మన దగ్గర ఎప్పుడో రేర్ గా హృతిక్ రోషన్ వంటి స్టార్లు అలాంటి పనులు చేస్తుంటారు కాని, హాలీవుడ్ లో అయితే రెగ్యులర్ గా ఇలాంటి యవ్వారాలు జరుగుతూనే ఉంటాయ్. భార్యతో డైవర్స్ తీసుకుంటున్నా, భర్తతో విడిపోతున్నా అంటూ అక్కడ స్టార్లు , సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటారు. ఈ మధ్యనే నడుం అందాల సుందరి కిమ్ కర్దాషియన్ విషయంలో కూడా అదే జరిగింది.
రియాల్టీ స్టార్ గా ఎంట్రీ ఇచ్చి, తరువాత బ్యూటి ప్రొడక్ట్స్ అమ్ముకుంటూ కిమ్ కర్దాషియన్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈమె ర్యాప్ సింగర్ కాన్యే వెస్ట్ ను 2014లో తన మూడవ భర్తగా వివాహమాడింది. అయితే ఈ మధ్యన కిమ్ వేరే అబ్బాయితో చనువుగా ఉంటుందనే రూమర్లు చాలానే బయటకొచ్చాయి. ఈ తరుణంలో తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అంటూ కాన్యే వెస్ట్ తన ట్విట్టర్లో పోస్టు చేశాడు. కాని అరగంటలో వాటిని డెలీట్ చేశాడు.
ఈ యవ్వారంపై స్పందించిన కిమ్.. తమ కాపురంలో అంతా బాగానే ఉందని, కాకపోతే తన భర్తకు స్ల్పిట్ పర్సనాలిటీ డిజార్టర్ ఉందని.. కాబట్టి అతను ఏం చేసినా చెప్పినా వాటిని అపార్ధం చేసుకోవద్దని, అతన్ని క్షమించాలని ఆమె ఇనస్టాగ్రాములో షేర్ చేసింది. ఇదంతా చూసి మన సమంతతో సహా అందరూ కిమ్ ను తెగ పొగిడేశారు. ఇక ఫైనల్ గా ఆమె భర్త.. సదరు అపరిచితుడు హీరో లక్షణాలున్న కాన్యే కూడా స్పందించాడు.
‘ఒక పర్సనల్ విషయాన్ని నువ్వు చూసిన కోణంలో నేను చూడలేకపోయాను. మనలో మనం మాట్లాడుకోవాల్సిన విషయాన్ని నేను నలుగురిలో మాట్లాడి నిన్ను బాధపెట్టినందుకు నన్ను మణ్ణించు. నువ్వు నా కోసం నా వెంటే నుంచున్నట్లు నేను నీ కోసం నిలబడలేకపోయాను’ అంటూ ఒక ‘అపాలజీ’ పోస్టు చేశాడు కాన్యే వెస్ట్. అయితే ఇదంతా చూస్తుంటే, వీరిరువురూ డైవర్స్ తీసుకోవడం మాత్రం పక్కా అనిపిస్తోంది అంటున్నారు హాలీవుడ్ మీడియావారు.
This post was last modified on July 27, 2020 7:50 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…