టాలీవుడ్లో కొన్నేళ్ల పాటు నంబర్ వన్ హీరోయిన్గా కొనసాగిన వాళ్లు ఎవ్వరూ లేరు చాలా ఏళ్లుగా. అటు ఇటుగా ఒక దశాబ్దం పాటు అనుష్క, కాజల్, సమంత, తాప్సి.. ఒకరికి ఒకరు దీటుగా నిలిచారు. ఆ తర్వాత వీరిలో ఒకరి తర్వాత ఒకరు జోరు తగ్గించేశారు. ఆ తర్వాత కొంత కాలం రకుల్ ప్రీత్, ఆపై పూజా హెగ్డే.. ఆమెతో పాటు రష్మిక మందన్నా భారీ చిత్రాలతో నంబర్ వన్ రేసులో నిలిచారు కానీ.. వీరిలో ఎవ్వరూ కూడా దీర్ఘ కాలం పాటు ఆధిపత్యం చలాయించలేదు.
రష్మికకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. పూజా హెగ్డే సైతం ఈ మధ్య జోరు తగ్గించేసింది. ఐతే ఇప్పుడు శ్రీ లీల అనే అమ్మాయి నంబర్ వన్ కిరీటం వైపు వేగంగా దూసుకెళ్తోంది. పూజా, రష్మికల జోరు తగ్గించిన సమయంలోనే ఆమె దూకుడు చూపిస్తోంది. ‘పెళ్ళిసంద-డి’ అనే పేలవమైన సినిమాతో కథానాయికగా పరిచయం అయినప్పటికీ.. ఆ చిత్రంలో శ్రీలీల బాగానే హైలైట్ అయింది.
ఆ ఊపులో ‘ధమాకా’ సినిమాలో రవితేజతో జోడీ కట్టే అవకాశం దక్కించుకున్న ఆమె.. ఈ ఛాన్సును గొప్పగా ఉపయోగించుకుంది. తన అందం, డ్యాన్సులతో అదరగొట్టేసి సినిమా బ్లాక్ బస్టర్ కావడంలో కీలక పాత్ర పోషించింది. ఈ దెబ్బతో ఒక్కసారిగా శ్రీలీల రేంజ్ మారిపోయింది.
ఓవైపు మహేష్ బాబుకు.. మరోవైపు విజయ్ దేవరకొండకు జోడీగా నటించే అవకాశాలు తెచ్చుకుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమాలోనూ శ్రీలీలే హీరోయిన్ అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే శ్రీలీల టాప్ లీగ్కు వెళ్లిపోయినట్లే కనిపిస్తోంది. ఆమె పారితోషకం కూడా ఒక్కసారిగా రూ.1.5 కోట్లకు పెరిగిపోయిందని అంటున్నారు. ఇంకా ఆమె కోసం చాలామంది ప్రొడ్యూసర్లు ట్రై చేస్తున్నారు. ఇంకా ఒకట్రెండు హిట్లు పడ్డాయంటే మిగతా స్టార్ హీరోయిన్లను వెనక్కి నెట్టి శ్రీలీల హోల్ అండ్ సోల్ నంబర్ వన్ కావడం లాంఛనమే కావచ్చు.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…