బావ బావే పేకాట పేకాటే అన్నది నిర్మాత సురేష్ బాబు సిద్ధాంతం. అంత నిక్కచ్చిగా క్యాలికులేటెడ్ గా ఉంటారు కాబట్టే దశాబ్దాల తరబడి నెగ్గుకుంటూ రాగలిగారు. బిజినెస్ వ్యవహారాల్లో ఎమోషన్లు సెంటిమెంట్లకు చోటివ్వరు. నారప్ప, దృశ్యం 2 ఓటిటి విడుదల విషయంలో అభిమానుల నుంచి విపరీతమైన ఒత్తిడి, విమర్శలు వచ్చినా వెనక్కు తగ్గకుండా నో థియేటర్స్ అనేశారు. దాని వెనుక ఉన్న ఒకే కారణం పెట్టుబడిని రిస్క్ లో పెట్టకూడదనే ఉద్దేశమే. ఎంత స్వంత తమ్ముడి సినిమాలే అయినా తనతో ఉన్న భాగస్వామ్యులకు నష్టం రాకూడదనే ఆలోచనది.
అసలు విషయానికి వస్తే దగ్గుబాటి అభిరాంని హీరోగా పరిచయం చేస్తూ తేజ దర్శకత్వంలో రూపొందిన అహింస రిలీజ్ వ్యవహారం ఎంతకీ తేలడం లేదు. అతి పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, రానా తమ్ముడు, బాబాయ్ వెంకటేష్, రామానాయుడు తాతయ్య, ఇలా పవర్ ఫుల్ సెటప్ ఇంతా ఉన్నా అహింస మాత్రం పురిటినొప్పులు పడుతూనే ఉంది. షూటింగ్ టైంకి పూర్తి చేసినప్పటికి నిర్మాణానికి అయిన వ్యయం బిజినెస్ కోసం వస్తున్న ఆఫర్లకు మధ్య పొంతన కుదరడం లేదట. నెల రోజుల క్రితం వచ్చిన ట్రైలర్ బాగానే ఉన్నా అంచనాలు రేకెత్తించడంతో సక్సెస్ కాలేకపోయింది.
అందుకే మంచి డేట్లు మిస్ అవుతున్నా చూస్తూ ఉండటం తప్ప సురేష్ బాబు ఏం చేయలేకపోతున్నారని వినికిడి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు నిజంగా అనుకోవాలే ఇప్పటికిప్పుడు అహింసను రెండు రోజుల్లో రిలీజ్ చేసే కెపాసిటీ సురేష్ బాబుకుందని అందరికీ తెలుసు. రానా కూడా ఎందుకనో తమ్ముడి విషయంలో మౌనంగా ఉంటున్నాడే తప్ప చొరవ చూపించడం లేదు. కంబ్యాక్ దీంతో జరుగుతుందని ఆశలు పెట్టుకున్న తేజ మాత్రం ఒకపక్క ఇంటర్వ్యూలు మొదలుపెట్టేశారు. మరి ఈ అహింసకు ఎప్పుడు మోక్షం కలిగిస్తారో చూడాలి మరి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. సాధారణంగా జూన్ వచ్చిందంటే.. ఎండలు తగ్గుముఖం పట్టి..…
హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ కు ఇండియాలోనూ వీర ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు అర్థమైనా కాకపోయినా కల్ట్ మేకింగ్…
సినిమాల సక్సెస్ రేట్ పడిపోతోందని.. ఒకప్పట్లా జనం థియేటర్లకు రావట్లేదని ఈ మధ్య మన ఇండస్ట్రీలో తరచుగా ఆవేదన స్వరం…
గత వారం రోజులుగా ఓజి 2 గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభమవుతుందని,…
టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్… తనను తాను జనసేన అధినేత,…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణలోని హనుమకొండలో పర్యటించారు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కు…