మాములుగా బ్లాక్ బస్టర్ సినిమాలను రీమేక్ చేసేటప్పుడు పెద్దగా మార్పులు చేయరు. ఏ మాత్రం తేడా కొట్టినా ఒరిజినల్ సోల్ ని చంపేశారనే విమర్శలు వస్తాయని. అలా అని చేంజ్ చేయకుండా తీసినవి డిజాస్టర్ కావన్న గ్యారెంటీ కూడా లేదు. ఇటీవలే అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ హిందీలో షెహజాదాగా చేస్తే కనీసం సగం పెట్టుబడి కూడా రాలేదు. అయితే అజయ్ దేవగన్ మాత్రం తన కొత్త చిత్రం భోలా విషయంలో పెద్ద రిస్క్ చేస్తున్నాడు. ఇది ఈ నెల 30న విడుదల కానుంది. అభిమానులకు దీని మీద బోలెడు అంచనాలున్నాయి.
ఈ భోలా కార్తీ ఖైదీ అఫీషియల్ రీమేక్. ఇవాళే ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఒక్క రాత్రిలో జరిగే సంఘటనల ఆధారంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ దాన్ని ఎంత ఇంటెన్స్ గా తీశాడో ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకపోయినా ఆడియన్స్ థియేటర్స్ లో థ్రిల్ అవుతూ చూశారు. అయితే అజయ్ దేవగన్ బాలీవుడ్ వెర్షన్ కి లెక్కలేనన్ని మార్పులు చేర్పులు చేశాడు. ఐటెం సాంగ్ పెట్టాడు. నమ్మశక్యం కాని పఠాన్ టైప్ పోరాట దృశ్యాలు తీశాడు. హీరోయిన్ తో ఫ్లాష్ బ్యాక్, ఆమెతో ఆటా పాటా కూడా జోడించాడు. ఇవేవి ఖైదీలో లేవు.
పోలీస్ ఆఫీసర్ గా టబుని తీసుకొచ్చాడు. పగలు వచ్చే ఎపిసోడ్స్ ని పెట్టాడు. ఇలా మొత్తానికి కిచిడి సరుకు గట్టిగానే దింపాడు. ఇవన్నీ చాలవన్నట్టు ఏకంగా 3డిలో ప్రెజెంట్ చేయబోతున్నాడు.ఆ మధ్య దృశ్యం 2తో భారీ విజయం అందుకున్న అజయ్ దేవగన్ కు ఆ కాన్ఫిడెన్స్ కాబోలు ఇప్పుడీ ఖైదీ మేకోవర్ కు ప్రేరేపించింది. రన్ వే 34 తర్వాత అజయ్ దేవగన్ తన స్వీయ దర్శకత్వంలో నిర్మించుకున్న సినిమా ఇది. పఠాన్ తుఫాను తర్వాత మళ్ళీ డల్ అయిపోయిన బాక్సాఫీస్ కు ఇదే సరైన ఉత్సాహం తెస్తుందని ట్రేడ్ గంపెడాశలుతో ఎదురు చూస్తోంది.
This post was last modified on March 7, 2023 7:57 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…