హిందీలో అంతంతమాత్రంగా కెరీర్ ని నెట్టుకొస్తున్న మృణాల్ ఠాకూర్ కు అందం నటన అన్నీ ఉన్నా టైం కలిసి రాక వేగంగా దూసుకెళ్లలేకపోయింది. అయితే ఏ ముహూర్తంలో దర్శకుడు హను రాఘవపూడి తనలో ప్రతిభ గుర్తించాడో కానీ సీతారామం ఇవ్వడం అది బ్లాక్ బస్టర్ కావడం చకచకా జరిగిపోయాయి. గ్లామర్ షోలతో మేజిక్ చేసే మృణాల్ ని అంత ఒద్దికైన సీత పాత్రలో అందంగా చూపించిన తీరు ఇక్కడ మంచి ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టింది. నాని 30లో ఆఫర్ కొట్టేయగా రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో సినిమాలో తనను తీసుకునే ఆలోచన జరుగుతోందని టాక్ ఉంది.
ఇదంతా ఏమో కానీ తాజాగా రిలీజైన సెల్ఫీలో మృణాల్ ఠాకూర్ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. కుడియే నీతేరి అంటూ సాగే పాటలో అక్షయ్ కుమార్ తో ఆడిపాడింది కానీ ఏ మాత్రం లాభం లేకపోయింది. అసలు సినిమానే ఎవరూ పట్టించుకోనప్పుడు ఇక ఈ క్యామియో గురించి ఎవరు అడుగుతారు. దీంతో ఇది కాస్తా బూడిదలో పోసిన పన్నీరయ్యింది. ఏదో హిట్ అయితే అవకాశాలు పెరుగుతాయని చూస్తే సెల్ఫీ బాలీవుడ్ టాప్ టెన్ డిజాస్టర్స్ వైపు పరుగులు పెడుతోంది. సినిమా మరీ దారుణంగా లేకపోయినా జనాలకు అక్షయ్ పట్ల ఉన్న నెగటివిటీ వసూళ్లను దెబ్బ కొట్టింది
ఇకపై మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే మంచిది. లక్కీగా మెగా పవర్ స్టార్ ప్రాజెక్టు కనక వస్తే స్టార్ లీగ్ లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం తనవి హిందీలో గుంరాహ్, పూజా మేరీ జాన్, పిప్పా విడుదలకు సిద్ధంగా ఉండగా ఆంఖ్ మిచోలి నిర్మాణంలో ఉంది. నానితో జట్టు కట్టింది. సో మరీ ఓవర్ బిజీగా అయితే లేదు కాబట్టి తెలుగు నుంచి వచ్చే ఆఫర్లను జాగ్రత్తగా వడబోసుకుని ఎంచుకుంటే పూజా హెగ్డే తరహాలో ఇక్కడే సెటిలైపోవచ్చు. ఆమె కూడా ఉత్తరాదిలో ఫెయిలయ్యాక దక్షిణాదికి వచ్చి టాప్ చైర్ అందుకోవడం తెలిసిందే
This post was last modified on February 26, 2023 2:08 pm
టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం క్లాసిక్స్ గా ప్రత్యేకమైన చోటు దక్కించుకునే అల్లూరి సీతారామరాజు ఇవాళ 50 వసంతంలోకి అడుగు…
గౌతమీపుత్ర శాతకర్ణి ద్వారా పీరియాడిక్ సినిమాలను తాను ఎంత బాగా డీల్ చేయగలనో నిరూపించుకున్నాక దర్శకుడు క్రిష్ రూటే మారిపోయింది.…
గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ…
కొన్ని ల్యాండ్ మార్క్ సినిమాలకు కాలదోషం ఉండదు. టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వీధుల దాకా తీసుకెళ్లి అక్కడ జెండా పాతేలా…
మాటల మాంత్రీకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తమ వ్యం గ్యాస్త్రాలు,…
ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్,…