ఒక సినిమాలో హీరో పలు అవతారాల్లో కనిపించడం ఎక్కువగా తమిళ సినిమాల్లోనే కనిపిస్తుంటుంది. సీనియర్ హీరోల్లో కమల్ హాసన్కు ఈ రకమైన మోజు కొంచెం ఎక్కువే. ‘దశావతారం’ సహా పలు చిత్రాల్లో ఆయన రకరకాల అవతారాల్లో కనిపించి ఆశ్చర్యపరిచారు.
ఆయన తర్వాత విక్రమ్ కూడా ఈ తరహా సినిమాలు చేశాడు. ‘అపరిచితుడు’ మొదలుకుని..గత ఏడాది వచ్చిన ‘కోబ్రా’ వరకు విక్రమ్ పలు చిత్రాల్లో ఈ వేషాలు మార్చే పాత్రలు చేశాడు. కానీ ఒకప్పుడు ఈ తరహా పాత్రలు.. సినిమాలకు మంచి ఆదరణ ఉండేది కానీ.. తర్వాత తర్వాత మొహం మొత్తేయడంతో ప్రేక్షకుల నుంచి తిరస్కారం తప్పలేదు. గత ఏడాది ‘కోబ్రా’ చిత్రానికి వచ్చిన రిజల్ట్ చూశాక మళ్లీ ఇంకో హీరో ఇలాంటి సాహసం చేయడానికి ఆలోచిస్తాడనడంలో సందేహం లేదు. అయినా సరే.. సూర్య రిస్క్కు రెడీ అయినట్లు సమయాచారం.
సూర్య ప్రస్తుతం.. ‘శౌర్యం’ ఫేమ్ శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అజిత్తో వరుసగా నాలుగు చిత్రాలు (వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం) తీసిన శివ.. ఆ తర్వాత రజినీకాంత్తో ‘అన్నాత్తె’ చేశాడు. అది సరిగా ఆడకపోయినా సూర్య శివను నమ్మి ఓ భారీ చిత్రం చేస్తున్నాడు. భారీ బడ్జెట్లో పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ చిత్రంలో సూర్య యోధుడిగా కనిపించనున్నట్లు ఇప్పటికే సంకేతాలు అందాయి. కాగా ఇందులో అతను ఏకంగా పది రకాల గెటప్పుల్లో కనిపిస్తాడట. ఒక పీరియాడిక్ మూవీలో ఒక హీరో ఇన్ని అవతారాల్లో కనిపించడం ఇప్పటిదాకా జరగలేదు. మరి సూర్య, శివ ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లకు పైమాటే అని తెలుస్తోంది. భారీ యుద్ధ సన్నివేశాలు ఈ చిత్రంలో చూడొచ్చంటున్నారు. మన దేవిశ్రీ ప్రసాదే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పఠాని కథానాయికగా నటిస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్ధ:లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
This post was last modified on March 4, 2023 9:31 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…