రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లతో మంచి ఊపుమీదున్న మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా రావణాసుర ఏప్రిల్ 7 విడుదలకు రెడీ అవుతోంది. కేవలం నాలుగు నెలల గ్యాప్ లో ఒక స్టార్ హీరో మూడో సినిమా రిలీజ్ కావడం గత కొన్నేళ్లలో ఎప్పుడూ జరగలేదు. దీంతో అభిమానుల ఆనందం మాములుగా లేదు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన రావణాసుర టీజర్ ని ఇందాకా రిలీజ్ చేశారు. నెగటివ్ షేడ్స్ ఉంటాయని ముందు నుంచే క్లూలు ఇచ్చిన నేపథ్యంలో దీని మీద ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. వీడియోలో కథేంటో చూచాయగా చెప్పే ప్రయత్నం చేశారు.
నగరంలో క్రైమ్స్ జరుగుతుంటాయి. అమ్మాయిల హత్యలు చేస్తున్నది ఎవరో అంతుచిక్కని పరిస్థితిలో ఓ పోలీస్ అధికారి(జయరాం) రంగంలోకి దిగుతాడు. ఈ కేసుకి రెండు రూపాల్లో కనిపిస్తున్న రావణాసురుడి(రవితేజ)కున్న సంబంధం ఏంటో ప్రపంచానికి తెలియదు. మరోవైపు ఈ పద్మవ్యూహంలో అడుగుపెట్టిన మరో యువకుడు(సుశాంత్)మీదా అనుమానం మొదలవుతుంది. సీతను దాటాలంటే ముందు రావణాసురుడిని దాటాలని సవాల్ విసిరిన హీరో వెనుక ఉన్న కథ ఏంటి, నిజంగా ఆ మర్డర్లు చేసింది ఎవరు లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి.
విజువల్స్ లో డెప్త్ కనిపిస్తోంది. రవితేజ ఇంత సీరియస్ నెగటివ్ రోల్ గతంలో చేయకపోవడంతో ఇది కొత్తగా అనిపిస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ తరహాలో కాకుండా క్రైమ్ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకోవడం బాగుంది. హీరోయిన్లు అను ఇమ్మానియేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ లను స్పీడ్ షాట్స్ లో హడావిడిగా చూపించారు. పాత్రలు చాలా ఉన్నప్పటికీ ఎక్కువగా రిలీజ్ చేయలేదు. భీమ్స్ సిసిరోలియో – హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం, విజయ్ కార్తీక్ ఛాయాగ్రహణం సమకూర్చిన ఈ థ్రిల్లర్ ఏప్రిల్ 7న కిరణ్ అబ్బవరం మీటర్, అభిరాం అహింసలతో పాటు విడుదల కానుంది.
This post was last modified on March 6, 2023 11:34 am
వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని కోర్టు విచారణకు హాజరై తిరిగి…
రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు సింగపూర్లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన శుక్రవారం తో ముగియనుంది. మూడు రోజుల పర్యటనలో…
సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు సెట్స్ పైకి వెళ్లకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్,…
నందమూరి బాలకృష్ణ స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా కష్టమే అనిపిస్తోంది. అఖండ 2 ఫ్లాప్ అయినా…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…
80, 90 దశకాల్లో వైభవం చూసిన కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. స్వతహాగా తమిళుడైనప్పటికీ.. తెలుగులోనే ఆయన పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…