తెలుగు, ఇతర భాషల ప్రేక్షకులు పెద్దగా ఆదరించకపోయినా.. గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్టయిన చిత్రాల్లో ‘పొన్నియన్ సెల్వన్’ ఒకటి. తమిళంలో ఆల్ టైం బెస్ట్ నవలగా పేరున్న ‘పొన్నియన్ సెల్వన్’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట సంచలన వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా తమిళవాళ్లు ఉన్న ప్రతి చోటా ఈ చిత్రం అదరగొట్టింది.
తమిళులు ఈ చిత్రాన్ని గర్వకారణంగా భావించారు. ఈ సినిమా చూడడాన్ని ఒక బాధ్యతగా ఫీలయ్యారు. దీంతో సినిమాపై వసూళ్ల వర్షం కురిసింది. పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ టైంకే రెండో పార్ట్ కూడా చాలా వరకు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 28న ‘పీఎస్-2’ను రిలీజ్ చేయబోతున్నట్లు ఇంతకుముందే ప్రకటించారు. కానీ ఈ మధ్య అనుకున్న ప్రకారం ఈ సినిమా రావడం సందేహమే అని ప్రచారం మొదలైంది. ఈ ఏడాది ద్వితీయార్ధానికి వాయిదా అన్నారు.
కానీ ఆ ప్రచారం నిజం కాదని తేలిపోయింది. అనుకున్న ప్రకారమే సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ధ్రువీకరించింది. ఈ మేరకు కొత్త పోస్టర్ కూడా వదిలింది. దీంతో తమిళ జనాల సంబరం మామూలుగా లేదు. మనకు అంత ఎగ్జైట్మెంట్ లేకపోయినా.. తమిళ జనాలు మాత్రం ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తొలి భాగం చూసిన ప్రతి ఒక్కరూ దీన్నీ చూస్తారనడంలో సందేహం లేదు.
థియేటర్లలో మిస్సయి ఓటీటీలో చూసిన వాళ్లు కూడా ముగింపు భాగాన్ని తెరపై చూడడానికి రెడీ అయ్యారు. టాక్తో సంబంధం లేకుండా ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తుందనడంలో సందేహం లేదు. తెలుగులో అఖిల్ సినిమా ‘ఏజెంట్’కు పోటీగా ‘పొన్నియన్ సెల్వన్-2’ రిలీజ్ కాబోతోంది. హిందీలో కూడా ఈ సినిమా గట్టి పోటీనే ఎదుర్కోబోతోంది. మరి సెకండ్ పార్ట్ అయినా తమిళేతర భాషల్లో మంచి ఫలితం అందుకుంటుందేమో చూడాలి.
This post was last modified on March 1, 2023 10:18 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…