ఒక సినిమాను రిలీజ్ కంటే ముందే ప్రేక్షకులకి ప్రీమియర్ షోల ద్వారా చూపించడానికి దర్శక నిర్మాతలకు ఎంతో దైర్యం ఉండాలి. ఆ రిస్క్ చేసి నిర్మాత ముందడుగు వేస్తే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉందనుకోవచ్చు. అయితే అన్ని సార్లు అలాంటి కంటెంట్ ఎక్స్ పెక్ట్ చేయలేం కూడా. ముందు ప్రీమియర్స్ వేసి బోల్తా కొట్టిన సినిమాలు కూడా ఉదాహరణగా కనిపిస్తున్నాయి.
ప్రీమియర్ షోస్ మనకి కొత్తేం కాదు. ఇది వరకూ చాలానే సినిమాలు ఇలా ముందే ప్రదర్శించారు. కానీ ప్రస్తుతం ప్రీమియర్ షోలు పబ్లిసిటీకి ప్రధాన అస్త్రంగా మారుతున్నాయి. ఈ మధ్య ఈ ప్రీమియర్ షోస్ ట్రెండ్ ను మళ్ళీ స్టార్ట్ చేసి దాన్ని తన పబ్లిసిటీ స్టంట్ గా వాడుకున్నాడు అడివి శేష్ . రిలీజ్ వారం ముందే కొన్ని ప్లేస్ లు సెలెక్ట్ చేసి ముందే షోస్ వేయడంతో మేజర్ కి మంచి బజ్ వచ్చింది. దీంతో సినిమా మంచి ఓపెనింగ్స్ అందుకుంది.
ఇటీవలే రైటర్ పద్మభూషణ్ అనే చిన్న సినిమాకు కూడా ఇలానే కొన్ని ఏరియాలు సెలెక్ట్ చేసుకొని లిమిటెడ్ గా ప్రీమియర్ షోస్ వేశారు. దీన్ని తీసింది కూడా మేజర్ నిర్మాతలే. కాబట్టి ఆ పబ్లిసిటీ స్టంట్ ఇక్కడ కూడా పనైంది. ఇదే కోవలో లేటెస్ట్ గా సార్ కి కూడా ప్రీమియర్స్ పడ్డాయి. ముందు రోజు అప్పటి కప్పుడు తీసుకున్న నిర్ణయం సినిమా రిజల్ట్ కి పనికొచ్చింది. ఆ ప్రీమియర్ షోస్ ‘సార్’ కి మంచి ఓపెనింగ్స్ తీసుకురావడమే కాకుండా సక్సెస్ కూడా అందించాయి.
ఇప్పుడు దిల్ రాజు కూడా తన కొత్త బేనర్ నుండి వస్తున్న ‘బలగం’ అనే చిన్న సినిమాకు ప్రీమియర్ షో అనే అస్త్రాన్ని వాడుకుంటున్నాడు. ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్స్ వేశారు. రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. ఈ చిన్న సినిమాకి కూడా ప్రీమియర్స్ అస్త్రం వర్కవుటై, ఓపెనింగ్స్ తీసుకొస్తే వీటన్నిటినీ చూసి ఇకపై అందరూ ఇదే ఫాలో అవ్వడం ఖాయం.
This post was last modified on February 28, 2023 10:15 am
కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు.…
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…