ఆహాకు అన్ స్టాపబుల్ షో తీసుకొచ్చిన మైలేజ్ అంతా ఇంతా కాదు. మొదటిసారి యాంకరింగ్ ఎలా చేస్తారోననే అనుమానాలు బద్దలు కొడుతూ ఈ సెలబ్రిటీ ముఖాముఖీ కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసిన ఘనత బాలకృష్ణకే దక్కుతుంది. సెకండ్ సీజన్ మొదట్లో పొలిటికల్ కలర్ ఇవ్వడం పట్ల మిశ్రమ స్పందన వచ్చినా చివర్లో ప్రభాస్ పవన్ కళ్యాణ్ తో చేసిన ఎపిసోడ్లు దీని స్థాయిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిపోయాయి. ఒక సినిమా రిలీజ్ అవుతున్న రేంజ్ లో వీటిని స్పెషల్ గా థియేటర్ స్క్రీనింగ్ చేయడం టాలీవుడ్ చరిత్రలో ఇదే మొదటిసారని చెప్పొచ్చు
ఈ ఊపులోనే బాలయ్యతో ఒక వెబ్ సిరీస్ చేయించేందుకు అల్లు అరవింద్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. అయితే ముందు కథ వింటానని తర్వాత అలోచించి నిర్ణయం చెబుతాననే స్పందన వచ్చిందట. టాలీవుడ్ నలుగురు సీనియర్ స్టార్ హీరోల్లో ఫస్ట్ డిజిటల్ డెబ్యూ విక్టరీ వెంకటేష్ చేశారు. మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ కానున్న రానా నాయుడు ఫలితం చూశాక ఆయన ఎంట్రీ సక్సెస్ అయ్యిందా లేదా తేలుతుంది. నాగార్జున కూడా చేయాలని అంతకు ముందు ఆసక్తి చూపించారు కానీ వరసగా సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో డ్రాప్ అయ్యారు
సో బాలయ్యను మెప్పించే బాధ్యతను అరవింద్ తన టీమ్ కు అప్పజెప్పారట. ముందు స్క్రిప్ట్ ఓకే అయితే దర్శకుడిని లాక్ చేసుకోవచ్చు. బివిఎస్ రవి పేరు ముందు వరసలో ఉంది. థియేటర్ కంటెంట్ కాదు కాబట్టి కొంచెం అనుభవమున్న దర్శకుడు ఎవరైనా సరే ఈజీగా హ్యాండిల్ చేయగలరు. ప్రస్తుతం ఆ వేట కూడా జరుగుతోందని ఇన్ సైడ్ టాక్. బాలకృష్ణ అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా షూటింగ్ లో బిజీ ఉన్నారు. తారకరత్న మరణం వల్ల కొత్త షెడ్యూల్ వాయిదా పడింది. ఈ వారంలోనే రీ స్టార్ట్ చేయబోతున్నారు. మరి అల్లు బృందానికి గ్రీన్
This post was last modified on March 6, 2023 5:46 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…