Movie News

బాలయ్య ఎందుకలా చేశాడు?

నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య సఖ్యత ఉన్నది చాలా కొద్ది కాలం మాత్రమే. కెరీర్ ఆరంభ దశలో తారక్‌ను బాలయ్య పెద్దగా పట్టించుకున్నది లేదు. అతను స్టార్ అయ్యాక కాస్త గుర్తించడం మొదలుపెట్టాడు. 2009 ఎన్నికలకు ముందు కొంత కాలం ఇద్దరూ చాలా సన్నిహితంగా కనిపించేవారు. తారక్ గురించి బాలయ్య అప్పట్లో పాజిటివ్‌గా మాట్లాడేవాడు. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కొంత కాలానికే పార్టీకి.. అలాగే బాలయ్యకు, చంద్రబాబుకు తారక్ దూరం అయిపోయాడు.

ఇందుకు కారణాలేంటన్నది పక్కన పెడితే.. బహిరంగంగా బాలయ్య విషయంలో తారక్ ఎప్పుడూ అమర్యాదకరంగా, అగౌరవపరిచే విధంగా మాట్లాడింది, ప్రవర్తించింది లేదు. కానీ తెర వెనుక ఏం జరిగిందో ఏమో కానీ.. బాలయ్య మాత్రం తారక్‌ పట్ల వ్యవహరిస్తున్న తీరు జూనియర్ అభిమానులకు ఏమాత్రం రుచించడం లేదు.

తారక్ రాజకీయ ప్రవేశం గురించి మీడియా వాళ్లు అడిగినపుడల్లా బాలయ్య అతణ్ని తక్కువ చేసేలా మాట్లాడటం చూస్తూనే ఉన్నాం. తాజాగా తారకరత్న దశ దిన కార్యక్రమం సందర్భంగా తారక్‌ పట్ల బాలయ్య వ్యవహరించిన తీరు మరోసారి జూనియర్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ కార్యక్రమం సందర్భంగా ఒక ఆడిటోరియంలో బాలయ్య తనకు ఎదురు పడ్డ వాళ్లను పలకరిస్తుండగా.. కాస్త సమీపంలో ఉన్న తారక్, కళ్యాణ్ రామ్ లేచి నిలబడ్డారు. ఐతే బాలయ్య మాత్రం తారక్ వైపు చూడటం కానీ.. అతణ్ని పలకరించడం కానీ చేయలేదు. దగ్గర్లో ఉన్న వేరే వాళ్లను పలకరించి.. తారక్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ చిన్న వీడియో చూసి ఒక అంచనాకు రాలేం. ఆ తర్వాత తారక్‌ను బాలయ్య పలకరించాడేమో తెలియదు. కానీ వీడియో చూస్తే మాత్రం తారక్ పట్ల బాలయ్య వ్యవహరించిన తీరు ఏమాత్రం సహేతుకంగా అనిపించడం లేదు. తారక్ ఏం తప్పు చేశాడని బాలయ్య అతణ్ని ఇంత చిన్న చూపు చూస్తాడంటూ అతడి అభిమానులు మండిపడుతున్నారు సామాజిక మాధ్యమాల్లో.

This post was last modified on March 3, 2023 8:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

4 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

5 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

5 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

5 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

5 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

6 hours ago