నటుడిగా ప్రయాణం ఆరంభించి.. దర్శకుడిగా మారి.. గొప్ప అభిరుచిని చాటుకున్నాడు అవసరాల శ్రీనివాస్. దర్శకుడిగా అతడి తొలి చిత్రం ఊహలు గుసగుసలాడే చూసి చాలామంది ఫిదా అయిపోయారు. ఐతే తొలి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని అతను జ్యో అచ్యుతానంద తీశాడు. అది కూడా మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. కమర్షియల్గానూ సక్సెస్ అయింది.
ఐతే దర్శకుడిగా అవసరాల మూడో సినిమా కోసం చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. జ్యో అచ్యుతానంద ఎప్పుడో 2016లో విడుదలై.. ఇంకో ఏడేళ్లకు కానీ అతడి కొత్త సినిమా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి రిలీజ్ కావట్లేదు. మరీ ఇంత గ్యాప్ ఏంటి అని అవసరాలను అడిగితే.. ఈ సినిమా పూర్తి చేయడంలో తలెత్తిన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చాడు.
నేను బేసిగ్గానే సినిమా కొంచెం నెమ్మదిగా తీస్తాను. స్క్రిప్టు రాయడానికి ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పడుతుంది. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రానికి స్క్రిప్టు కోసం ఇంకొంచెం ఎక్కువ సమయమే పట్టింది. నాకెంతో ఇష్టమైన బిఫోర్ సన్రైజ్ అనే ఇంగ్లిష్ సినిమా తరహాలో ఈ చిత్రం చేయాలనుకున్నా. ఇలాంటి సినిమాలకు స్క్రిప్టెడ్ డైలాగ్స్ ఉంటే బాగుండదు. సహజంగా అనిపించాలి. తెరమీద మనుషులు మాట్లాడుకుంటున్నట్లు అనిపించాలే తప్ప.. డైలాగులు చెబుతున్నట్లు ఉండకూడదు. అందుకే స్క్రిప్టు ఆలస్యం అయింది.
ఇక షూట్ మొదలయ్యాక యూకేలో పెద్ద షెడ్యూల్ అనుకున్నాం. కానీ అంతలోనే కరోనా వచ్చి వీసాలు ఇవ్వడం ఆపేశారు. చాన్నాళ్ల నిరీక్షణ తర్వాత వీసాలు ఇచ్చారు కానీ.. 40 మందికి అడిగితే 10 మందికి మాత్రమే వీసాలు వచ్చాయి. ఇంత తక్కువమందితో షూట్ చేయడం చాలా కష్టమైంది. ఇలా రకరకాల కారణాల వల్ల సినిమా ఆలస్యమైంది. నిర్మాతలు ఎంతో ఓపిగ్గా ఎదురు చూశారు. మేం షూట్ టైంలో ఎంత కష్టపడ్డా.. నాగశౌర్య నటనతో ఆ కష్టాన్ని మరిచిపోయేలా చేశాడు అని అవసరాల తెలిపాడు.
This post was last modified on March 5, 2023 9:46 am
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…