Movie News

తొలి సినిమా విడుదల ముంగిట దర్శకుడి మృతి

ఒక సినిమాకు సంబంధించి అన్నిటికంటే కష్టమైన విషయం, అతి పెద్ద బాధ్యత అంటే.. దర్శకత్వం వహించడమే. ఇది ఆషామాషీ విషయం అయితే కాదు. ఈ కల నెరవేర్చుకోవడానికి ఏళ్లకు ఏళ్లు ఎంతో కష్టపడుతుంటారు. సుదీర్ఘ కాలం ఎదురు చూస్తారు. అన్ని అడ్డంకులనూ అధిగమించి ఒక సినిమా తీసి.. అది రిలీజయ్యే క్షణం కోసం ఎంతో ఉత్కంఠగా, భావోద్వేగంతో ఎదురు చూస్తారు. కానీ ఇంకొన్ని రోజుల్లో ఆ మధుర క్షణాలు రాబోతుండగా.. తాను తీసిన సినిమాను వెండితెరపై చూసుకోకుండానే ప్రాణాలు వదలడం అంటే ఎంత దురదృష్టమో కదా? అలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాడు మలయాళ పరిశ్రమకు చెందిన జోసెఫ్ మను జేమ్స్.

2004లో విడుదలైన ‘ఐయామ్ క్యూరియస్’ అనే సినిమాలో బాల నటుడిగా నటించి.. యుక్త వయసు వచ్చాక అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు మలయాళ, హిందీ, కన్నడ సినిమాలకు పని చేసిన మను.. ‘నాన్సీ రాణి’ అనే సినిమాతో దర్శకుడిగా మారాడు.

గత ఏడాదే ‘నాన్సీ రాణి’ సెట్స్ మీదికి వెళ్లింది. ఆ సినిమా చిత్రీకరణ కూడా పూర్తయింది. చాలామంది కొత్త నటీనటులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. మరికొన్ని రోజుల్లోనే సినిమా విడుదల కావాల్సి ఉండగా.. ఇంతలో దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్ హఠాత్తుగా కన్నుమూశాడు. అతను కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మను ప్రాణాలు వదిలాడు. దీంతో మలయాళ సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది.

గత ఏడాది ‘అయ్యప్పనుం కోషీయుం’లో కీలక పాత్ర పోషించిన అనిల్ నెడుమంగడ్ ఒక నదిలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు వదలగా.. అంతకుముందు ఆ చిత్ర దర్శకుడు సాచి గుండెపోటుతో చనిపోయాడు. ఇప్పుడు మను లాంటి యువ దర్శకుడు చనిపోవడం ఇండస్ట్రీ జనాలను విషాదంలో ముంచెత్తింది.

This post was last modified on February 27, 2023 10:34 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

2 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

3 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

6 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

6 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

7 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

7 hours ago