గత దశాబ్ద కాలంలో ప్రభాస్ కాకుండా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన సౌత్ హీరోల్లో ధనుష్ ముందుంటాడు. ముందు అతణ్ని చూసి వేరే భాషల వాళ్లు ఇతనేం హీరో అనుకున్నారు కానీ.. తన టాలెంట్ ఏంటో తెలిశాక సలాం కొట్టారు. బాలీవుడ్లో రాన్జానా, షమితాబ్ సినిమాలతో ధనుష్ వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు.
తొలి సినిమా పెద్ద విజయం సాధించినా.. రెండో సినిమా నిరాశ పరచడంతో ధనుష్ మళ్లీ బాలీవుడ్లో సినిమా చేయలేదు. ఐతే చాలా గ్యాప్ తర్వాత ధనుష్ మళ్లీ ఓ బాలీవుడ్ సినిమాలో నటించబోతున్నాడు. హిందీలో ‘రాన్జానా’ చిత్రంతో ధనుష్కు గ్రాండ్ ఎంట్రీ ఇప్పించిన ఆనంద్యే అతడి కొత్త చిత్రానికి దర్శకుడు. హృతిక్ రోషన్-ధనుష్-సారా అలీ ఖాన్ కలయికలో తానొక మల్టీస్టారర్ మూవీ తీయబోతున్నట్లు ఆనంద్ ఇంతకుముందు ప్రకటించాడు.
ఐతే ఈ చిత్రంలో హృతిక్ స్థానంలోకి అక్షయ్ కుమార్ వచ్చాడు. ఈ సినిమా కరోనా విలయం సాగుతున్న ఈ సమయంలోనే సెట్స్ మీదికి వెళ్లిపోవడం విశేషం. అది కూడా ధనుష్ స్వరాష్ట్రంలోనే చిత్రీకరణ మొదలు పెట్టడం విశేషం. ధనుష్, సారాల ఆన్ లొకేషన్ పిక్ కూడా బయటికి వచ్చింది. గత హిందీ సినిమాలతో పోలిస్తే ధనుష్ స్మార్ట్గా, మోడర్న్గా ఉండే పాత్ర చేయబోతున్నాడని అతడి లుక్ చూస్తే అర్థమవుతోంది.
తమిళనాడులో చెన్నై తర్వాత పెద్ద సిటీ అయిన మధురైలో చిత్రీకరణ మొదలుపెట్టాడు ఆనంద్. దేశంలో కరోనా ప్రభావం బాగా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. అలాంటి చోట మాస్ సిటీ అయిన మధురైలో ఈ బాలీవుడ్ మెగా మూవీ చిత్రీకరణ మొదలుపెట్టడం విశేషమే. హిందీలో అక్షయ్ లాంటి పెద్ద స్టార్తో కలిసి ధనుష్ నటిస్తే ఆ సినిమా అతడికెంతో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. మరి ఈ సినిమాతో ధనుష్ బాలీవుడ్లో ఈసారి ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.
This post was last modified on July 27, 2020 3:16 pm
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…