Movie News

అభిమాని కోసం టీజర్ ఆపేశారు

తమను ఈ స్థాయిలో నిలబెట్టినందుకు ఫ్యాన్స్ కోసం హీరోలు ఎంత చేసినా తక్కువే. అయితే లక్షలు కోట్లలో ఉండే వీళ్లందరి బాగోగులు చూడటం ప్రత్యక్షంగా పలకరించడం సాధ్యమయ్యే పని కాదు కానీ ఉన్నంతలో సందర్భానికి తగ్గట్టు కర్టసి చూపించడం ఎంతైనా అవసరం. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ అదే చేశాడు. ఇవాళ తన కొత్త సినిమా విరూపాక్ష టీజర్ రిలీజ్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న వినోదయ సితం రీమేక్ షూటింగ్ జరుగుతున్న సెట్ లో పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా చూపించి మరీ మావయ్య అభినందనలు అందుకున్నాడు తేజు.

అనూహ్యంగా ఇవాళ భీమవరం సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రావూరి పండు హఠాన్మరణం చెందటంతో లాంచ్ ని వాయిదా వేశారు. ఈ పండు చాలా చిన్న వయసు కావడం, ఇటీవలి కాలంతో అందరినీ భయపెడుతున్న తరహాలోనే గుండెపోటుకి గురి కావడం తీవ్ర విషాదాన్ని రేపుతోంది. తేజు కోసం ఎన్నో సేవ కార్యక్రమాలు చేసిన పండు గతంలో తన హీరోతో కలుసుకున్న ఫోటోలు, చేసిన కార్యక్రమాలు అన్నీ సోషల్ మీడియాలో పెట్టేవాడు. ఇంత సన్నహితంగా ఉండేవాడు కాబట్టి ఈ సందర్భంలో టీజర్ ని రిలీజ్ చేయడం భావ్యం కాదని పోస్ట్ పోన్ చేయడం మంచిదే.

వచ్చే నెల విడుదల కాబోతున్న విరూపాక్ష మీద భారీ అంచనాలున్నాయి. సుకుమార్ రచన చేసిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ లో మూఢనమ్మకాల మీద కథను అల్లుకున్నారు. కార్తీక్ దండు దర్శకత్వం వహించగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 21 విడుదల ప్లాన్ చేసుకున్న విరూపాక్షకు గట్టి పోటీ స్వాగతం చెబుతోంది. అదే రోజు సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకా జాన్ విడుదల కానుంది. తేజు మూవీని కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లో వివిధ భాషల్లో ప్లాన్ చేశారు కాబట్టి కండల వీరుడిని తట్టుకుని నిలవాల్సి ఉంటుంది. రిపబ్లిక్ తర్వాత తను చేస్తున్న చిత్రమిదే.

This post was last modified on March 1, 2023 11:19 am

Share

Recent Posts

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

10 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

11 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

1 hour ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

2 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago

వంగ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ తప్పదా

సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…

3 hours ago