అల్లు అర్జున్ ఓ క్రేజీ సినిమాను ఎనౌన్స్ చేశాడు. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా చేయబోతున్నట్లు మేకర్స్ తో కలిసి ప్రకటించాడు బన్నీ. ఎప్పటి నుండో ఈ కాంబోలో సినిమా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఫైనల్ గా ఇప్పుడు మెటీరియలైజ్ అయింది. ఈ కాంబో సినిమాను టీ సిరీస్ భూషణ్ తో కలిసి ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించనున్నాడు.
సినిమా ఘాట్ ఎప్పుడు ? అసలు బన్నీ కి ఇది ఎన్నో ప్రాజెక్ట్ లాంటి డీటైల్స్ ఏమి చెప్పలేదు. దీంతో బన్నీ ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. అల్లు అర్జున్ అభిమానులు కంగారు పడటానికి ఓ స్ట్రాంగ్ రీజన్ ఉంది. బన్నీ ఇలా హడావుడి చేసి ఎనౌన్స్ చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళ్ళకుండానే క్యాన్సిల్ అయ్యాయి. అందులో లింగుస్వామి , కొరటాల శివ సినిమాలున్నాయి.
అప్పట్లో చెన్నై వెళ్ళి మరీ లింగుస్వామి డైరెక్షన్ లో బై లింగ్వళ్ సినిమా ఎనౌన్స్ మెంట్ చేసుకొచ్చాడు బన్నీ. ఆ సినిమా నెల తిరిగే లోపే అటకెక్కింది. ఈ మధ్యే కొరటాల శివతో కూడా బన్నీ ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు. ఇద్దరు కలిసి సముద్రపు ఒడ్డున నిలబడి మరీ సినిమాను ప్రకటించారు. కానీ ఆ ప్రాజెక్ట్ కుదరలేదు. ఆచార్య తర్వాత బన్నీతో కాకుండా ఎన్టీఆర్ తో సెట్స్ పైకి వెళ్తున్నాడు కొరటాల.
ఇవన్నీ చూస్తే బన్నీకి ఎనౌన్స్ మెంట్స్ పెద్దగా అచ్చిరానట్టు కనిపిస్తుంది. ‘పుష్ప 2’ తర్వాత బన్నీ త్రివిక్రమ్ తో ఓ ఫ్యామిలీ సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడు. సందీప్ రెడ్డి వంగా చేతిలో ‘యానిమల్’ బాలీవుడ్ సినిమా ఉంది. తర్వాత ప్రభాస్ తో ‘స్పిరిట్’ చేయాల్సి ఉంది. అంటే మరో రెండు ,మూడేళ్లు సందీప్ బిజీ. ఇక బన్నీ కూడా పుష్ప 2 ఫినిష్ చేయాల్సి ఉంది. తర్వాత త్రివిక్రమ్ సినిమాకు ఇంకా టైమ్ పట్టవచ్చు. మరి ఆ తర్వాత లెక్కలు మారితే ఈ కాంబో సినిమా ఉండక పోవచ్చు. అందుకే ఇప్పటి నుండే బన్నీ -సందీప్ సినిమా ఉంటుందా ? అనే ప్రశ్నలు ఫ్యాన్స్ లో క్రియేట్ అవుతున్నాయి.
This post was last modified on March 3, 2023 8:41 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…