అల్లు అర్జున్ ఓ క్రేజీ సినిమాను ఎనౌన్స్ చేశాడు. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా చేయబోతున్నట్లు మేకర్స్ తో కలిసి ప్రకటించాడు బన్నీ. ఎప్పటి నుండో ఈ కాంబోలో సినిమా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఫైనల్ గా ఇప్పుడు మెటీరియలైజ్ అయింది. ఈ కాంబో సినిమాను టీ సిరీస్ భూషణ్ తో కలిసి ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించనున్నాడు.
సినిమా ఘాట్ ఎప్పుడు ? అసలు బన్నీ కి ఇది ఎన్నో ప్రాజెక్ట్ లాంటి డీటైల్స్ ఏమి చెప్పలేదు. దీంతో బన్నీ ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. అల్లు అర్జున్ అభిమానులు కంగారు పడటానికి ఓ స్ట్రాంగ్ రీజన్ ఉంది. బన్నీ ఇలా హడావుడి చేసి ఎనౌన్స్ చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళ్ళకుండానే క్యాన్సిల్ అయ్యాయి. అందులో లింగుస్వామి , కొరటాల శివ సినిమాలున్నాయి.
అప్పట్లో చెన్నై వెళ్ళి మరీ లింగుస్వామి డైరెక్షన్ లో బై లింగ్వళ్ సినిమా ఎనౌన్స్ మెంట్ చేసుకొచ్చాడు బన్నీ. ఆ సినిమా నెల తిరిగే లోపే అటకెక్కింది. ఈ మధ్యే కొరటాల శివతో కూడా బన్నీ ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు. ఇద్దరు కలిసి సముద్రపు ఒడ్డున నిలబడి మరీ సినిమాను ప్రకటించారు. కానీ ఆ ప్రాజెక్ట్ కుదరలేదు. ఆచార్య తర్వాత బన్నీతో కాకుండా ఎన్టీఆర్ తో సెట్స్ పైకి వెళ్తున్నాడు కొరటాల.
ఇవన్నీ చూస్తే బన్నీకి ఎనౌన్స్ మెంట్స్ పెద్దగా అచ్చిరానట్టు కనిపిస్తుంది. ‘పుష్ప 2’ తర్వాత బన్నీ త్రివిక్రమ్ తో ఓ ఫ్యామిలీ సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడు. సందీప్ రెడ్డి వంగా చేతిలో ‘యానిమల్’ బాలీవుడ్ సినిమా ఉంది. తర్వాత ప్రభాస్ తో ‘స్పిరిట్’ చేయాల్సి ఉంది. అంటే మరో రెండు ,మూడేళ్లు సందీప్ బిజీ. ఇక బన్నీ కూడా పుష్ప 2 ఫినిష్ చేయాల్సి ఉంది. తర్వాత త్రివిక్రమ్ సినిమాకు ఇంకా టైమ్ పట్టవచ్చు. మరి ఆ తర్వాత లెక్కలు మారితే ఈ కాంబో సినిమా ఉండక పోవచ్చు. అందుకే ఇప్పటి నుండే బన్నీ -సందీప్ సినిమా ఉంటుందా ? అనే ప్రశ్నలు ఫ్యాన్స్ లో క్రియేట్ అవుతున్నాయి.
This post was last modified on March 3, 2023 8:41 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…