మెగాస్టార్ కి తిరుగులేని బ్లాక్ బస్టర్ అందించిన వాల్తేరు వీరయ్య దిగ్విజయంగా యాభై రోజులు పూర్తి చేసుకుంది. 67 కేంద్రాల్లో రెగ్యులర్ షోలతో ఈ ఫీట్ ని అందుకుంది. కొన్ని షిఫ్టింగ్ తో కలిపి ఈ నెంబర్ లో మార్పులు అటు ఇటుగా ఉండొచ్చు కానీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి పోస్టర్ తప్ప దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఇదే ఫైనల్ అనుకోవాలి. ఆచార్య దారుణమైన డిజాస్టర్, మంచి టాక్ వచ్చినా లాంగ్ రన్ కు ఉపయోగపడని గాడ్ ఫాదర్ ఫలితం తరువాత ఈ స్థాయిలో కంబ్యాక్ అవ్వడం మెగా ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తుతోంది.
మొదటి మూడు వారాలు భారీ వసూళ్లను రాబట్టిన వాల్తేరు వీరయ్య జోరు చూసి అల వైకుంఠపురములో పేరు మీద ఉన్న నాన్ బాహుబలి రికార్డులను చిరంజీవి అందుకుంటారని ఆశించిన ఫ్యాన్స్ కి చాలా సెంటర్స్ లో ఆ కోరిక నెరవేరలేదు. ఈ సినిమాతో పాటు వందకు పైగా ఫిఫ్టీ డేస్ సెంటర్లు కలిగిన అఖండ, రంగస్థలం లాంటి వాటిని వీరయ్య దాటలేకపోయాడు. అయితే వీరసింహారెడ్డి కన్నా డబుల్ నెంబర్స్ నమోదు కావడం విజేతగా నిలిపింది. దర్శకుడు బాబీ కథా కథనాల్లో కొత్తదనం లేకపోయినా వింటేజ్ చిరుని చూపించడంలో సక్సెస్ కావడం ఈ రిజల్ట్ ఇచ్చింది.
దీనివల్లే చిరంజీవి ఇప్పుడు చేస్తున్న భోళా శంకర్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. వేదాళం రీమేక్ కావడంతో ముందు నుంచి దీని మీద నెగటివ్ వైబ్స్ ఉన్నాయి. పైగా దర్శకుడు మెహర్ రమేష్ ట్రాక్ రికార్డు ఫ్యాన్స్ ని భయపెడుతోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పొరపాటుకి ఆస్కారం ఇవ్వకుండా ముందు అనుకున్న ఏప్రిల్ విడుదలని వాయిదా వేసుకుని మరీ కీలకమైన మార్పులు కొన్ని చేశారట. ఇది కూడా వాల్తేరు వీరయ్యలాగే రొటీన్ ఫార్ములాలో ఉంటూనే ఫ్యాన్స్ కోరుకునే అంశాలను జత చేశారు. ఇందులో చిరు పవన్ కళ్యాణ్ అభిమానిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on March 3, 2023 10:52 am
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…