని తెలిసినప్పుడు ఫ్యాన్స్ ఉద్వేగం ఏ స్థాయికి చేరుకుంటుందో వేరే చెప్పాలా. ఆర్ఆర్ఆర్ అనౌన్స్ మెంట్ వచ్చినప్పుడు ఎవరూ నమ్మలేదు. తీరా ఇప్పుడు చూస్తే దాదాపు ఆస్కార్ గెలిచినంత పని చేసింది. మార్చి 12 అవార్డు వచ్చినా రాకపోయినా అంతకన్నా గొప్ప ఖ్యాతి రాజమౌళి బృందం ఇప్పటికే సంపాదించేసింది. తాజాగా మరో కలయిక గురించిన వార్తలు చెన్నై వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ ధనుష్ కాంబినేషన్ లో కల్ట్ దర్శకుడు వెట్రిమారన్ ఒక భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేశారనేది దాని సారాంశం. రేపు జరగబోయే విడుతలై ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దీన్ని ప్రకటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. వెట్రిమారన్ తారక్ తో కొన్ని నెలల క్రితం నుంచే సంప్రదింపుల్లో ఉన్న మాట వాస్తవమే. అలాగే ధనుష్ తోనూ రెగ్యులర్ గా చర్చలు జరుపుతున్నాడు. ఇది ఒకే కథ గురించా లేక ఇద్దరు హీరోలతో వెట్రిమారన్ వేర్వేరుగా ప్లాన్ చేసుకున్నాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. రేపు ఒకవేళ ఖరారు కాకపోయినా భవిష్యత్తులో జరుగుతుంది
వెట్రిమారన్ ముందు నుంచే వడ చెన్నై 2 తీసే ప్లాన్ లో ఉన్నాడు. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశారట. ఇది తెలుగులో రాలేదు కానీ కోలీవుడ్ లో వచ్చిన బెస్ట్ గ్యాంగ్ స్టర్స్ మూవీస్ లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. దానికి కొనసాగింపనే లీకే ట్విట్టర్ లో ట్రెండింగ్ కి తీసుకొచ్చింది. మరి వెట్రిమారన్ ఇద్దరినీ ఇందులోనే సెట్ చేస్తాడా లేక వేరు వేరు సబ్జెక్టులు సిద్ధం చేశారా అనేది తెలియాల్సి ఉంది. జూనియర్ యుఎస్ నుంచి రాగానే కొరటాల శివ రెగ్యులర్ షూట్ కి వెళ్ళిపోవాలి. అది కాగానే ప్రశాంత్ నీల్ ది ఉంటుంది. మరి తమిళ దర్శకుడికి నిజంగా ఎస్ చెప్పాడా అనేది ప్రస్తుతానికి ప్రశ్నే
This post was last modified on March 8, 2023 7:53 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…