ఫిబ్రవరి నెల 2వ తేదీన కళా తపస్వి కె.విశ్వనాథ్ అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. ఇక ఇప్పుడు విశ్వనాథ్ శ్రీమతి జయలక్ష్మి ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందారు. విశ్వనాథ్ మరణించి ఇంకా నెల రోజులు కూడా కాకుండానే ఆమె మరణించడం నిజంగా షాక్ అనే చెప్పాలి. ఆమె వయస్సు 86 సంవత్సరాలు. అయితే ఆమె ఇంత వరకు ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలతో బాధపదలేదని తెలుస్తోంది.
అయితే భర్త మరణంతో ఆమె మానసికంగా కృంగిపోయినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో భర్త మరణించిన 24 రోజుల్లో ఆమె కూడా మృతి చెందడం తీరని లోటు. కె విశ్వనాథ్ మరణించిన కొద్ది రోజుల్లోనే అతని వెంటే భార్య జయలక్ష్మి కూడా మృత్యువాత పడటంతో వారి కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.
లెజెండరీ దర్శకుడిగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న వ్యక్తి కె విశ్వనాథ్. కళాతపస్వి బిరుదుని అలంకరించిన విశ్వనాథ్ తన సినిమాలతోనే ఆ పేరుకి సార్ధకత చేసుకున్నారు అని చెప్పాలి. శంకరాభరణం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అన్ని భాషలలో రిలీజ్ అయిన మొదటి పాన్ ఇండియా సినిమా అని చెప్పాలి. ఈ మూవీతో నేషనల్ అవార్డుని కూడా ఆయన సొంతం చేసుకున్నారు. ఇక విశ్వనాథ్ ప్రతి సినిమా ఒక ఆణిముత్యం లాంటిది.
92 ఏళ్ళ వయస్సులో విశ్వనాథ్ మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ ఓ గొప్ప దర్శకుడిని కోల్పోయింది అని చెప్పాలి. కె విశ్వనాథ్ చివరిగా అల్లరి నరేష్ తో శుభప్రదం అనే సినిమా చేశారు. ఈ సినిమా తర్వాత వయస్సు, ఆరోగ్య రీత్యా సినిమాలని దర్శకత్వం చేయడం వదిలేసారు. అయితే నటుడిగా తరువాత కొంతకాలం ట్రావెల్ చేశారు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…