కొన్నిసార్లు ఆలస్యాలూ మంచే చేస్తాయి. తీసేవి భారీ బడ్జెట్ లేని సింపుల్ ఎమోషనల్ కథలే అయినా చాలా గ్యాప్ తీసుకునే దర్శకుడు శేఖర్ కమ్ముల తన కొత్త సినిమాని ధనుష్ తో ప్రకటించి నెలలు దాటుతోంది. ఇప్పటిదాకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు. ముహూర్తమో మరొకటో కారణం కాదు. ఇంకా స్క్రిప్ట్ పనులే పూర్తి కాలేదట. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సీరియస్ సోషల్ ఇష్యూస్ మీద రాసుకుంటున్న శేఖర్ కమ్ముల వీలైనంత వరకు తానే రానాతో తీసిన లీడర్ పోలికలు రాకుండా జాగ్రత్త పడుతూ టైం గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదట.
రాజీ పడకూడదనే ఉద్దేశం అర్థమైపోవడంతో ధనుష్ తో పాటు నిర్మాతలూ సహకరిస్తునట్టు తెలిసింది. ఇదంతా ఒకరకంగా కలిసొచ్చేలా ఉంది. ఎందుకంటే నిన్నా మొన్నటి దాకా అంతగా గొప్పగా చెప్పుకునే మార్కెట్ లేని ధనుష్ కి సార్ బ్లాక్ బస్టర్ సక్సెస్ పెద్ద కిక్ ఇచ్చింది. డబ్బింగ్ మూవీ అయితే ఏదోలే అనుకోవచ్చు. కష్టపడి తెలుగు నేర్చుకుని మరీ బైలింగ్వల్ చేశాడు. నిజానికి అంత అవసరం లేదు. తమిళ వెర్షనే తీసి అనువదించినా సరిపోయేది. కానీ ఒరిజినాలిటీ కోసం కాంప్రోమైజ్ కాకపోవడంతో దాని ఫలితం చాలా గొప్పగా వచ్చింది.
రెండో వారంలోనూ ముఖ్యంగా వీకెండ్లో హౌస్ ఫుల్స్ తో దూకుడు కొనసాగించేలా చేసింది. దెబ్బకు ధనుష్ కి టాలీవుడ్ థియేట్రికల్ మార్కెట్ బాగా బలపడింది. ఎలాగూ కమ్ముల ధనుష్ ల కాంబోని తెరకెక్కిస్తున్నది ఏషియన్ ప్లస్ అమిగోస్ సంస్థలు కాబట్టి ప్రొడక్షన్ వేల్యూస్ భారీగా ఉంటాయి. జరిగే లేట్ ఎలాగూ అయ్యింది కాబట్టి కాస్త ఓపిక పడితే బెస్ట్ అవుట్ ఫుట్ ని ఆశించవచ్చు. వరుణ్ తేజ్ ఫిదాతో బ్లాక్ బస్టర్, నాగ చైతన్యతో లవ్ స్టోరీ సూపర్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల హ్యాట్రిక్ తో దీన్ని కొనసాగించే పట్టుదలతో ఉన్నారు. సరైన హీరోతో పాటు కాలమూ కలిసొచ్చింది
This post was last modified on February 26, 2023 6:30 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…