ది ఘోస్ట్ తర్వాత నాగార్జున కొంత బ్రేక్ తీసుకున్నాడు. ఈ బ్రేక్ లో రైటర్ ప్రసన్న తో ఒక సినిమా అలాగే మోహన్ రాజా చేయబోతున్న 100 సినిమాను సెట్ చేసుకున్నాడు. అయితే మోహన్ రాజా సినిమాకు ఇంకా టైమ్ తీసుకొనున్నాడు నాగ్. ఆ సినిమాలో అఖిల్ తో కూడా ఓ కేరెక్టర్ చేయించాలని మోహన్ రాజా భావిస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ లోపు ప్రసన్న కుమార్ సినిమాను కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడు నాగార్జున.
ప్రసన్న కుమార్ బెజవాడను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగ్ సినిమా చేస్తున్నారని ఎప్పుడో బయటికొచ్చేసింది. ఈ సినిమాలో కాస్టింగ్ డీటైల్స్ కూడా లీక్ అయ్యాయి. ఇదొక రీమేక్ అన్న సంగతి కూడా మేకర్స్ మెల్లగా లీక్ చేసేశారు. అయితే ఇంత వరకూ ఈ సినిమాను ఎనౌన్స్ చేయకుండా ఇంకా అక్కినేని ఫ్యాన్స్ ను వెయిట్ చేయిస్తున్నారు.
నిజానికి ప్రసన్న ఈ సినిమాకు సంబందించి కొంత ఘాట్ కూడా చేసేశారు. పల్లెటూరి నేపథ్యంలో కామెడీ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబందించి సంక్రాంతి టైమ్ లో అమలాపురంలో కొన్ని మంటేజ్ షాట్స్ తీశారు. అక్కడ జరిగే ప్రభల తీర్థంను సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు.
సంక్రాంతి తర్వాత సినిమా ఎనౌన్స్ మెంట్ అనుకున్నారు కానీ మెల్లగా వాయిదా వేస్తూ వస్తున్నారు. మార్చ్ లో ఉగాదికి ఈ సినిమా ఓపెనింగ్ జరగనుందని టాక్ ఉంది. ఎనౌన్స్ మెంట్ లేకుండా డైరెక్ట్ గా ఓపెనింగ్ పెట్టేసుకొని గ్రాండ్ లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు మానస వారణాసి ను ఒక హీరోయిన్ గా ఫైనల్ చేసుకున్నారని తెలుస్తుంది. ఇందులో అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ స్పెషల్ కేరెక్టర్స్ చేయబోతున్నారు. అల్లరి నరేష్ పాత్ర కాస్త నిడివి ఎక్కువ ఉండనుందని సమాచారం.
This post was last modified on February 28, 2023 11:18 pm
ఈ మధ్య కాలంలో ఇండియాలో పెద్ద వివాదానికి దారి తీసిన సినిమా అంటే.. ‘ఎల్2: ఎంపురాన్’ అనే చెప్పాలి. తమ…
దేశంలో `వన్ నేషన్-వన్ ఎలక్షన్` పేరుతో ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించాలని.. కేంద్రం తలపోస్తున్న విషయం తెలిసిందే. దీనిపై…
ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే తెలుగులోనే కాదు హిందీలోనూ పెద్ద బ్రాండ్. శివ నుంచి సర్కార్ దాకా ఎన్నో…
టాలీవుడ్లో విపరీతంగా సోషల్ మీడియా ట్రోలింగ్ ఎదుర్కొనే ఫ్యామిలీ ఏదంటే.. మంచు వారి వైపే చూపిస్తారు ఎవరైనా. తమ మీద…
మీనాక్షి నటరాజన్… .పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా. నిజమే… ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీగా బాధ్యతలు…
సీఎం చంద్రబాబు ప్రకటించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం పీ-4(పబ్లిక్-ప్రైవేటు-పీపుల్స్-పార్టనర్షిప్)కు ఉన్నత స్థాయి వర్గాల నుంచి స్పందన వస్తోంది. సమాజంలోని పేదలను ఆదుకుని..…