టాలీవుడ్ స్టార్ హీరోలు ఎంతోమంది ఎప్పట్నుంచో సోషల్ మీడియాలో ఉన్నారు. కానీ వాళ్లు ఉన్నారంటే ఉన్నారని చెప్పుకోవాలి తప్ప.. ఏమంత యాక్టివ్గా ఉండట్లేదు. ఎక్కువ మాట్లాడితే తమ ఇమేజ్ తగ్గిపోతుందేమో అన్నట్లుగా ఎక్కడ లేని నియంత్రణ పాటిస్తారు స్టార్ హీరోలు. స్పందించాల్సిన అంశాల మీద కూడా సైలెంటుగా ఉండే హీరోలు ఎంతోమంది ఉన్నారు. ఐతే అలాంటి వాళ్లందరికీ గొప్ప పాఠమే చెబుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి.
గత నెల ఉగాది సందర్భంగా ట్విట్టర్లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. నిన్నటి తరానికి చెందిన చిరు ట్విట్టర్లో ఏమాత్రం యాక్టివ్గా ఉంటాడో.. మొక్కుబడిగా అకౌంట్ నడిపిస్తాడేమో అనుకున్నారు చాలామంది. కానీ ఆయన అరంగేట్రంలోనే అదరగొట్టేశారు. ఎంతో ఉత్సాహంగా ట్వీట్లు చేశారు. దాన్ని పీఆర్ టీం మెయింటైన్ చేస్తుండొచ్చు గాక.. కానీ అక్కడ ప్రతి మెసేజ్ చిరు ఆలోచనే అనడంలో సందేహం లేదు. ఆయన్ని సంప్రదించకుండా ఓ మెసేజ్ పోస్ట్ చేయలేరు.
గత నెల రోజుల్లో చిరు ట్విట్టర్లో చూపించిన ఉత్సాహం, ఆయన పెట్టిన మెసేజ్ల గురించి రాయడానికి చాలానే ఉంది. అన్నింటి గురించి ఎందుకు.. తాజాగా ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ను స్వీకరిస్తూ తాను ఇంటి పనులు చేస్తున్న వీడియోను చిరు పోస్ట్ చేశారు. తాను ఎప్పుడూ చేసేదే ఇందులో చూపిస్తున్నట్లు తెలిపాడు.
చిరు దోసెలు వేయడంలో నిపుణుడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఓసారి కర్ణాటకలో షూటింగ్ కోసం వెళ్లి అక్కడో స్పెషల్ దోసె తయారీని నేర్చుకొచ్చి దానికి తన నైపుణ్యాన్ని కూడా జోడించి ఇంట్లో దాన్ని తయారు చేశారు చిరు. దాని తయారీ గురించి ఓ రెస్టారెంట్ వాళ్లు తెలుసుకుని చిరు పేరు మీద దోసె తయారు చేసి కస్టమర్లకు వడ్డిస్తుండటం విశేషం.
చిరు ఈ దోసె వేయడంలో ఎంత నైపుణ్యం సంపాదించారన్నది తాజాగా పోస్ట్ చేసిన వీడియోను చూస్తే అర్థమవుతుంది. బాగా ఆరితేరిన చెఫ్ తరహాలో చిరు తన నైపుణ్యాన్ని చూపించారు. ఒక చోటైతే దోసెను పెనం పై నుంచి ఎగరేసిన తీరైతే వారెవా అనిపించకమానదు.
ఈ దోసె తయారీ, ఆ తర్వాత ప్రేమగా తన తల్లికి వడ్డించిన వైనం వీడియోకు ఇంకా ప్రత్యేకత తీసుకొచ్చాయి. ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్లో భాగంగా పోస్ట్ అయిన వీడియోలన్నీ చూస్తే.. చిరుదే ‘ది బెస్ట్’ అనడంలో మరో మాటలేదు. సినిమాల్లోనే కాదు.. ఇక్కడా తాను నంబర్ వన్నే అని చిరు చాటిచెప్పారని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
This post was last modified on April 23, 2020 10:49 am
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…