థియేటర్ సినిమా సగటు మధ్య తరగతి ప్రేక్షకులకు చేరువ కావాలంటే టికెట్ రేట్లే కీలకం. ఎందుకంటే మహారాజా పోషకులు వాళ్ళే. కోట్లలో బిజినెస్ లు, లక్షల్లో జీతాలు అందుకునే ఉద్యోగాలు చేసే వాళ్లకు వీక్ డేస్ లో హాళ్లకు వచ్చేంత తీరిక ఓపిక ఉండదు. కానీ ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయని ముఖ్యంగా మల్టీప్లెక్సులు 150 నుంచి 200 రూపాయలకు పైగా రేట్లు పెట్టేయడంతో అధిక శాతం ఫ్యామిలీస్ తెరమీద ఏవి చూడాలో ఆచితూచి నిర్ణయించుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితిలో కేవలం 112 రూపాయల స్ట్రాటజీ అనేది చాలా మంచి ఆలోచన.
హైదరాబాద్ లో చాలా మల్టీప్లెక్సులు ఈ విధానాన్ని నిర్మాతల సహకారంతో రెగ్యులర్ గా అమలు చేసే దిశగా చర్యలు చేపడుతున్నాయి. రేపు విడుదల కాబోతున్న బలగం పివిఆర్, ఐనాక్స్ ఇలా దేంట్లో చూడాలనుకున్నా జస్ట్ 112 ఖర్చు పెడితే చాలు. ఇదొక్కటే కాదు పాత బ్లాక్ బస్టర్స్ కి సైతం ఇదే విధానాన్ని అవలంబించబోతున్నాయి. ప్రస్తుతం నగరంలో ప్రదర్శిస్తున్న వాటిలో శ్రీదేవి చాందిని, షారుఖ్ ఖాన్ చక్ దే ఇండియా, ఇంగ్లీష్ వింగ్లిష్, సమంతా ఓ బేబీ, అలియా భట్ రాజీ, గంగూబాయ్ కటియావాడి, కీర్తి సురేష్ మహానటి, దిల్వాలే దుల్హనియా లేజాయేంగే తదితర చిత్రాలన్నీ పైన చెప్పిన ధరకే టికెట్లు అమ్ముతున్నాయి.
ఇకపై ఈ ట్రెండ్ ప్రతివారం కొనసాగాలి. వందల కోట్లతో ముడిపడిన భారీ బడ్జెట్ చిత్రాలకు ఇది సాధ్యం కాకపోవచ్చు కానీ పెద్దగా అంచనాలు లేని లో బడ్జెట్ మూవీస్ కి ఇది ఖచ్చితంగా వరమే. టైం పాస్ కోసమో, వేసవి నుంచి సేద తీరడానికి ఏసి కోసమో సినిమాలకొచ్చే పబ్లిక్ ఇలాంటి తగ్గింపులు వల్ల ఎక్కువ ఆకర్షితులు అవుతారు. బాక్సాఫీస్ బాగా డల్ గా ఉన్న టైంలో ఇవి చాలా ఉపయోగపడతాయి. సింగల్ స్క్రీన్లలో సైతం బాల్కనీ వంద లోపు ఉంటే ఇంకా మంచిది. బయట నిత్యావసరాల ధరలతో నరకం చూస్తున్న సగటు మనిషికి వినోదాన్నిచ్చే థియేటర్లకు ఇలాంటి ఉపశమనాలు అవసరమే.
This post was last modified on March 3, 2023 8:46 am
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…