సినీ రంగంలో కొత్త కాంబినేషన్ల గురించి రూమర్లు ఎప్పుడూ ఉండేవే. కానీ అందులో అన్నీ ఎగ్జైట్మెంట్ కలిగించవు. కొన్ని ఊహాగానాలు మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. ఇప్పుడు అలాంటి రూమరే టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాలో యువ కథానాయకుడు బెల్లంకొండ నటిస్తున్నాడన్నదే ఆ సమాచారం. గత ఏడాది మూడు పెద్ద డిజాస్టర్లతో బాగా ఇబ్బంది పడ్డ బాలయ్య.. ప్రస్తుతం తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి గత నెలలో రిలీజైన టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇంకా హీరోయిన్లెవరో ఖరారు కాని ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్లో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ ఉంటుందని.. దాన్ని బెల్లంకొండ శ్రీనివాస్తో చేయిస్తే సినిమాకు డిఫరెంట్ లుక్ వస్తుందని బోయపాటి భావిస్తున్నాడని.. ఇందుకు బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. శ్రీనివాస్ కూడా సంతోషంగా ఒప్పుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదెంత వరకు నిజమో కానీ.. ఈ కాంబినేషన్ అందరినీ కళ్లు విచ్చుకునేలా చేస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే బెల్లంకొండ కుటుంబంతో బాలయ్య బంధం చిత్రమైనది. ఒకప్పుడు బెల్లంకొండ సురేష్ బాలయ్యకు అత్యంత సన్నిహితుడు. కానీ ఎక్కడో తేడా కొట్టి సురేష్పై బాలయ్య కాల్పులు జరిపే వరకు వెళ్లింది. ఆ కేసు అనేక మలుపులు తిరిగి చివరికి ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. బాలయ్య బయటపడ్డాడు.
మళ్లీ బాలయ్యతో సురేష్కు ప్యాచప్ అయ్యి ఆయనతో ‘హరహర మహాదేవ’ అనే సినిమా కూడా తీయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ కొన్ని కారణాలతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. తర్వాత వీళ్లిద్దరి రిలేషన్ ఎలా ఉందో తెలియదు. ఇప్పుడిలా బాలయ్య సినిమాలో బెల్లంకొండ జూనియర్ నటిస్తాడన్న రూమర్ అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. శ్రీనివాస్తో ‘జయ జానకి నాయక’ లాంటి భారీ సినిమా తీసి బెల్లంకొండ కుటుంబానికి బోయపాటి సన్నిహితుడిగా మారిన నేపథ్యంలో ఈ రూమర్ను కొట్టిపారేయడానికి కూడా లేదేమో.
This post was last modified on July 28, 2020 8:54 am
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…