మాములుగా బ్లాక్ బస్టర్ సినిమాలను రీమేక్ చేసేటప్పుడు పెద్దగా మార్పులు చేయరు. ఏ మాత్రం తేడా కొట్టినా ఒరిజినల్ సోల్ ని చంపేశారనే విమర్శలు వస్తాయని. అలా అని చేంజ్ చేయకుండా తీసినవి డిజాస్టర్ కావన్న గ్యారెంటీ కూడా లేదు. ఇటీవలే అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ హిందీలో షెహజాదాగా చేస్తే కనీసం సగం పెట్టుబడి కూడా రాలేదు. అయితే అజయ్ దేవగన్ మాత్రం తన కొత్త చిత్రం భోలా విషయంలో పెద్ద రిస్క్ చేస్తున్నాడు. ఇది ఈ నెల 30న విడుదల కానుంది. అభిమానులకు దీని మీద బోలెడు అంచనాలున్నాయి.
ఈ భోలా కార్తీ ఖైదీ అఫీషియల్ రీమేక్. ఇవాళే ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఒక్క రాత్రిలో జరిగే సంఘటనల ఆధారంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ దాన్ని ఎంత ఇంటెన్స్ గా తీశాడో ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకపోయినా ఆడియన్స్ థియేటర్స్ లో థ్రిల్ అవుతూ చూశారు. అయితే అజయ్ దేవగన్ బాలీవుడ్ వెర్షన్ కి లెక్కలేనన్ని మార్పులు చేర్పులు చేశాడు. ఐటెం సాంగ్ పెట్టాడు. నమ్మశక్యం కాని పఠాన్ టైప్ పోరాట దృశ్యాలు తీశాడు. హీరోయిన్ తో ఫ్లాష్ బ్యాక్, ఆమెతో ఆటా పాటా కూడా జోడించాడు. ఇవేవి ఖైదీలో లేవు.
పోలీస్ ఆఫీసర్ గా టబుని తీసుకొచ్చాడు. పగలు వచ్చే ఎపిసోడ్స్ ని పెట్టాడు. ఇలా మొత్తానికి కిచిడి సరుకు గట్టిగానే దింపాడు. ఇవన్నీ చాలవన్నట్టు ఏకంగా 3డిలో ప్రెజెంట్ చేయబోతున్నాడు.ఆ మధ్య దృశ్యం 2తో భారీ విజయం అందుకున్న అజయ్ దేవగన్ కు ఆ కాన్ఫిడెన్స్ కాబోలు ఇప్పుడీ ఖైదీ మేకోవర్ కు ప్రేరేపించింది. రన్ వే 34 తర్వాత అజయ్ దేవగన్ తన స్వీయ దర్శకత్వంలో నిర్మించుకున్న సినిమా ఇది. పఠాన్ తుఫాను తర్వాత మళ్ళీ డల్ అయిపోయిన బాక్సాఫీస్ కు ఇదే సరైన ఉత్సాహం తెస్తుందని ట్రేడ్ గంపెడాశలుతో ఎదురు చూస్తోంది.
This post was last modified on March 7, 2023 7:57 am
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…