కొన్ని సినిమాల విజయాలు అనూహ్యంగా ఉంటాయి. తీసే సమయంలో దర్శక నిర్మాతలు ఆ స్థాయి ఫలితాలు ఊహించి ఉండరు. దానికి ఉదాహరణగా నిలుస్తోంది మలయాళంలో నెల రోజుల క్రితం విడుదలైన రొమంచమ్. ఇందులో మమ్ముట్టి మోహన్ లాల్ లాంటి బడా స్టార్లు లేరు. ప్రధాన పాత్ర పోషించింది షౌబిన్ షాహిర్ అంటే నటుడు. బట్టతలతో పొట్టిగా ఉండే ఈ ఆర్టిస్టు సహజమైన నటనతో ఇట్టే ఆకట్టుకుంటాడు. ఆ మధ్య ఆలీ నిర్మించిన అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఒరిజినల్ వెర్షన్ లో ఆ క్యారెక్టర్ చేసింది ఇతనే. కేరళలో చాలా మంచి పేరుంది.
కేవలం 2 కోట్ల బడ్జెట్ తో రూపొందిన రొమంచమ్ ఇంకా ఫైనల్ రన్ కు వెళ్లకుండా 55 కోట్ల గ్రాస్ ని దాటేసి కొత్త రికార్డులు సృష్టించేందుకు పరుగులు పెడుతోంది. జితు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కామెడీ కం హారర్ థ్రిల్లర్. 2007 బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఏడుగురు బ్రహ్మచారులు బోర్ కొడుతోందనే ఉద్దేశంతో సరదాగా ఔజా గేమ్ ఆడతారు. అంటే ఓ బోర్డు మీద ఇంగ్లీష్ అక్షరాలు నెంబర్లు ఉపయోగించి ప్రేతాత్మలతో మాట్లాడ్డం. ఏదో టైం పాస్ కోసం మొదలుపెడితే ఇది కాస్తా అనూహ్య సంఘటనలకు దారి తీస్తుంది. అక్కడి నుంచి జరిగేది మాములుగా నవ్వించదు.
ఇప్పుడీ రొమంచమ్ రీమేక్ హక్కులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. తెలుగు నుంచి రెండు బడా సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇటీవలి కాలంలో మల్లువుడ్ కథలు మనకు అంతగా అచ్చిరావడం లేదు. అందుకే రేట్ రీజనబుల్ గా అనిపిస్తేనే కొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయినా ఓటిటిల కాలంలో రూపాయి పెట్టుబడి ముప్పై రూపాయల లాభం ఏ వ్యాపారంలోనూ లేదు. అలాంటిది ఈ రొమంచమ్ రేపుతున్న సంచలనం చూస్తుంటే కంటెంట్ కున్న బలమేంటో అర్థం చేసుకోవచ్చు. క్రియేటివిటీ చూపించాలే కానీ ఆడియన్స్ ఆదరణ ఎప్పుడూ ఉంటుందని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు.
This post was last modified on March 3, 2023 12:09 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…
కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు.…
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…