బావ బావే పేకాట పేకాటే అన్నది నిర్మాత సురేష్ బాబు సిద్ధాంతం. అంత నిక్కచ్చిగా క్యాలికులేటెడ్ గా ఉంటారు కాబట్టే దశాబ్దాల తరబడి నెగ్గుకుంటూ రాగలిగారు. బిజినెస్ వ్యవహారాల్లో ఎమోషన్లు సెంటిమెంట్లకు చోటివ్వరు. నారప్ప, దృశ్యం 2 ఓటిటి విడుదల విషయంలో అభిమానుల నుంచి విపరీతమైన ఒత్తిడి, విమర్శలు వచ్చినా వెనక్కు తగ్గకుండా నో థియేటర్స్ అనేశారు. దాని వెనుక ఉన్న ఒకే కారణం పెట్టుబడిని రిస్క్ లో పెట్టకూడదనే ఉద్దేశమే. ఎంత స్వంత తమ్ముడి సినిమాలే అయినా తనతో ఉన్న భాగస్వామ్యులకు నష్టం రాకూడదనే ఆలోచనది.
అసలు విషయానికి వస్తే దగ్గుబాటి అభిరాంని హీరోగా పరిచయం చేస్తూ తేజ దర్శకత్వంలో రూపొందిన అహింస రిలీజ్ వ్యవహారం ఎంతకీ తేలడం లేదు. అతి పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, రానా తమ్ముడు, బాబాయ్ వెంకటేష్, రామానాయుడు తాతయ్య, ఇలా పవర్ ఫుల్ సెటప్ ఇంతా ఉన్నా అహింస మాత్రం పురిటినొప్పులు పడుతూనే ఉంది. షూటింగ్ టైంకి పూర్తి చేసినప్పటికి నిర్మాణానికి అయిన వ్యయం బిజినెస్ కోసం వస్తున్న ఆఫర్లకు మధ్య పొంతన కుదరడం లేదట. నెల రోజుల క్రితం వచ్చిన ట్రైలర్ బాగానే ఉన్నా అంచనాలు రేకెత్తించడంతో సక్సెస్ కాలేకపోయింది.
అందుకే మంచి డేట్లు మిస్ అవుతున్నా చూస్తూ ఉండటం తప్ప సురేష్ బాబు ఏం చేయలేకపోతున్నారని వినికిడి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు నిజంగా అనుకోవాలే ఇప్పటికిప్పుడు అహింసను రెండు రోజుల్లో రిలీజ్ చేసే కెపాసిటీ సురేష్ బాబుకుందని అందరికీ తెలుసు. రానా కూడా ఎందుకనో తమ్ముడి విషయంలో మౌనంగా ఉంటున్నాడే తప్ప చొరవ చూపించడం లేదు. కంబ్యాక్ దీంతో జరుగుతుందని ఆశలు పెట్టుకున్న తేజ మాత్రం ఒకపక్క ఇంటర్వ్యూలు మొదలుపెట్టేశారు. మరి ఈ అహింసకు ఎప్పుడు మోక్షం కలిగిస్తారో చూడాలి మరి.
This post was last modified on February 27, 2023 5:17 pm
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…