కెజిఎఫ్ లో రాఖీ భాయ్ పాత్ర గురించి దర్శకుడు వెంకటేష్ మహా చేసిన కామెంట్లు పెను దుమారానికి దారి తీశాయి. దాని తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతున్నాయి. ఆ గ్రూప్ ఇంటర్వ్యూలో మరో నలుగురు డైరెక్టర్లు పాల్గొనడమే కాక ఆ వ్యాఖ్యలకు మద్దతుగా పగలబడి నవ్వడంతో ఇప్పుడు అందరూ టార్గెట్ అయిపోయారు. దెబ్బకు నందినిరెడ్డి సారీ చెబుతూ కమర్షియల్ సినిమాకు గౌరవం ఎప్పుడూ ఉంటుందని ట్వీట్ చేయడం బట్టి వ్యవహారం ఎంత దూరం వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి వెంకటేష్ మాములుగా తన వెర్షన్ వినిపించే ఉంటే బాగుండేది కానీ మరీ వెటకారంగా విమర్శించడమే ఈ వివాదానికి కారణం.
కుర్ర డైరెక్టర్లు ఇలాంటి ముఖాముఖీలు చేసే ముందు చాలా ఆలోచనతో ఉండాలి. ఎందుకంటే ఏదైనా విషయంలో నెగటివ్ గా ట్రిగ్గర్ అయ్యామంటే దాని ప్రభావం నేరుగా వాళ్ళ రాబోయే కొత్త రిలీజు మీద ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు కావాలని ట్రోలింగ్ కోసం టార్గెట్ చేసి మరీ తప్పొప్పులు ఎత్తి చూపిస్తారు. ముఖ్యంగా నాలుగైదు సినిమాల అనుభవం మాత్రమే ఉన్న యూత్ ఫిలిం మేకర్స్ ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మాటలు గాల్లో కలిసిపోతాయేమో కానీ వీడియోలు శాశ్వతం. ఇంకో యాభై ఏళ్ళ తర్వాతైనా సరే అదిగో నువ్వు ఫలానా సంవత్సరం ఇలా అన్నావని వేలెత్తి చూపించడానికి సాక్ష్యం సిద్ధంగా ఉంటుంది. ఇదే అసలు సమస్య
ఇప్పుడీ టాపిక్ కన్నడ ఫ్యాన్స్ దాకా వెళ్ళింది. ఏదో ఆషామాషీ మాములు మసాలా సినిమాని అనుంటే లైట్ తీసుకునేవాళ్ళు కానీ ఏకంగా కెజిఎఫ్ 2ని క్రిటిసైజ్ చేయడంతో ఇప్పుడా బ్యాచ్ రంగంలోకి దిగింది. చేయాల్సిన ప్రయాణం అందుకోవాల్సిన ఎత్తులు చాలా ఉన్న కుర్ర డైరెక్టర్లు ఇలాంటి ఉచ్చులో పడకుండా చూసుకోవాలి. మన పనితనం మాట్లాడాలి కానీ వేరొకరి క్రియేటివిటీని పోస్ట్ మార్టం చేయడం వల్ల హైలైట్ కాకూడదు. ఈ ఇష్యూ వల్ల ఇంద్రగంటి మోహనకృష్ణ లాంటి సీనియర్ దర్శకులు సైతం ఈ కాంట్రావర్సిలో వచ్చేశారు. యాటిట్యూడ్ అంటే సినిమాల్లో ఎలా చూపించినా చెల్లుతుంది కానీ రియల్ లైఫ్ లో కుదరదు. అందుకే జర భద్రంగా ఉండాల్సిందే
This post was last modified on March 6, 2023 9:54 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…