ఎట్టకేలకు దగ్గుబాటి అభిరాంని హీరోగా పరిచయం చేస్తూ తీసిన అహింస విడుదల తేదీని ఏప్రిల్ 7కి లాక్ చేసి అఫీషియల్ గా ప్రకటించారు. నెలల తరబడి వాయిదా పడుతూ వచ్చి ఎప్పుడు వస్తుందో అర్థం కాక దగ్గుబాటి ఫ్యాన్స్ ని అయోమయంలోకి నెట్టేసిన సురేష్ కాంపౌండ్ ఫైనల్ గా దానికి చెక్ పెట్టేశారు. తేజ లాంటి సీనియర్ దర్శకులు తెరకెక్కించినా వీలైనంత త్వరగా థియేటర్లలో తీసుకురావాలన్న చొరవ సురేష్ బాబు చూపించలేదు. లేట్ అవ్వడానికి ఇదీ కారణమే. తేజ రెగ్యులర్ ఫార్ములాలో సాగె ప్రేమకథే అయినా బ్యాక్ డ్రాప్ కొంత డిఫరెంట్ గానే సెట్ చేసుకున్నారు.
ఫైనల్ గా శుభవార్త అయితే చెప్పారు కానీ ఆ డేట్ వెనుక ఉన్న రిస్క్ గురించి పెద్దగా క్యాలికులేట్ చేసుకున్నారో లేదోనని అభిమానులు అనుమానపడుతున్నారు. ఎందుకంటే అదే రోజు మాస్ మహారాజా రవితేజ రావణాసుర ఉంది. ధమాకా, వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్స్ తర్వాత తన జోరు మాములుగా లేదు. ఇప్పటికైతే వాయిదా సూచనలు లేవు. పోస్ట్ ప్రొడక్షన్ వేగంగా జరుగుతోంది. వచ్చే వారం టీజర్ రాబోతోంది. సో పోస్ట్ పోన్ ఆశలు పెట్టుకోకపోవడం బెటర్. కిరణ్ అబ్బవరం మీటర్ కొద్దిరోజుల క్రితమే అనౌన్స్ మెంట్ ఇచ్చింది. ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే కేవలం వారం గ్యాప్ లో ఏప్రిల్ 14 సమంతా శాకుంతలం, లారెన్స్ రుద్రుడు, విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 2 వస్తున్నాయి. వీటికి భారీ ఎత్తున రిలీజ్ దక్కనుంది. ఇన్నేసి సినిమాల మధ్య అహింసతో అభిరాం ఎలా నెగ్గుకొస్తాడనేది పెద్ద ప్రశ్న. అసలే డెబ్యూ. వీలైనంత సోలో రిలీజ్ వచ్చేలా చేసుకుంటే ప్రేక్షకులకు రిజిస్టర్ అవుతాడు. ఇలా హడావిడిగా లాంచ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనం తక్కువ. అసలు ఫిబ్రవరి, మార్చిలో అన్నేసి ఖాళీ డేట్లు వదిలేసి ఇప్పుడీ ఏప్రిల్ స్ట్రాటజీ వెనుక కారణమేంటో సినిమా చూశాక కానీ క్లారిటీ వచ్చేలా లేదు.
This post was last modified on March 5, 2023 3:45 pm
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…