తెలుగు, ఇతర భాషల ప్రేక్షకులు పెద్దగా ఆదరించకపోయినా.. గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్టయిన చిత్రాల్లో ‘పొన్నియన్ సెల్వన్’ ఒకటి. తమిళంలో ఆల్ టైం బెస్ట్ నవలగా పేరున్న ‘పొన్నియన్ సెల్వన్’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట సంచలన వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా తమిళవాళ్లు ఉన్న ప్రతి చోటా ఈ చిత్రం అదరగొట్టింది.
తమిళులు ఈ చిత్రాన్ని గర్వకారణంగా భావించారు. ఈ సినిమా చూడడాన్ని ఒక బాధ్యతగా ఫీలయ్యారు. దీంతో సినిమాపై వసూళ్ల వర్షం కురిసింది. పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ టైంకే రెండో పార్ట్ కూడా చాలా వరకు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 28న ‘పీఎస్-2’ను రిలీజ్ చేయబోతున్నట్లు ఇంతకుముందే ప్రకటించారు. కానీ ఈ మధ్య అనుకున్న ప్రకారం ఈ సినిమా రావడం సందేహమే అని ప్రచారం మొదలైంది. ఈ ఏడాది ద్వితీయార్ధానికి వాయిదా అన్నారు.
కానీ ఆ ప్రచారం నిజం కాదని తేలిపోయింది. అనుకున్న ప్రకారమే సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ధ్రువీకరించింది. ఈ మేరకు కొత్త పోస్టర్ కూడా వదిలింది. దీంతో తమిళ జనాల సంబరం మామూలుగా లేదు. మనకు అంత ఎగ్జైట్మెంట్ లేకపోయినా.. తమిళ జనాలు మాత్రం ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తొలి భాగం చూసిన ప్రతి ఒక్కరూ దీన్నీ చూస్తారనడంలో సందేహం లేదు.
థియేటర్లలో మిస్సయి ఓటీటీలో చూసిన వాళ్లు కూడా ముగింపు భాగాన్ని తెరపై చూడడానికి రెడీ అయ్యారు. టాక్తో సంబంధం లేకుండా ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తుందనడంలో సందేహం లేదు. తెలుగులో అఖిల్ సినిమా ‘ఏజెంట్’కు పోటీగా ‘పొన్నియన్ సెల్వన్-2’ రిలీజ్ కాబోతోంది. హిందీలో కూడా ఈ సినిమా గట్టి పోటీనే ఎదుర్కోబోతోంది. మరి సెకండ్ పార్ట్ అయినా తమిళేతర భాషల్లో మంచి ఫలితం అందుకుంటుందేమో చూడాలి.
This post was last modified on March 1, 2023 10:18 pm
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…