ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఘనవిజయం సాధించిన సినిమా ‘వీరసింహారెడ్డి’. సినిమాకు యావరేజ్ టాకే వచ్చినా.. ‘వీరసింహారెడ్డి’ నుంచి గట్టి పోటీ ఎదురైనా ఈ సినిమా ఉన్నంతలో మెరుగైన వసూళ్లే సాధించి సూపర్ హిట్ రేంజికి వెళ్లింది.
తెలుగులో వచ్చే పేరున్న సినిమాలను విశ్లేషిస్తూ ఆసక్తికర విషయాలు చెప్పే లెజెండరీ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ.. ‘వీరసింహారెడ్డి’ మీద కూడా తన అనాలసిస్ను ‘పరుచూరి పలుకులు’లో అందించారు. ఈ సినిమాలో చోటు చేసుకున్న తప్పిదాలు.. అలాగే తనను బాగా ఆకట్టుకున్న విషయాల గురించి ఆయన మాట్లాడారు.
‘వీరసింహారెడ్డి’లో ఫస్టాఫ్ చాలా బాగుందని.. కానీ సెకండాఫ్ అనుకున్నంతగా లేదని పరుచూరి అభిప్రాయపడ్డారు. పెద్ద బాలయ్య పాత్రను ఇంటర్వెల్ కంటే ముందే చంపేయాల్సింది కాదని ఆయనన్నారు. ఇలా ప్రధాన పాత్రను మధ్యలోనే చంపేస్తే ప్రేక్షకుల్లో నిరాశ వస్తుందని పరుచూరి అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కొనఊపిరితో ఉన్న తండ్రిని చిన్న బాలయ్య సీమకు తీసుకువచ్చి.. అక్కడ ఆయన ఫ్లాష్ బ్యాక్ వినడం మొదలుపెట్టి.. తన కథ కొడుక్కి తెలిశాక ఆ పాత్ర చనిపోయి ఉంటే బాగుండేదని.. అంతే కాక చిన్న బాలయ్య తనే రంగంలోకి దిగి తన అత్తకు అసలు విషయం తెలిసేలా చేసి ఉంటే మెరుగ్గా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమాలో ఫ్లాష్బ్యాక్కు చాలా సమయం కేటాయించారని.. అనవసరమైన నిడివి పెట్టుకోకూడదని ఆయన అన్నారు.
నవీన్ చంద్రను చంపింది విలనే అనే విషయం తనకు ముందే అర్థం అయిపోయిందని.. ఒకవేళ అతను నిజంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు చూపించి ఉంటే సినిమా ఆడేది కాదని పరుచూరి చెప్పారు. సినిమాలో అనేక లోపాలు ఉన్నప్పటికీ ఈ చిత్రం రూ.134 కోట్లు వసూలు చేసిందంటే అందుకు ఏకైక కారణం బాలయ్యేనని.. ఈ సినిమాలో ఆయన్ని చూస్తుంటే బోయపాటి సినిమాలు చూస్తున్నట్లే అనిపించిందని.. సింహా, లెజెండ్ సినిమాల్లో బాడీ లాంగ్వేజ్నే ఇందులో రిపీట్ చేసినట్లు అనిపించిందని.. బాలయ్య ఇమేజ్, బాడీ లాంగ్వేజ్కు తగ్గ పవర్ ఫుల్ డైలాగులు ఇందులో పడ్డాయని పరుచూరి అభిప్రాయపడ్డారు.
This post was last modified on March 4, 2023 2:23 pm
తమిళనాడులో విజయ్ జయకేతనం ఎగరేశాక సినిమా తారల రాజకీయ ప్రభావం గురించి మళ్ళీ చర్చ మొదలయ్యింది. ముఖ్యంగా ముగ్గురు లెజెండ్స్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబోలో మూవీ అనౌన్స్ మెంట్ వచ్చాక అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న ఒకటే.…
టాలీవుడ్లో అత్యంత నిరాశాజనకంగా సాగిన వేసవి సీజన్లలో 2025 ఒకటి. ఆ సంవత్సరం ఒక్కటంటే ఒక్క పెద్ద హీరో సినిమా…
టాలీవుడ్లో హీరోగా బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చి.. తక్కువ టైంలోనే పెద్ద రేంజికి చేరుకుని.. ఆ తర్వాత సుదీర్ఘమైన ఫ్లాప్…
టీడీపీ ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తలపెట్టి రామాయల నిర్మాణానికి సంబంధించిన ఇక్కట్లు దాదాపు తొలిగిపోయాయి. ఆయన సొంత…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అసామాన్యులు విజయం దక్కించుకోవడం.. వారసులు గెలుపు గుర్రాలు ఎక్కడం.. వరుస విజయాలు దక్కించుకున్న హేమాహేమీలు…