ఒక సినిమాను రిలీజ్ కంటే ముందే ప్రేక్షకులకి ప్రీమియర్ షోల ద్వారా చూపించడానికి దర్శక నిర్మాతలకు ఎంతో దైర్యం ఉండాలి. ఆ రిస్క్ చేసి నిర్మాత ముందడుగు వేస్తే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉందనుకోవచ్చు. అయితే అన్ని సార్లు అలాంటి కంటెంట్ ఎక్స్ పెక్ట్ చేయలేం కూడా. ముందు ప్రీమియర్స్ వేసి బోల్తా కొట్టిన సినిమాలు కూడా ఉదాహరణగా కనిపిస్తున్నాయి.
ప్రీమియర్ షోస్ మనకి కొత్తేం కాదు. ఇది వరకూ చాలానే సినిమాలు ఇలా ముందే ప్రదర్శించారు. కానీ ప్రస్తుతం ప్రీమియర్ షోలు పబ్లిసిటీకి ప్రధాన అస్త్రంగా మారుతున్నాయి. ఈ మధ్య ఈ ప్రీమియర్ షోస్ ట్రెండ్ ను మళ్ళీ స్టార్ట్ చేసి దాన్ని తన పబ్లిసిటీ స్టంట్ గా వాడుకున్నాడు అడివి శేష్ . రిలీజ్ వారం ముందే కొన్ని ప్లేస్ లు సెలెక్ట్ చేసి ముందే షోస్ వేయడంతో మేజర్ కి మంచి బజ్ వచ్చింది. దీంతో సినిమా మంచి ఓపెనింగ్స్ అందుకుంది.
ఇటీవలే రైటర్ పద్మభూషణ్ అనే చిన్న సినిమాకు కూడా ఇలానే కొన్ని ఏరియాలు సెలెక్ట్ చేసుకొని లిమిటెడ్ గా ప్రీమియర్ షోస్ వేశారు. దీన్ని తీసింది కూడా మేజర్ నిర్మాతలే. కాబట్టి ఆ పబ్లిసిటీ స్టంట్ ఇక్కడ కూడా పనైంది. ఇదే కోవలో లేటెస్ట్ గా సార్ కి కూడా ప్రీమియర్స్ పడ్డాయి. ముందు రోజు అప్పటి కప్పుడు తీసుకున్న నిర్ణయం సినిమా రిజల్ట్ కి పనికొచ్చింది. ఆ ప్రీమియర్ షోస్ ‘సార్’ కి మంచి ఓపెనింగ్స్ తీసుకురావడమే కాకుండా సక్సెస్ కూడా అందించాయి.
ఇప్పుడు దిల్ రాజు కూడా తన కొత్త బేనర్ నుండి వస్తున్న ‘బలగం’ అనే చిన్న సినిమాకు ప్రీమియర్ షో అనే అస్త్రాన్ని వాడుకుంటున్నాడు. ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్స్ వేశారు. రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. ఈ చిన్న సినిమాకి కూడా ప్రీమియర్స్ అస్త్రం వర్కవుటై, ఓపెనింగ్స్ తీసుకొస్తే వీటన్నిటినీ చూసి ఇకపై అందరూ ఇదే ఫాలో అవ్వడం ఖాయం.
This post was last modified on February 28, 2023 10:15 am
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…