యాభై సినిమాల మైలురాయికి చేరువలో ఉన్న నిర్మాత దిల్ రాజు చిన్న చిత్రాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఎస్విసి కాకుండా తన పేరు మీదే కొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో నేటివిటీ ప్రాధాన్యంగా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో మొదలుపెట్టామని ఆ మధ్య రాజుగారు చెప్పారు. అందులో భాగంగానే బలగంని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టీమ్ విస్తృతంగా తిరుగుతూ ప్రమోషన్లు గట్రా చేస్తోంది. కొన్ని చోట్ల ప్రీమియర్లు జరిగాయి. ఇవాళ ట్రైలర్ లాంచ్ జరిగింది.
అదో స్వచ్ఛమైన పల్లెటూరు. ఊరందరికీ తల్లో నాలుకలా నడుచుకునే ఓ తాత. వయసు అనుభవం అన్నిటిలోనూ ఆ పెద్ద మనిషి మాటంటే అందరికీ గౌరవం. పేరెంత ఉన్నా మనవడు(ప్రియదర్శి)మాత్రం జాలీగా తిరుగుతూ ఉంటాడు. సరే పెళ్ళైతే దారిలో పడతాడేమోనని ఓ చక్కని పిల్ల(కావ్య కళ్యాణ్ రామ్)తో సంబంధం ఖాయం చేస్తారు. అయితే కాబోయే అల్లుడు మీద మామకు మంచి అభిప్రాయం ఉండదు. ఈలోగా ఈ కుటుంబంలో ఓ విషాదం తలెత్తుతుంది. తాత కాలం చేస్తాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఆ యువకుడి జీవితాన్ని ఎలా మలుపు తిప్పాయనేదే స్టోరీ.
కథను దాచకుండా స్పష్టంగా చూపించేశారు. తెలంగాణ విజువల్స్, బాష యాస అన్నీ సహజంగా ఉన్నాయి. కమెడియన్ గా పేరు తెచ్చుకున్న వేణు ఈ బలగంతో దర్శకుడిగా మారాడు. భీమ్స్ సెసిరోలియో సంగీతం, ఆచార్య వేణు ఛాయాగ్రహణం లాంటి మంచి టీమ్ నే సెట్ చేసుకున్నారు. కమర్షియల్ సినిమాలకు గ్రాండియర్లకు ఆదరణ ఎక్కువగా దక్కుతున్న ట్రెండ్ లో అసలు ఎలాంటి క్యాస్టింగ్ ఆకర్షణలు లేకుండా కేవలం కంటెంట్ ని నమ్ముకుని బలగం బృందం థియేటర్లలో అడుగు పెడుతోంది. మార్చి 3న పెద్దగా పోటీ లేకపోవడంతో మంచి రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు.
This post was last modified on February 27, 2023 10:42 pm
అది మార్చి.. ఎన్నికలకు 50 రోజులకు పైగానే సమయం ఉంది. సర్వేల సంస్థలు ప్రజలను కలుస్తున్నాయి. మీకు ఏ సీఎం…
తమిళనాడులో విజయ్ జయకేతనం ఎగరేశాక సినిమా తారల రాజకీయ ప్రభావం గురించి మళ్ళీ చర్చ మొదలయ్యింది. ముఖ్యంగా ముగ్గురు లెజెండ్స్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబోలో మూవీ అనౌన్స్ మెంట్ వచ్చాక అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న ఒకటే.…
టాలీవుడ్లో అత్యంత నిరాశాజనకంగా సాగిన వేసవి సీజన్లలో 2025 ఒకటి. ఆ సంవత్సరం ఒక్కటంటే ఒక్క పెద్ద హీరో సినిమా…
టాలీవుడ్లో హీరోగా బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చి.. తక్కువ టైంలోనే పెద్ద రేంజికి చేరుకుని.. ఆ తర్వాత సుదీర్ఘమైన ఫ్లాప్…
టీడీపీ ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తలపెట్టి రామాయల నిర్మాణానికి సంబంధించిన ఇక్కట్లు దాదాపు తొలిగిపోయాయి. ఆయన సొంత…