క్రమంగా స్టార్ అట్రాక్షన్లు తోడవ్వడంతో వెబ్ సిరీస్ లు కూడా అంచనాలు మోసుకుంటూ రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో వచ్చిందే పులి మేక. ఫ్రమ్ ది రైటర్ అఫ్ వాల్తేరు వీరయ్యగా రచయిత కోన వెంకట్ ప్రత్యేకంగా ప్రమోట్ చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ నిన్న ఓటిటిలో విడుదలయ్యింది. లావణ్య త్రిపాఠితో పాటు ఆది సాయికుమార్ కి ఇదే డిజిటల్ డెబ్యూ. సోషల్ మీడియాలో ట్వీట్లు యాడ్లు చూశాక దీని మీద ప్రేక్షకుల్లో ఓ మోస్తరు అంచనాలు తలెత్తాయి. సగటున అరగంట చొప్పున మొత్తం ఎనిమిది ఎపిసోడ్లుగా ఈ పులి మేక రూపొందింది. మరి ఆటలో గెలిచింది ఎవరు.
ఓ సీరియల్ కిల్లర్ వరసగా పోలీస్ ఆఫీసర్లను హత్య చేస్తూ ఉంటాడు. ఎలాంటి క్లూస్ లేక హంతకుడెవరో తెలియని పరిస్థితుల్లో కేసుని ఛేదించేందుకు ప్రత్యేక అధికారి కిరణ్ ప్రభ(లావణ్య త్రిపాఠి) రంగంలోకి దిగుతుంది. ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ హెడ్ ప్రభాకర్ (ఆది సాయికుమార్)తనకు సహాయం చేస్తూ ఉంటాడు. చిక్కుముడులు విప్పేకొద్దీ అనూహ్యమైన వాస్తవాలు బయట పడతాయి. మర్డర్లు చేసిందెవరో తెలుసుకునే క్రమంలో ప్రభను ప్రమాదాలు చుట్టుముడతాయి. పలు ట్విస్టుల తర్వాత అతన్ని పట్టుకోవడానికి ఆమె ఎలాంటి వల పన్నిందనేదే స్టోరీ.
కథపరంగా చూసుకుంటే కొంచెం ఇలాంటి లైన్ తోనే ఆ మధ్య మళయాలంలో కుంచకో బోబన్ అంజమ్ పాతిర వచ్చింది. మిడ్ నైట్ మర్డర్స్ పేరుతో డబ్ కూడా చేశారు. అయితే పులి మేక వెబ్ సిరీస్ కావడంతో లెన్త్ కోసం మెయిన్ ప్లాట్ కు సంబంధం లేని ఎమోషన్లు, లవ్ ట్రాక్ ఇరికించడంతో మొదటి నాలుగు ఎపిసోడ్లు సోసోగానే సాగుతాయి. అసలు మలుపులన్నీ ఆ తర్వాత పెట్టడంతో ఆసక్తి పెరగడం అక్కడి నుంచి మొదలవుతుంది. చక్రవర్తి రెడ్డి టేకింగ్ ఓకే అనిపించినా అసలైన స్క్రిప్ట్ విషయంలో సరైన కసరత్తు జరగలేదు. ఎంత భారంగా ఉన్న సరే టైంపాస్ కావాలంటే తప్ప పులిమేక ఛాయస్ గా నిలవదు.
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…