ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఘనవిజయం సాధించిన సినిమా ‘వీరసింహారెడ్డి’. సినిమాకు యావరేజ్ టాకే వచ్చినా.. ‘వీరసింహారెడ్డి’ నుంచి గట్టి పోటీ ఎదురైనా ఈ సినిమా ఉన్నంతలో మెరుగైన వసూళ్లే సాధించి సూపర్ హిట్ రేంజికి వెళ్లింది.
తెలుగులో వచ్చే పేరున్న సినిమాలను విశ్లేషిస్తూ ఆసక్తికర విషయాలు చెప్పే లెజెండరీ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ.. ‘వీరసింహారెడ్డి’ మీద కూడా తన అనాలసిస్ను ‘పరుచూరి పలుకులు’లో అందించారు. ఈ సినిమాలో చోటు చేసుకున్న తప్పిదాలు.. అలాగే తనను బాగా ఆకట్టుకున్న విషయాల గురించి ఆయన మాట్లాడారు.
‘వీరసింహారెడ్డి’లో ఫస్టాఫ్ చాలా బాగుందని.. కానీ సెకండాఫ్ అనుకున్నంతగా లేదని పరుచూరి అభిప్రాయపడ్డారు. పెద్ద బాలయ్య పాత్రను ఇంటర్వెల్ కంటే ముందే చంపేయాల్సింది కాదని ఆయనన్నారు. ఇలా ప్రధాన పాత్రను మధ్యలోనే చంపేస్తే ప్రేక్షకుల్లో నిరాశ వస్తుందని పరుచూరి అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కొనఊపిరితో ఉన్న తండ్రిని చిన్న బాలయ్య సీమకు తీసుకువచ్చి.. అక్కడ ఆయన ఫ్లాష్ బ్యాక్ వినడం మొదలుపెట్టి.. తన కథ కొడుక్కి తెలిశాక ఆ పాత్ర చనిపోయి ఉంటే బాగుండేదని.. అంతే కాక చిన్న బాలయ్య తనే రంగంలోకి దిగి తన అత్తకు అసలు విషయం తెలిసేలా చేసి ఉంటే మెరుగ్గా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమాలో ఫ్లాష్బ్యాక్కు చాలా సమయం కేటాయించారని.. అనవసరమైన నిడివి పెట్టుకోకూడదని ఆయన అన్నారు.
నవీన్ చంద్రను చంపింది విలనే అనే విషయం తనకు ముందే అర్థం అయిపోయిందని.. ఒకవేళ అతను నిజంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు చూపించి ఉంటే సినిమా ఆడేది కాదని పరుచూరి చెప్పారు. సినిమాలో అనేక లోపాలు ఉన్నప్పటికీ ఈ చిత్రం రూ.134 కోట్లు వసూలు చేసిందంటే అందుకు ఏకైక కారణం బాలయ్యేనని.. ఈ సినిమాలో ఆయన్ని చూస్తుంటే బోయపాటి సినిమాలు చూస్తున్నట్లే అనిపించిందని.. సింహా, లెజెండ్ సినిమాల్లో బాడీ లాంగ్వేజ్నే ఇందులో రిపీట్ చేసినట్లు అనిపించిందని.. బాలయ్య ఇమేజ్, బాడీ లాంగ్వేజ్కు తగ్గ పవర్ ఫుల్ డైలాగులు ఇందులో పడ్డాయని పరుచూరి అభిప్రాయపడ్డారు.
This post was last modified on March 4, 2023 2:23 pm
సాధారణంగా మనలో ఎక్కువమంది అనుకునేది ``డబ్బుదేముంది ముందు పని కానివ్వండి. భవిష్యత్తులో డబ్బు దానంతట అదే వస్తుంది.`` అని. ఇక,…
ఫిలిం సెలబ్రెటీల్లో చాలామంది ఇండస్ట్రీలో సంపాదించే డబ్బులను భూమి మీద పెట్టుబడిగా పెడుతుంటారు. ఇలా పాత కాలంలో పెట్టుబడులు పెట్టిన…
అసెంబ్లీ నుంచి పంచాయతీ ఎన్నికల వరకు.. తీవ్రస్థాయిలో దెబ్బతిన్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు .. తాజాగా రెండు మునిసిపల్ చైర్మన్…
బెంగళూరు తర్వాత హైదరాబాద్లో బాయ్ ఫ్రెండ్స్ ను కోరుకుంటున్న ఆంటీల సంఖ్య పెరుగుతోంది. ఖర్చులతో సంబంధం లేకుండా.. తమకు అభిరుచులకు…
ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లన్నీ ఒక ఎత్తయితే, నరేంద్ర మోదీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…