నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య సఖ్యత ఉన్నది చాలా కొద్ది కాలం మాత్రమే. కెరీర్ ఆరంభ దశలో తారక్ను బాలయ్య పెద్దగా పట్టించుకున్నది లేదు. అతను స్టార్ అయ్యాక కాస్త గుర్తించడం మొదలుపెట్టాడు. 2009 ఎన్నికలకు ముందు కొంత కాలం ఇద్దరూ చాలా సన్నిహితంగా కనిపించేవారు. తారక్ గురించి బాలయ్య అప్పట్లో పాజిటివ్గా మాట్లాడేవాడు. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కొంత కాలానికే పార్టీకి.. అలాగే బాలయ్యకు, చంద్రబాబుకు తారక్ దూరం అయిపోయాడు.
ఇందుకు కారణాలేంటన్నది పక్కన పెడితే.. బహిరంగంగా బాలయ్య విషయంలో తారక్ ఎప్పుడూ అమర్యాదకరంగా, అగౌరవపరిచే విధంగా మాట్లాడింది, ప్రవర్తించింది లేదు. కానీ తెర వెనుక ఏం జరిగిందో ఏమో కానీ.. బాలయ్య మాత్రం తారక్ పట్ల వ్యవహరిస్తున్న తీరు జూనియర్ అభిమానులకు ఏమాత్రం రుచించడం లేదు.
తారక్ రాజకీయ ప్రవేశం గురించి మీడియా వాళ్లు అడిగినపుడల్లా బాలయ్య అతణ్ని తక్కువ చేసేలా మాట్లాడటం చూస్తూనే ఉన్నాం. తాజాగా తారకరత్న దశ దిన కార్యక్రమం సందర్భంగా తారక్ పట్ల బాలయ్య వ్యవహరించిన తీరు మరోసారి జూనియర్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ కార్యక్రమం సందర్భంగా ఒక ఆడిటోరియంలో బాలయ్య తనకు ఎదురు పడ్డ వాళ్లను పలకరిస్తుండగా.. కాస్త సమీపంలో ఉన్న తారక్, కళ్యాణ్ రామ్ లేచి నిలబడ్డారు. ఐతే బాలయ్య మాత్రం తారక్ వైపు చూడటం కానీ.. అతణ్ని పలకరించడం కానీ చేయలేదు. దగ్గర్లో ఉన్న వేరే వాళ్లను పలకరించి.. తారక్ను ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ చిన్న వీడియో చూసి ఒక అంచనాకు రాలేం. ఆ తర్వాత తారక్ను బాలయ్య పలకరించాడేమో తెలియదు. కానీ వీడియో చూస్తే మాత్రం తారక్ పట్ల బాలయ్య వ్యవహరించిన తీరు ఏమాత్రం సహేతుకంగా అనిపించడం లేదు. తారక్ ఏం తప్పు చేశాడని బాలయ్య అతణ్ని ఇంత చిన్న చూపు చూస్తాడంటూ అతడి అభిమానులు మండిపడుతున్నారు సామాజిక మాధ్యమాల్లో.
This post was last modified on March 3, 2023 8:26 am
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…