మెగా బ్రదర్ నాగబాబు కొన్నేళ్ల కిందట పెద్ద సంక్షోభంలో చిక్కుకుని ఉన్నారు. ఆ సమయంలో సీరియల్స్ , టీవీ షోలు చేసి కొంచెం నిలదొక్కుకున్నారాయన. అప్పుడే కొడుకు వరుణ్ తేజ్ అందుబాటులోకి వచ్చాడు. హీరోగా తెరంగేట్రం చేసి చాలా త్వరగానే నిలదొక్కున్నాడు.
‘కంచె’, ‘ఫిదా’, ‘తొలి ప్రేమ’, ‘ఎఫ్-2’ లాంటి సినిమాలతో నటుడిగా నిరూపించుకుంటూనే విజయాలు కూడా అందుకుని స్టార్ ఇమేజ్ సంపాదించాడు. ఇప్పుడు నాగబాబు కొడుకును చూసి ఎంత సంతృప్తిగా ఉంటాడో చెప్పాల్సిన పని లేదు.
ఆ మధ్య వరుణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఎంత ఎమోషనల్ అయ్యాడో.. కొడుకు కెరీర్ పట్ల ఎంత గర్వ పడుతున్నట్లు చెప్పాడో తెలిసిందే. ఇప్పుడు కొడుకు కెరీర్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి మాట్లాడాడు.
వరుణ్ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించడం పట్ల నాగబాగా చాలా సంతోషపడిపోయాడు. ఇక వరుణ్ను ఎలాంటి సినిమాల్లో చూడాలనుకుందని అడిగితే.. తన అన్నయ్య కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయిన రెండు సినిమాల్ని వరుణ్ రీమేక్ చేస్తే చూడాలనుందని నాగబాబు తెలిపాడు.
ఆ రెండు సినిమాలు.. ఛాలెంజ్, కొదమసింహం అని చెప్పాడు నాగబాబు. అన్నయ్య సినిమాల్లో ఈ రెండూ తనకెంతో ఇష్టమని.. వరుణ్ను హీరోగా పెట్టి వీటిని ఈ కాలానికి తగ్గట్లుగా రీమేక్ చేస్తే చూడాలనుందని నాగబాబు తెలిపాడు. ఐతే ఆ రెండు చిత్రాల్ని రీమేక్ చేయడం అంత సులువు కాదని కూడా నాగబాబు అభిప్రాయపడ్డాడు.
మరి వరుణ్ తండ్రి కోరికను నెరవేర్చే ప్రయత్నం చేస్తాడేమో చూడాలి గత ఏడాది ‘ఎఫ్-2’ లాంటి బ్లాక్ బస్టర్, ‘గద్దలకొండ గణేష్’ లాంటి హిట్ మూవీల్లో నటించిన వరుణ్.. ప్రస్తుతం గీతా ఆర్ట్స్లో కిరణ్ అనే కొత్త దర్శకుడితో బాక్సింగ్ నేపథ్యంలో ఓ కొత్త సినిమా చేస్తున్నాడు. ఇది వరుణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమా..
This post was last modified on April 23, 2020 10:48 am
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…