అక్షయ్ కుమార్.. ఈ పేరు వింటే దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లలో ఒక భరోసా ఉండేది ఒకప్పుడు. తనతో సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ అనే నమ్మకంతో ఉండేవాళ్లు అందరూ ఒకప్పుడు. మిగతా స్టార్ హీరోల మాదిరి కథల ఎంపికలో, సినిమాలు చేయడంలో అక్షయ్ నాన్చేవాడు కాదు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే రెండు మూడు కథలు ఓకే చేసేవాడు. సినిమా మొదలుపెడితే రెండు మూడు నెలల్లో అవగొట్టేసేవాడు.
ఏడాదికి మూణ్నాలుగు రిలీజ్లు ఉండేలా చూసుకునేవాడు. కానీ అలా గ్యాప్ లేకుండా, తక్కువ టైంలో సినిమాలు చేస్తూ కూడా క్వాలిటీ మెయింటైన్ చేసేవాడు. వేరే హీరోలు ఏళ్లకు ఏళ్లు టైం తీసుకుని చేసే సినిమాల కంటే అక్షయ్ కొన్ని నెలల్లో పూర్తి చేసే సినిమాలే మెరుగ్గా ఉండేవి. అతడి సినిమాలకు మినిమం ఓపెనింగ్స్ ఉండేవి. తక్కువ బడ్జెట్లో సినిమాలు చేయడం వల్ల టాక్ తేడా కొట్టినా సేఫ్ జోన్లో ఉండేవి. టాక్ బాగుంటే బ్లాక్ బస్టర్ అయ్యేవి.
రౌడీ రాథోడ్, ఓఎంజీ, స్పెషల్ చబ్బీస్, వన్స్ అపాన్ ఎ టైం ఇన్ ముంబయి, బేబీ, ఎయిర్ లిఫ్ట్, రుస్తుం, హౌస్ ఫుల్-3, టాయ్లెట్: ఏక్ ప్రేమ్కథ.. ఇలా కొన్నేళ్ల ముందు ఇబ్బడి ముబ్బడిగా హిట్లు కొట్టాడు అక్షయ్. బాలీవుడ్లో టాప్ స్టార్లయిన ఖాన్లను మించి అతను వార్షికాదాయం అందుకున్నాడు ఒక టైంలో. వాళ్లు ఒక్కో సినిమాకు ఎక్కువ పారితోషకం తీసుకున్నా.. అక్షయ్ ఏడాదిలో ఎక్కువ సినిమాలు చేయడం వల్ల వారిని మించి ఆర్జిస్తూ పైకి వెళ్లిపోయాడు. ఇలా వైభవం చూసిన హీరో.. ఇప్పుడు దయనీయమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాడు.
కరోనా తర్వాత అతడి సినిమాలు దారుణాతి దారుణమైన ఫలితాలు అందుకుంటున్నాయి. ఒక్క సూర్యవంశీ మాత్రమే బాగా ఆడింది. ఆ తర్వాత వచ్చిన బచ్చన్ పాండే, పృథ్వీరాజ్, రక్షాబంధన్, రామ్ సేతు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. ఓటీటీలో రిలీజైన కట్ పుట్లి సైతం నిరాశ పరిచింది. తాజాగా అక్షయ్ నుంచి వచ్చిన ‘సెల్ఫీ’ సినిమా అతడి కెరీర్ను పాతాళంలోకి తీసుకెళ్లిపోయింది. తన మార్కెట్ను దారుణంగా దెబ్బ తీసింది. ఈ ప్రభావం అక్షయ్ తర్వాతి సినిమాల మీద కూడా పడేలా ఉంది. వాటిని కొనడానికి బయ్యర్లు భయపడేలా ఉంది. బిజినెస్ జరగడం కష్టమయ్యేలా ఉంది. కొన్నేళ్ల ముందు వరకు బాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా ఉన్న అక్షయ్ చూస్తుండగానే ఇలా పతనం అయిపోవడం అనూహ్యం.
This post was last modified on February 28, 2023 4:06 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…