ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 12 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఖచ్చితంగా ఆ డేట్ కి కట్టుబడతారా లేదానేది ఇప్పుడే చెప్పలేం కానీ ఆ టార్గెట్ కి అనుగుణంగా దర్శకుడు నాగ అశ్విన్ ఒకపక్క షూటింగ్ ని బ్యాలన్స్ చేసుకుంటూనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారు. విఎఫెక్స్ కంపెనీలకు డెడ్ లైన్ ఇవ్వడం కోసమే ఇలా ప్రకటన ఇచ్చారన్న కామెంట్లు లేకపోలేదు. నిర్మాత అశ్వినిదత్ ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చినప్పుడు దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ తీసుకోవచ్చు.
ఇప్పుడీ ప్రాజెక్ట్ కె సాంకేతిక వర్గంలో ఓ కీలక మార్పు ఫ్యాన్స్ కి కొత్త జోష్ ఇస్తోంది. సంగీత దర్శకుడిగా సంతోష్ నారాయణన్ ఈ టీమ్ తో జాయిన్ కాబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంతకు ముందు మిక్కీ జె మేయర్ ఉన్నారు. ఇంత గ్రాండ్ స్కేల్ లో రూపొందుతున్న ప్యాన్ వరల్డ్ మూవీకి అతను న్యాయం చేయలేరు అనుకున్నారో లేక ఎక్కువ సమయం యుఎస్ లోనే ఉంటారు కాబట్టి కమ్యూనికేషన్ ఇబ్బందవుతుందన్న ఉద్దేశమో బయటకి చెప్పలేదు కానీ మొత్తానికీ మార్పు అభిమానులకు ఉత్సాహాన్ని తీసుకొస్తోంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు.
సంతోష్ నారాయణన్ బెస్ట్ ఛాయస్ అవుతాడు. నాని దసరాకు కంపోజర్ తనే. టీజర్ లో బీజీఎమ్, ఆన్లైన్లో రిలీజ్ చేసిన పాటలు ఆల్రెడీ జనానికి ఎక్కేశాయి. నేపధ్య సంగీతం ఇవ్వడంలో రెహమాన్, హరీష్ జైరాజ్ ల రేంజ్ తన నుంచి ఆశించవచ్చు. అందుకే ప్రాజెక్ట్ కెకి ఏరికోరి మరీ ఎంపిక చేసుకున్నట్టు తెలిసింది. తమన్ లాంటి ఆప్షన్ ఉన్నా ఆల్రెడీ బోలెడు ప్యాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న తనకు ఈ ప్రాజెక్టు కె కూడా ఇస్తే ఇబ్బందెందుకని ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఏడాదిలో ఫిబ్రవరి కూడా అయిపోతోంది. ఇంకో పదే నెలల్లో ప్రాజెక్ట్ కె తెరపైకి వచ్చేస్తుంది.
This post was last modified on February 25, 2023 11:16 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…