తమను ఈ స్థాయిలో నిలబెట్టినందుకు ఫ్యాన్స్ కోసం హీరోలు ఎంత చేసినా తక్కువే. అయితే లక్షలు కోట్లలో ఉండే వీళ్లందరి బాగోగులు చూడటం ప్రత్యక్షంగా పలకరించడం సాధ్యమయ్యే పని కాదు కానీ ఉన్నంతలో సందర్భానికి తగ్గట్టు కర్టసి చూపించడం ఎంతైనా అవసరం. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ అదే చేశాడు. ఇవాళ తన కొత్త సినిమా విరూపాక్ష టీజర్ రిలీజ్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న వినోదయ సితం రీమేక్ షూటింగ్ జరుగుతున్న సెట్ లో పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా చూపించి మరీ మావయ్య అభినందనలు అందుకున్నాడు తేజు.
అనూహ్యంగా ఇవాళ భీమవరం సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రావూరి పండు హఠాన్మరణం చెందటంతో లాంచ్ ని వాయిదా వేశారు. ఈ పండు చాలా చిన్న వయసు కావడం, ఇటీవలి కాలంతో అందరినీ భయపెడుతున్న తరహాలోనే గుండెపోటుకి గురి కావడం తీవ్ర విషాదాన్ని రేపుతోంది. తేజు కోసం ఎన్నో సేవ కార్యక్రమాలు చేసిన పండు గతంలో తన హీరోతో కలుసుకున్న ఫోటోలు, చేసిన కార్యక్రమాలు అన్నీ సోషల్ మీడియాలో పెట్టేవాడు. ఇంత సన్నహితంగా ఉండేవాడు కాబట్టి ఈ సందర్భంలో టీజర్ ని రిలీజ్ చేయడం భావ్యం కాదని పోస్ట్ పోన్ చేయడం మంచిదే.
వచ్చే నెల విడుదల కాబోతున్న విరూపాక్ష మీద భారీ అంచనాలున్నాయి. సుకుమార్ రచన చేసిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ లో మూఢనమ్మకాల మీద కథను అల్లుకున్నారు. కార్తీక్ దండు దర్శకత్వం వహించగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 21 విడుదల ప్లాన్ చేసుకున్న విరూపాక్షకు గట్టి పోటీ స్వాగతం చెబుతోంది. అదే రోజు సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకా జాన్ విడుదల కానుంది. తేజు మూవీని కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లో వివిధ భాషల్లో ప్లాన్ చేశారు కాబట్టి కండల వీరుడిని తట్టుకుని నిలవాల్సి ఉంటుంది. రిపబ్లిక్ తర్వాత తను చేస్తున్న చిత్రమిదే.
This post was last modified on March 1, 2023 11:19 am
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…