కొన్ని సినిమాలు రిలీజైనప్పుడు మామూలుగానే అనిపించినా.. పోను పోను ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసి కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటాయి. కరోనా టైంలో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి.. నేరుగా అమేజాన్ ప్రైమ్ ద్వారా రిలీజైన తమిళ సినిమా ‘సార్పట్ట’ ఈ కోవకే చెందుతుంది.
రజినీకాంత్తో ‘కబాలి’; ‘కాలా’ చిత్రాలు తీసిన తమిళ దర్శకుడు పా.రంజిత్ రూపొందించిన ఈ చిత్రంలో ఆర్య లీడ్ రోల్ చేశాడు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ ఫిలిం రిలీజైనప్పటి కంటే.. తర్వాతి కాలంలో ఎక్కువ అప్లాజ్ తెచ్చుకుంది.
కొన్ని దశాబ్దాల ముందటి నేపథ్యంతో రంజిత్ తీసిన ఈ బాక్సింగ్ డ్రామా.. ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. తమిళనాట చాలా ఏళ్ల ముందు లోకల్ బాక్సింగ్ పోటీల నేపథ్యాన్ని రంజిత్ చాలా అథెంటిగ్గా తీసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. హీరోతో పాటు ఇందులోని వివిధ పాత్రలను రంజిత్ భలేగా తీర్చిదిద్దాడు.
కల్ట్ స్టేటస్ తెచ్చుకున్న ‘సార్పట్ట’ సినిమాకు సీక్వెల్ తీస్తానని రంజిత్ ఇంతకుముందే ప్రకటించాడు. ఇప్పుడు అతను ఆ సినిమాను అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. కపిలన్ (హీరో పాత్ర పేరు) త్వరలోనే తిరిగి వస్తున్నాడంటూ ఒక పోస్టర్ ద్వారా సినిమాను ప్రకటించాడు రంజిత్. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే మొదలై.. చాలా వరకు టాకీ పార్ట్ పూర్తయినట్లు తెలుస్తోంది.
ఐతే అప్పట్లో కరోనా ప్రభావం వల్ల తప్పక థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేశారు. ఇప్పుడు మామూలు పరిస్థితులే ఉన్నాయి కాబట్టి ‘సార్పట్ట-2’ థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. ఒక కల్ట్ మూవీకి సీక్వెల్ అంటే ప్రేక్షకుల్లో అమితాసక్తి ఉంటుందనడంలో సందేహం లేదు. మరి సార్పట్ట కథను రంజిత్ ఈసారి ఎన్ని మలుపులు తిప్పుతాడు.. ప్రేక్షకులకు బాగా ఎక్కేసిన క్యారెక్టర్లను ఈసారి ఎలా ప్రెజెంట్ చేస్తాడు అన్నది ఆసక్తికరం. వేసవిలోనే ఈ సినిమా రిలీజ్ కావచ్చని అంచనా వేస్తున్నారు.
This post was last modified on March 9, 2023 5:56 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…