దిల్ రాజు ప్రొడక్షన్స్ నుండి వేణు దర్శకుడిగా పరిచయమైన బలగం ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంటుంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం వేణు ఎంచుకున్న కథాంశం అందరినీ ఆకట్టుకుంది. ప్రసుతం థియేటర్స్ లో ఉన్న ఈ సినిమాకు కాపీ వివాదం అంటుకుంది.
‘బలగం’ కథ తనదేనంటూ గడ్డం సతీష్ అనే జర్నలిస్ట్ వివాదానికి తెర లేపాడు. 2014లో ఈ కథను పచ్చికి అనే పేరుతో ఓ ప్రముఖ తెలంగాణ దిన పత్రికలో ప్రచురించారని పేర్కొన్నాడు. ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందుకొచ్చాడు సతీశ్. దిల్ రాజు , వేణు తన కథను తీసుకొని సినిమా తీశారని కామెంట్ చేశాడు. వారి నుండి ఎలాంటి స్పందన రాకపోతే కోర్టుకి వెళ్లేందుకు సిద్దమని, కేటీఆర్ గారిని కూడా కలుస్తానని తెలిపాడు.
తాజాగా బలగం కథ కాపీ వివాదం పై దర్శకుడు వేణు సమధానమిచ్చాడు. అసలు పచ్చికి కథ తను చదవలేదని, ఆ దిన పత్రికలో స్పోర్ట్స్, సినిమా పేజీలు మాత్రమే చూస్తానని తెలిపాడు. బలగం కథ తెలంగాణ సంప్రదాయం నుండి పుట్టిందని, దర్శకుడు కేవీ అనుదీప్ తో కలిసి తను రెక్కీ చేశానని, పిట్ట ముట్టడం అనేది ఎన్నో తారల నుండి చూస్తున్నామని ఇది అందరి కథ అంటూ చెప్పుకున్నాడు వేణు. ఇందులో కొత్తదనం లేదని ఇది అందరి ఇంట్లో జరిగే కథే అంటూ చెప్పుకున్నాడు. మరి వేణు సమాధానం తర్వాత గడ్డం సతీష్ ఎలా రియాక్ట్ అవుతాడో ? ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో ? చూడాలి.
This post was last modified on March 5, 2023 1:35 pm
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…
సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…