ఇండియాలో బయోపిక్ ట్రెండ్కు ఊపు తెచ్చింది బాలీవుడ్డే. ముఖ్యంగా స్పోర్ట్స్ స్టార్ల జీవితాలను వెండితెరపై గొప్పగా ప్రెజెంట్ చేసి కొన్ని ఘనవిజయాలు అందుకుంది. మిల్కాసింగ్, ధోని లాంటి క్రీడా దిగ్గజాల జీవిత కథలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. కానీ ఒక దశ దాటాక ప్రతి స్పోర్ట్స్ స్టార్ జీవితాన్నీ తెరపైకి తెచ్చేయడంతో ప్రేక్షకులకు ఈ జానర్ పట్ల మొహం మొత్తేసింది.
సైనా నెహ్వాల్, మిథాలీ రాజ్ లాంటి క్రీడాకారిణుల బయోపిక్స్ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టాయి. ఐతే ఇప్పుడు ఓ సెన్సేషనల్ క్రికెట్ హీరో జీవితాన్ని తెరపైకి తేవడానికి ప్రయత్నం జరుగుతోంది. ఆ హీరో ఎవరో కాదు.. భారత క్రికెట్ రాతను మార్చిన మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ.
అభిమానులు ముద్దుగా దాదాగా పిలుచుకునే సౌరభ్ భారత క్రికెట్ మీద వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. 2000 మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం తర్వాత జట్టు పగ్గాలు అందుకుని టీమ్ ఇండియాను గొప్ప స్థాయికి తీసుకెళ్లాడు. సౌరభ్ బయోపిక్లో రణబీర్ కపూర్ నటించనున్నట్లుగా ఇటీవల జోరుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే ఈ ప్రచారాన్ని రణబీర్ ఖండించాడు.
దాదాకు ఇండియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు. ఆయన బయోపిక్ తీస్తే అది చాలా బాగుంటుంది. దాన్ని నేను ఇష్టపడతాను. కానీ ఆ సినిమాలో నేను నటిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారం నిజం కాదు. నన్ను ఇంత వరకు ఎవరూ స్పందించలేదు. దీనిపై నాకు ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నట్లున్నాయి అని రణబీర్ తేల్చేశాడు. ఇంతకుముందు సంజయ్ దత్ బయోపిక్లో నటించిన రణబీర్.. లెజెండరీ సింగర్ కిషోర్ కుమార్ బయోపిక్లో నటించనున్నట్లు ధ్రువీకరించడం విశేషం.
This post was last modified on February 28, 2023 10:02 am
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…