సినిమా అనౌన్స్ అయినపుడే మంచి క్రేజ్ తెచ్చుకుంది ‘ఖుషి’. ఆ సినిమా మొదలయ్యేటప్పటికి విజయ్ దేవరకొండ డిజాస్టర్ మూవీ ‘లైగర్’ రిలీజ్ కాలేదు. సమంత కూడా అప్పటికి మంచి ఊపులోనే ఉంది. ఇలా సినిమా అనౌన్స్ చేశారో లేదో.. అలా చకచకా షూటింగ్కు సన్నాహాలు జరిగిపోయాయి. రెండు నెలల పాటు శరవేగంగా షూటింగ్ జరిగింది. సగం పైగా సినిమా పూర్తయింది. ఆ ఊపు అలాగే కొనసాగి ఉంటే.. గత ఏడాది క్రిస్మస్ సీజన్లోనే సినిమా రిలీజైపోయేది. కానీ ఈ చిత్రానికి అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి.
ఓవైపు విజయ్ ‘లైగర్’ ప్రమోషన్ల కోసం పక్కకు వెళ్లాడు. మరోవైపు సమంత అనూహ్యంగా అనారోగ్యం బారిన పడింది. విజయ్ ఫ్రీ అయినా సమంత కోలుకోకపోవడంతో ఆరు నెలలకు పైగా సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. దీనికి తోడు ‘లైగర్’ ఫలితం ఈ సినిమాపై ప్రతికూల ప్రభావం చూపించి.. బజ్ అంతా పోయింది.
సమంత ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో.. షూటింగ్ ఎప్పుడు అవుతుందో తెలియక రిలీజ్ను నిరవధికంగా వాయిదా వేశారు. ఐతే ఎట్టకేలకు అయోమయం తొలగినట్లు కనిపిస్తోంది. సమంత ఈ నెల 8 నుంచే ‘ఖుషి’ చిత్రీకరణలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇంకే అవాంతరాలు లేనట్లయితే.. విరామం లేకుండా సినిమా చిత్రీకరణ సాగించాలని.. రెండు నెలల్లో షూట్ మొత్తం పూర్తి చేయాలని అనుకుంటున్నారు. కుదిరితే వేసవి చివర్లో అయినా సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మే అంటే కష్టం కానీ.. జూన్ నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి అవకాశముంది. ఈసారి షెడ్యూళ్లు అయితే పక్కా ప్లానింగ్తో నడవబోతున్నట్లు తెలుస్తోంది.
‘నిన్నుకోరి’, ‘మజిలీ’ తర్వాత శివ నిర్వాణ రూపొందిస్తున్న పూర్తి స్థాయి ప్రేమకథ కావడం.. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద బేనర్ తీస్తున్న సినిమా కావడంతో సినిమా అంచనాలకు తగ్గట్లే ఉంటుందని భావిస్తున్నారు.
This post was last modified on March 3, 2023 10:33 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…